More

ఒకే కంపెనీగా టాటా రక్షణ, ఏరోస్పేస్‌ విభాగాలు 

12 Apr, 2018 01:00 IST

టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెనీ ఏర్పాటు  

ముంబై: వివిధ ఏరోస్పేస్, డిఫెన్స్‌ విభాగాలన్నింటినీ కలిపేసి ఒకే కంపెనీగా ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్‌ యోచిస్తోంది. టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ (టాటా ఏ అండ్‌ డీ)  కంపెనీ కిందకు అన్ని ఏరోస్పేస్, డిఫెన్స్‌ విభాగాలను తేనున్నామని టాటా సన్స్‌ తెలిపింది. దీనికి సంబంధించిన శాసన, నియంత్రణ ఆమోదాలు పొందే ప్రక్రియ కొనసాగుతోందని టాటా సన్స్‌  చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ తెలిపారు.

రక్షణ, విమానయాన రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్లాంట్లు తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్రలో ఉన్నాయని, ఈ ప్లాంట్లలో  మొత్తం 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్లాంట్లన్నింటినీ టాటా ఏ అండ్‌ డీ కిందకు తెస్తామని వివరించారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా టాటా ఏ అండ్‌ డీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.     

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు.. దిగ్గజ కంపెనీలన్నీ ఇండియన్స్ సారథ్యంలోనే!

యాక్సిస్ బ్యాంక్‌కు రూ.91 లక్షల జరిమానా - ఎందుకో తెలుసా!

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

ఇషా అంబానీకి ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌.. జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా మరో ఇద్దరు

పెట్టుబడుల వరద.. ‘సీనియర్‌ సిటిజన్‌’ ఇళ్లకు గిరాకీ