More

పోలీసుల ఆదేశాలు పాటించండి

7 Sep, 2016 00:57 IST

– గణేష్‌ మండప నిర్వాహకులకు ఎస్పీ ఆదేశం
 
కర్నూలు:
వినాయక చవితిని పురస్కరించుకుని గణేష్‌ మండలి సభ్యులు పోలీసులు జారీ చేసిన ఆదేశాలు, సూచనలు, నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎస్పీ రవికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. నిబంధనలు పాటించని మండపాల నిర్వాహకులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
సూచనలు:
– వినాయక నిమజ్జనానికి వెళ్లే యువకులు, పిల్లలకు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తెలియజేయాలి.
– ఈత వచ్చిన వారే నిమజ్జనానికి వెళ్లాలి.
– నిమజ్జనం ప్రాంతానికి పిల్లలు వెళ్లకుండా చూడాలి.
– యువకులు మద్యం సేవించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు.
– సంబంధం లేని వ్యక్తులపై రంగులు చల్లే ఆకతాయిలపై చర్యలు.
– నిమజ్జన సమయంలో సాహసాలు చేయరాదు.
– ప్రజలకు అసౌకర్యం కలుగకుండా రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌ స్పీకర్లు ఆపేయాలి.
 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌