More

ఎంపెసా కస్టమర్లకు వొడాఫోన్ అవుట్లెట్లలో నగదు

12 Dec, 2016 15:08 IST
ఎంపెసా కస్టమర్లకు వొడాఫోన్ అవుట్లెట్లలో నగదు

న్యూఢిల్లీ: నగదు కొరత నేపథ్యంలో... వొడాఫోన్ ఎంపెసా కస్టమర్లు సంస్థకు చెందిన రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా నగదు పొందవచ్చని ఆ సంస్థ గురువారం తెలియజేసింది. నగదు కోసం వొడాఫోన్ కస్టమర్లు బ్యాంకు ఏటీఎంల వద్ద క్యూలలో నించువోవాల్సిన అవసరం లేదని సూచించింది. బ్యాంకు శాఖలకు సమాంతరంగా దేశవ్యాప్తంగా తాము 1,20,000 ఎంపెసా అవుట్‌లెట్లను సిద్ధం చేసినట్టు పేర్కొంది. కస్టమర్లు వీటిలో ఏదేనీ అవుట్‌లెట్‌కు వెళ్లి క్యాష్ అవుట్ సదుపాయం ద్వారా తమ డిజిటల్ వాలెట్ నుంచి నగదును వెనక్కి తీసుకోవచ్చని ఎంపెసా అధిపతి సురేష్ సేతి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం కస్టమర్లు తమ వెంట గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలని సూచించారు. అందుబాటును బట్టి నగదు పొందే సౌలభ్యం ఉందన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అదానీ గ్రూప్‌ చేతికి సంఘీ ఇండస్ట్రీస్‌ 

2030 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్‌!

దూసుకెళ్లిన షేర్లు.. 13లక్షల కోట్లకు చేరిన అదానీ గ్రూప్‌ కంపెనీల విలువ!

కీలక నిర్ణయం.. వందల కోట్ల విలువైన మెటా షేర్లు అమ్మిన మార్క్ జూకర్‌ బర్గ్‌!

ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా భారత్‌