More

‘టీడీపీ నేతలు ఇకనైనా తెలుసుకోండి’

20 May, 2016 15:41 IST
‘టీడీపీ నేతలు ఇకనైనా తెలుసుకోండి’

ఒంగోలు: రాష్ట్రానికి ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీయే మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలస్యంగా తెలుసుకున్నారని, అదే విషయాన్ని టీడీపీ నేతలు కూడా తెలుసుకుంటే మంచిదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు సలహా ఇచ్చారు. ఒంగోలు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిదానికీ కేంద్రం వైపే వేలెత్తి చూపుతూ అధికార పార్టీ నేతలు విమర్శలు చేయటం మానుకోవాలని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీతో కలసి రావాలని వారిని కోరారు. ప్రత్యేక ప్యాకేజీని సాధించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌