More

టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం

15 Nov, 2016 11:33 IST

విజయవాడ : తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మంగళవారమిక్కడ సమావేశమైంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది.  రేపటి నుంచి (బుధవారం) జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సభలో ప్రస్తావించడం, కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయడంపై ఈ భేటీలో దృష్టి సారిస్తారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌