More

పెట్రో వాత : ఆగస్టునుంచి ఎంత?

2 Oct, 2018 10:58 IST

సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్టస్థాయిలకు చేరుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోలు ధరలు కూడా ఏ రోజుకారోజు ఆల్‌టైం గరిష్టాలను నమోదు చేస్తున్నాయి.  ఈ క్రమంలో మంగళవారం లీటరు పెట్రోలు ధర మరో12 పైసలు పెరగగా, డీజిల్‌ ధర లీటరుకు 16పైసలు పైకి ఎగబాకింది.  బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ధర సోమవారం 83.21 డాలర్ల నుంచి బ్యారెల్‌కి  85 డాలర్లకు చేరింది.  త్వరలోనే  బ్యారెల్‌కు 100 డాలర్లు తాకే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

ఆగస్టు మధ్యకాలం నుంచి పెట్రోలు లీటరుకు 6.50 రూపాయల మేరకు పెరిగాయి. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రోజువారీ పెట్రోలు, డీజిల్‌ ధరలు  మండిపోతున్నాయి.  అంతర్జాతీయ ముడి చమురు ధరల పెంపు డాలరు మారకంలో  రూపాయి విలువ అంతకంతకూ మరింత దిగజారుతోంది. దేశీయకరెన్సీ  డాలరు మారకంలో  సోమవారం 72.91 వద్ద ముగిసింది.

 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పిల్లలు ఇష్టపడే యానిమేటెడ్‌ సిరీస్‌.. ఫ్రీగా చూసేయండి..

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై.. మరోసారి ట్రెండింగ్‌లో హైదరాబాద్

భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే?

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు

మొరాయించిన చాట్‌జీపీటీ.. ఖంగుతిన్న కస్టమర్లు - కారణం ఏంటంటే?