More

బీజేపీ నేతలకు దొరకని ముఖ్యమంత్రి దర్శనం

3 Dec, 2016 00:02 IST

మడకశిర : సీఎం చంద్రబాబునాయుడు మడకశిరకు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గంలోని సమస్యలపై సీఎంకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన బీజేపీ నాయకులకు ఛేదనుభవం ఎదురైంది.  అయితే 25 మంది బీజేపీ నాయకులను అనుమతించమని స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తేల్చిచెప్పారు. ఇద్దరు లేదా ముగ్గురు వచ్చి సమస్యలపై వినతి పత్రం సమర్పించాలని సూచించారు. అందుకు బీజేపీ నాయకులు నిరాకరించారు.

ఈసందర్భంగా బీజేపీ నాయకుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ తాము టీడీపీతో కలిసి పని చేస్తున్నామని అయినా కూడా తమను ముఖ్యమంత్రి వద్దకు అనుమతించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగనాథ్, జయరామ్, లెంకప్ప, నాగలింగప్ప, ముద్దరాజు, నాగేంద్రబాబు, చంద్రప్ప పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌