పవన్‌తో సీపీఐ నేతల కీలక భేటీ

Published on Thu, 12/01/2016 - 18:30

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్‌తో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ భేటీకి ఏఐటీయూసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రావు కూడా హాజరయ్యారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు భూ సేకరణ కారణంగా ఉత్పన్నమవుతున్న సమస్యలు, నోట్లరద్దు తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించునట్లు జనసేన పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. భావసారూప్యత కలిగిన ప్రజా సమస్యలపై జనసేన, వామపక్షాలు కలిసి పోరాడే విషయం ఆలోచన చేసినట్లు రామకృష్ణ ప్రకటించారు. ఇది స్నేహపూర్వక భేటీ అని పవన్ పేర్కొన్నారు. సీపీఎం నేతలతో కలిసి మరోసారి పవన్తో భేటీ అవుతామని రామకృష్ణ తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ