→ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో విశాఖకు సరికొత్త ఖ్యాతి
→ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న నగరం
→ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
తూర్పు నావికాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం.. అనేక ఆధునిక యుద్ధ వ్యవస్థలతో మన సైనిక సంపత్తిలో కీలక స్థానం సంపాదించింది. నేడు అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శన నిర్వహించే స్థాయికి ఎదగింది. 50కి పైగా దేశాలు.. పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలు.. విమానాలు.. ఇతర ఆయుధ సంపత్తిలో యుద్ధ సన్నద్ధతను చాటే విన్యాసాలతో కనువిందు చేయనున్నాయి. అతి అరుదైన ఈ ఘట్టాన్ని.. దాని నేపథ్యాన్ని పాఠకుల కళ్లకు కట్టేందుకు నేటి నుంచి ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనాల సమాహారమే ‘ఫ్లీట్ ఫెస్ట్’..
ఏమిటీ ఫ్లీట్ రివ్యూ..
దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో ఎదురుదాడికి దిగగల సత్తా చాటేందుకు నావికాదళ విన్యాసాలు ప్రపంచదేశాలకు చాటేందుకు నిర్ధేశించినివే ఫ్లీట్ రివ్యూలు. భారత సుప్రీం కమాండర్ అయిన దేశాధ్యక్షుని గౌరవార్ధం ఈ విన్యాసాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే భారత్ 12 పర్యాయాలు ఈ విన్యాసాలు చేసింది. వాటిలో తూర్పు నావికా దళం భాగమైంది. అయితే తొలిసారిగా భారత తూర్పు తీరం అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు వేదికైంది. 2001లో ముంబయ్లో తొలిసారిగా భారతదేశం ఇటువంటి విన్యాసాలకు వేదికైంది.
ప్రపంచానికే నాగరికత నే ర్పిన దేశంలో తొలి టైడల్ డాక్ను భారత్ నిర్మించింది. చంద్రగుప్త కాలంనుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర పేర్కొంటున్నది. నాటినుంచి నేటి అణుజలాంతర్గాముల నిర్మాణంలోనూ స్వయంఛాలితంగా ఎదిగిన భారత్ ప్రపంచదేశాలను ఆకర్షిస్తూనే ఉంది. అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనతో తాజాగా ప్రపంచదేశాల
ఇప్పటికే యాభై దేశాలకు చెందిన యుద్ధనౌకలు విన్యాసాల్లో పాల్గొనేందుకు సుముఖత తెలపగా మరో 20 దేశాలకు చెందిన నౌకలు పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశప్రతిష్టకు ప్రతిభింబించే ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శన పాఠవాలను వీక్షించేందుకు ఒకే రోజు దేశాధ్యక్షునితో పాటు దేశప్రధాని విశాఖకు రానుండడంతో పాటు ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనేదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానుండడంతో ప్రపంచం యావత్తు విశాఖ తీరంవైపు దృష్టిసారించనుంది. ప్రబలశక్తిగా స్వయంగా అణుజలాంతర్గాముల్ని నిర్మించుకునే స్థాయికి ఎదిగిన భారత్ అందుకు ధీటుగా ప్రపంచ దేశాలను ఆకట్టుకోనుంది.
భారత్ ప్రదర్శనకు...
చైనా నేటికీ యుద్ధ విమానాలను తరలించే ఎయిర్క్రాఫ్ట్ కారియర్ను సముపార్జించుకునే స్థితిలోనే ఉండగా భారత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విరాట్లను ప్రదర్శించనుంది. ముందువరసలో దూసుకుపోయే 75 యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో భారత్ తరపున పొల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుట్ క్లాస్, కమోర్తా క్లాస్, షివాలిక్ క్లాస్, బ్రహ్మాపుత్ర క్లాస్ తదితర తరగతులకు చెందిన యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో
గగనతలంలో..
సముద్రంలో విన్యాసాలతో యుద్ధనౌకలు అలరిస్తే నావికా దళానికి చెందిన 45 యుద్ధ విమానాలు 15 వరుసల్లో గగనతలంలో దూసుకుపోనున్నాయి. మిగ్స్, ఎల్ఆర్ఎంలు, పి81లతో పాటు కెఎం తరహా హెలికాఫ్టర్లు ఈ ఫ్లైపాస్ట్ విన్యాసాల్లో పాల్గొనున్నాయి.
రిహార్సల్స్ : భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీనే ఐఎఫ్ఆర్ రిహార్సల్స్ ప్రారంభం కానున్నాయి. నౌకదళ యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, హెలికాఫ్టర్లు చేసే విన్యాసాలను విశాఖ తీరంలో ప్రజలు తిలకించేందుకు అవకాశం ఉంది. 27న నమూనా విన్యాసాలు, 31న యుద్ధనౌకల సమీక్ష జరగనుంది. ఫిబ్రవరి 3న అంతర్జాతీయ నగర కవాతు జరగనుంది.
చైనా నౌకలొస్తున్నాయి....
ఆసియాలో భారత్కు ధీటుగా ఉన్న చైనా దేశానికి చెందిన యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొనున్నాయి. అయితే పాకిస్తాన్కు మాత్రం ఈ విన్యాసాల్లో పాల్గొనే అవకాాశాలు లేకుండా ఉన్నాయి. ఇక యూరప్కు చెందిన వాణిజ్య నౌకలు ఈ విన్యాసాల్లో అలరించనున్నాయి. ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ప్రపంచ దేశాల యుద్ధనౌకలు తిరుగుపయనం కానున్నాయి.
ఏ రోజు ఏమిటి..?
విశాఖ సాగరతీరంలోని యుద్ధవీరుల స్మారకస్థూపం వద్ద పుష్పగుచ్చాన్ని వుంచి మౌనం పాటించిన తర్వాత అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. 1971లో దాయాది పాకిస్తాన్ భూభాగంలోని కరాచీ హర్బర్పై మిస్సైల్ బోట్లతో దాడికి దిగి విజయాన్ని సాధించడంలో అమరులైన నావికాదళ వీరుల స్మృత్యర్థం ఈ స్థూపం నిర్మించారు. దీన్నే విక్టరీ ఎట్ సీ గానూ పేర్కొంటారు.