More

వివాహిత ఆత్మహత్య

17 Nov, 2016 23:12 IST

వల్లూరు: మండలంలోని కొప్పోలు గ్రామంలో శ్రావణి (27) అనే వివాహిత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కొప్పోలుకు చెందిన ఓబుళరెడ్డి భార్య శ్రావణి నాలుగేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి వెనుక ఉన్న బాత్‌రూమ్‌ వద్దకు వెళ్లి కిరసనాయిల్‌ మీద పోసుకుని నిప్పంటించుకుంది. శరీరం ఎక్కువగా కాలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి 3, 6 సంవత్సరాల వయసు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తండ్రి మహేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌