More

లేబర్‌ కోర్టును ఆశ్రయించిన టెకీలు

11 Aug, 2017 16:38 IST
లేఆఫ్స్‌పై లేబర్‌ కోర్టును ఆశ్రయించిన టెకీలు

సాక్షి, బెంగుళూరు‌: టెక్‌ మహీం‍ద్రలో ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో మహారాష్ట్ర కార్మిక శాఖ విఫలం కావడంతో ఐటీ ఉద్యోగుల ఫోరం 11 వివాదాలకు సంబంధించి లేబర్‌ కోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించింది. బాధిత ఉద్యోగులు పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 2 ఏ కింద పిటిషన్లు వేశారని ఫోరం కో-ఆర్డినేటర్‌ ఇలవరసన్‌ రాజా తెలిపారు. ఈ సెక్షన్‌ ప్రకారం ఏ ఉద్యోగినైనా సంస్థ తొలగించిన పక్షంలో దాన్ని పారిశ్రామిక వివాదంగా పరిగణిస్తారు.

కాగా దీనిపై స్పందించిన టెక్‌ మహీం‍ద్ర న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. గతంలో ఓ ఉద్యోగిని బలవంతంగా తొలగిం‍చేలా కంపెనీ హెచ్‌ఆర్‌ అధికారులు వ్యవహరించిన ఆడియో క్లిప్‌లు వెలుగు చూడటంతో మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా క్షమాపణలు వేడుకున్న విషయం తెలిసిందే. పలు ఐటీ కంపెనీలు ఇటీవల ఉద్యోగులను పెద్దసంఖ్యలో తొలగిస్తున్నాయి. విప్రో, కాగ్నిజెంట్‌ సహా పలు ఐటీ కంపెనీలు సామర్థ్య మదింపు పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఆ క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌తో వారికి ఎలాంటి సంబంధం లేదు: డాబర్‌ గ్రూప్‌

127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు.. సెబీకి పంపిన సుబ్రతా రాయ్‌.. కారణం ఇదేనా?

‘ఎక్స్’ స‌మాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు

రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి.. ఎందుకంటే.. : ఇన్ఫోసిస్ మూర్తి