More

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

14 Sep, 2016 00:37 IST

ఆత్మకూర్‌ : మండల పరిధిలోని బాలకిష్టాపూర్‌ తండాలో మంగళవారం రాత్రి 10:30గంటలకు వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుం ది. ఎస్‌ఐ సీహెచ్‌ రాజు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన మంగ్యానాయక్‌ (38) వినాయక నిమజ్జనంలో ఉన్న జనరేటర్‌ స్టార్ట్‌ కాకుండా మొరాయించింది. దాన్ని   స్టార్ట్‌ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయనకు భార్య శివమ్మ, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉంది. ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌