More

కుటుంబ సభ్యులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

8 Dec, 2019 19:43 IST

సాక్షి, హైదరాబాద్‌: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదివారం దిశ తల్లిదండ్రులను విచారించింది. తెలంగాణ పోలీస్‌ అకాడమీలో మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ముందు దిశ కుటుంబసభ్యులు హాజరయ్యారు. దిశ తండ్రి, సోదరి స్టేట్‌మెంట్‌లను ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం రికార్డు చేసింది. ఘటన రోజు ఏం జరిగిందో దిశ కుటుంబ సభ్యుల వివరాలను ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం తెలుసుకుంది.

నిందితులు ఎన్‌కౌంటర్‌ అయ్యారనే విషయం మీడియాలో వచ్చేవరకు తమకు తెలియదని దిశ కుటుంబసభ్యులు తెలిపారు. దిశ సంఘటనపై న్యాయం చేస్తామని కుటుంబసభ్యులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం హామీ ఇచ్చింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వైన్‌ షాప్‌నకు నిప్పు.. మద్యం ఇవ్వలేదని తగలబెట్టేశాడు!

దారుణం: తల్లి, ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన దుండగులు

400 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు!

నారాయణ మనుష్యులు మరీ..!

మెదక్‌లో పండగపూట విషాదం.. టపాసులు కొనడానికి వెళ్తుండగా..