శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం నీలం సాగర్ డ్యామ్లో సోమవారం సాయంత్రానికి 29.2457 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. జూరాల నుంచి విద్యుత్ ఉత్పాదన అనంతరం నీరు విడుదలవుతుండడంతో వరద నీరు వచ్చి చేరుతోంది. గడిచిన 24 గంటల్లో 31,692 క్యూసెక్కుల నీరు చేరుకుంది. సోమవారం ఒక జనరేటర్ ద్వారా జూరాల నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. డ్యాం నీటిమట్టం 800.50 అడుగులకు చేరుకుంది.
శ్రీశైలం డ్యామ్లో 29 టీఎంసీల నీరు నిల్వ
26 Jul, 2016 00:05 IST