-
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
గుంటూరు, సాక్షి: ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైఎస్సార్సీపీ శ్రేణులు.. రెట్టించిన జోష్తో కదిలాయి. పోలింగ్ సరళి, మహిళలు..వృద్ధులు.. దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వైఎస్సార్సీపీలో ఉత్సాహం ఉరకలేసింది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటూ.. వైఎస్సార్సీపీ శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.సజ్జల రామకృష్ణారెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిపై ఒక అంచనాకు వచ్చారు. పోటెత్తిన ఓటర్లు.. మహిళలు, వృద్దులు, గ్రామీణులే విజయాన్ని డిసైడ్ చేశారంటున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ 59 నెలల సంక్షేమ పాలనను మెచ్చి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 4 వరకు ఉత్కంఠ అక్కర్లేదంటూ.. ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెబుతున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి.ఇదీ చదవండి: ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలతఇక.. ‘‘ఓ వైపు కవ్వింపులు.. దాడులు.. మరోవైపు అసహనంతో టీడీపీ-జనసేన శ్రేణుల తీరు. పోలింగ్ సరళి మేరకు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతోంది. అసహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాయి ఆ పార్టీ కేడర్లు. ఇక ఓటర్లు సైతం ప్రలోభాలకు లొంగలేదు. ఓటమి భయంతో పచ్చ మూకల విధ్వంసకాండ దిగినా ఓటర్లు బెదర్లేదు. పోలింగ్ జరిగిన తీరు, ఉదయాన్నుంచే బారులు తీరిన ఓటర్లే వైఎస్సార్సీపీ గెలుపునకు సాక్ష్యం అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు. పచ్చ ముఠాల విధ్వంసకాండజనసేన కార్యకర్తల దౌర్జన్యంజమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడిపల్నాట పచ్చ మూక భీభత్సకాండఆగని టీడీపీ అరాచకాలు -
మంగళగిరి పోలింగ్ బూత్లో పవన్ ఓవరాక్షన్
గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ఓవరాక్షన్కు దిగారు. సోమవారం ఉదయం తన భార్య అన్నా లెజినోవాను, కొందరు అనుచరులను వెంట పెట్టుకుని పోలింగ్ సెంటర్లోకి తీసుకెళ్లి హల్ చల్ చేశారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్లో పవన్ ఓటేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంటపెట్టుకుని బూత్లోకి తీసుకెళ్లారు. అలాగే.. అక్కడ సెంటర్లో ఓటే లేని అనుచరుల్ని వెంట తీసుకెళ్లారు. బూత్లో కలియ దిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. పవన్ భార్య అన్నా లెజినోవాకు సైతం అక్కడ ఓటు లేదని సమాచారం. అయినా అధికారులు వాళ్లను లోపలికి ఎలా అనుమతించారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు.మరోవైపు పవన్ అలా వాళ్లందరినీ లోపలికి తీసుకెళ్తుంటే.. క్యూ నిల్చున్న కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలింగ్ సిబ్బంది ఆ అభ్యంతరాల్ని పట్టించుకోకపోవడం గమనార్హం. -
PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
గజ ఈతగాడు అన్నారు.. ఆకాశాన్నంటే హైప్ క్రియేట్ చేశారు... మనోడు లేస్తే పరశురాముడు గండ్ర గొడ్డలి తీస్తే హరిహరాదులు కూడా అడ్డుకోలేరు అన్నారు. అయన మౌనంగా కూర్చుంటే వశిష్ఠుడు అన్నారు.. ఒంటి చేత్తో కూటమి ముంగిటకు అధికారాన్ని తెచ్చి పడేసాడు అన్నారు. అన్న కన్నెర్ర చేస్తే భూమ్యాకాశములు ఏకమవుతాయన్నారు. పిడికిలి బిగించి గుద్దితే పిడుగులు కురుస్తాయి.. కన్నెర్ర చేస్తే నిప్పుల వాన.. ఆయన ప్రేమ ఆకాశం... ఆయన ఆగ్రహం అనంతం.. ఈ మాదిరి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ను మోశారు. పాపం సినిమావాడు కదా.. నమ్మేసాడు.. సినిమాల్లో ఐతే స్క్రిప్ట్ ప్రకారం నచ్చినట్లు రాసుకోవచ్చు.. పిడికిలి బిగిస్తే భూమి బద్దలయ్యేలా గ్రాఫిక్స్ పెట్టొచ్చు.. ఒంటి చేత్తో లక్షలాదిమందికి శాసించొచ్చు ఎందుకంటే వాళ్లంతా జూనియర్ ఆర్టిస్టులు కాబట్టి.. వింటారు.స్టూడియోలో స్క్రిప్ట్ ప్రకారం అట్ట కత్తులు తిప్పి పదులసంఖ్యలో శతృవులను కూల్చడం వేరు.. నిజంగా సమాజంలో నిలబడి.. ప్రజల మద్దతు పొందడం వేరు.. తన సినీగ్లామర్ చూసి జనం వస్తారు అంతవరకూ నిజమే కానీ వాళ్ళను ఆకట్టుకోవడం.. తన వ్యక్తిత్వం.. వ్యవహారశైలితోబాటు క్యారెక్టర్.. ఇవన్నీ చూసిగానీ ప్రజలు తనవెంట నడవరు. ప్రజలు.. సమాజం.. ఏమీ గమనించనట్లే ఉంటారు. కానీ అవకాశం వచ్చినపుడు నాయకులూ వేసే ప్రతి అడుగునూ ఆచితూచి చూసి అప్పుడు కానీ అనుసరించరు.. తన వెంట నడవరు.. పార్ట్ టైం నాయకుడైన పవన్కు ఇప్పుడు ఆ విషయం అర్థమైంది. జగన్ను, వైసీపీ నేతలను గుడ్డలూడదీసి కొడతాను.. సంకెళ్లు వేస్తాను.. ఇలాంటి డైలాగ్స్ పవన్ మానసిక సంతులితను తెలియజేస్తున్నాయి. దానికితోడు పిఠాపురంలో పవన్ మీద పోటీలో ఉన్న వంగా గీత తక్కువైనవ్యక్తి కాదు.. ముప్పయ్యేళ్లుగా ప్రజల్లో ఉంటూ ఎక్కడా మచ్చపడకుండా ప్రజల మద్దతుపొందుతూ వస్తున్నారు. గతంలో రెండు చోట్లా ఓడిపోయిన పవన్కు ఈసారి ఎలాగైనా చట్టసభలో అడుగిడాలని కోరిక బలపడింది. అయితే ఇప్పుడు పిఠాపురంలో కూడా మొదట ఉన్నంత సానుకూలత కనిపించడం లేదు. ఆదుకుంటాడు అనుకున్న వర్మ చివరలో పోటు పొందితే అంతకుమించిన అవమానం మరోటి ఉండదు. జబర్దస్త్ నటులతో చేయించిన ప్రచారం ప్రజలను నవ్వించింది.. పవన్ను నవ్వులపాల్జేసింది.. తప్ప ఓట్లు తెచ్చేది లేదని తేలిపోయింది.ఆఖరి అస్త్రంగా మెగాస్టార్పవన్ వద్ద ఉన్న డైలాగ్స్ .. యాక్షన్ సీన్లు అన్నీ ముగిసాక కూడా గెలుపు మీద నమ్మకం రాలేదు.. అటు గీత.. ఒక మహిళగా ప్రతి ఇంటినీ టచ్ చేస్తూ.. మీ ఇంటి ఆడబిడ్డను.. గెలిచినా గెలవకున్నా నా నివాసం ఇక్కడే.. కానీ వాళ్ళు గెలిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం కోసం హైదరాబాద్.. మద్రాస్.. షూటింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళాలి అని చెబుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. దీంతో పవన్ పరిస్థితి చిల్లుకుండలోని నీళ్లు మాదిరి మారింది.పూటపూటకూ గ్రాఫ్ తగ్గిపోతోంది.. దీంతో చివరి అస్త్రంగా మెగాస్టార్ చిరంజీవిని దించారు.. అయన కూడా తమ్ముడి గుణగణాలు.. వీరగాధలను ఉదహరిస్తూ పాపం పిల్లడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు.. గెలిపించండి... ఈసారైనా గెలిపించండి.. లేకుంటే అవమానభారంతో చచ్చేలా ఉన్నాడు అని విజ్ఞప్తి చేశారు. ఆఖరుకు పవన్ పరిస్థితి అక్కడికి వచ్చింది.. చంద్రబాబును సీఎంను చేయగలిగిన చరిష్మా ఉందని భావిస్తున్న పవన్.. ఇప్పుడు అన్నతో వీడియో పోస్ట్ చేయించుకునే స్థితికి చేరారు.. ఇది దాదాపుగా ఓటమితో సమానం... గెలిచినా ఓడినట్లే..:::: సిమ్మాదిరప్పన్న -
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu09:00 PM, May 7th, 2024పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వర్మ వర్గీయులుమీరు నిలబడితే మీకు వేస్తాం కానీ పవన్కు మాత్రం ఓటేయమన్న వర్మ వర్గీయులుపిఠాపురం కూటమిలో కుంపట్లుటీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు, పవన్ వర్గానికి మధ్య విభేదాలు06:20 PM, May 7th, 2024గాజువాక రోడ్షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి04:51 PM, May 7th, 2024తాడేపల్లి :మీ బిడ్డ జగన్ బటన్ నొక్కిన సొమ్ములు అక్కచెల్లెమ్మలకి అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ అడ్డుకుంటున్నారుఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా పథకాల డబ్బులు ఇచ్చిన జగన్ని చివర్లో వీళ్లు కట్టడి చేస్తుంటే నా అక్కచెల్లెమ్మలు ఊరుకుంటారా.?ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకి బుద్ధి చెప్తారు.మీ బిడ్డ జూన్ 4న అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్ని పథకాలకి డబ్బులు క్లియర్ చేస్తాడు. - సీఎం వైఎస్ జగన్04:10 PM, May 7th, 2024కాకినాడ:సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య: కురసాల కన్నబాబుఐదేళ్ళుగా క్రమం తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను చివరి విడతలో ఆపేస్తే మిగిలిన నాలుగేళ్ళ ప్రభావం జగన్పై ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడా?పేదలపై కక్ష సాధించడం చంద్రబాబుకు అలవాటైపోయిందిప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంటే కోర్టులకు వెళ్తాడుపేదలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తే కోర్టుకు వెళ్తాడుచంద్రబాబు మార్కు పథకం ఏమీ లేదుపెత్తందార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరపున నిలబడతాడుఏదోలా గెలవలన్న ఒత్తిడితో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాడుఅధికారులను బదిలీ చేయిస్తున్నాడు.. సంక్షేమ పధకాల నిధుల పంపిణీని అడ్డుకుంటున్నాడుదీంతో చంద్రబాబును చూసి జనం ఒక బలహీనత అని అనుకుంటున్నారుప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ జరిగితే నాడు-నేడు ద్వారా ఓటర్లకు జగన్ గుర్తోస్తాడన్న స్ధాయికి చంద్రబాబు వచ్చేశాడు 03:56 PM, May 7th, 2024తిరుపతి: మమ్మల్ని తిట్టేందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు: టీటీడీ చైర్మన్ భూమనఈ రోజు సాయంత్రం నాలుగ్గాళ్ల మండపం వద్ద బూతుల పంచాంగం వినిపించ బోతున్నారుఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి మాకు అధికారాన్ని కట్టబెట్టనున్నాయిటీటీడీ ఉద్యోగస్తులకు జగనన్న నా చేత చేయించిన మేళ్లు పట్ల అంతా సంతోషంగా ఉన్నారుదార్శనికుడు భూమన అభినయ్ తిరుపతిని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందిఅందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి, భూమన అభినయ్, గురుమూర్తిని గెలిపించాలని స్పష్టమైన అభిప్రాయం తో ఉన్నారుకానీ, కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని తిట్టడానికే సమయం సరిపోతోందిపవన్ కల్యాణ్కి ముప్పై కోట్ల రూపాయల డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నాడుఇలాంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతికి ఎలా మంచి చేస్తాడోఆరణి శ్రీనివాసులు గత కొంత కాలంగా మమ్మల్ని బూతులు తిట్టే పనిలో ఉన్నాడుఇప్పుడు తన కంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాగా తిడుతారని తిరుపతికి పిలిపిస్తున్నాడు శ్రీనివాసులు02:49 PM, May 7th, 2024విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గంలో ఆగని బోండా ఉమా కుమారుల అరాచకాలువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార ఆటో వాహనాన్ని అడ్డుకున్న బోండా ఉమా పెద్ద కుమారుడుసింగ్నగర్, నందమూరి నగర్లలో ప్రచార ఆటోలకు అడ్డంగా కారు పెట్టిన బోండా సిద్ధార్థ, బోండా ఉమా సోదరుడు బోండా శ్రీనుఆటోలో పెన్డ్రైవ్ను లాక్కున్న బోండా సిద్ధార్థ, శ్రీనువిషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగిన బోండా అనుచరులుఘటనా స్థలికి చేరుకున్న పోలీసులుఅజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు02:02 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం01:54 PM, May 7th, 2024ప్రధాని మోదీకి మంత్రి బొత్స కౌంటర్బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుంది: మంత్రి బొత్స కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలి: మంత్రి బొత్సమోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు: మంత్రి బొత్సరైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు: మంత్రి బొత్సటీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలు: మంత్రి బొత్సఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారు: మంత్రి బొత్సమోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు: మంత్రి బొత్సఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు: మంత్రి బొత్సనా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సమోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు: మంత్రి బొత్సమోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సరాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపాం: మంత్రి బొత్స01:32 PM, May 7th, 2024కూటమిది దుర్మార్గపు ఆలోచన: ఏపీ మంత్రి బొత్స2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది మేము అడ్డుకోలేదుకూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలిటీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయిఎన్నికలు అయిన వెంటనే.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయికూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారుచంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయిఒక వేలు నువ్వు చూపిస్తే.. మిగిలిన వేళ్ళు నిన్ను చూపిస్తాయని మర్చిపోవద్దు బాబుబాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారుచంద్రబాబుది మనిషి పుట్టుకేనా..?చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందిఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదుఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరు..?రీయంబర్స్ మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరు?వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలిపింఛను లబ్ధిదారులు కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టండి15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవుభవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తాంచంద్రబాబు ఏం చేసాడని ఉద్యోగస్తులు టీడీపీకి ఓటేస్తారు..బాబు ఉద్యోగస్తులను మోసం చేశారుఉద్యోగస్తులు ఎవరి పక్షాన ఉన్నారో జూన్ 4న తెలుస్తుంది 01:11 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం.హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారు.అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చాంపోలీసులు 40,000,ఇతరులు కలిపి మొత్తం 4,30,000 మంది ఉన్నారు.3,03,000 మంది ఇప్పటివరకూ ఓటు వేశారుపలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చాంఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చుపోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందిఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణంపశ్చిమ గోదావరి లో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశాం01:08 PM, May 7th, 2024ఎన్నికలప్పుడే బాబుకు కాపులు గుర్తొస్తారు: కాపు నేత అడపా శేషుడీబీటీ ద్వారా ఇచ్చే నిధులను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాలు నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు.ఎన్నికల కమిషన్ చంద్ర బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందికల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు.పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదుపథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారు.పవన్ కల్యాణ్ చివరికి చంద్రబాబు రాజకీయ క్రీనిడలో బలిపశువు అయ్యారు.కాపులు ఎదగడం పవన్ కల్యాణ్ , చంద్రబాబులకు ఇష్టం లేదు.కాపుల్లో ముద్రగడ, వంగవీటి మోహనరంగా కుటుంబాన్ని నాశనం వ్యక్తి చంద్రబాబు.ఒకవైపు వంగవీటి రాధని, మరోవైపు పవన్ను అడ్డుపెట్టుకుని కాపులను మోసం చేస్తున్నారు.ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులు గుర్తుకు వస్తారుపేదలకు సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు.01:04 PM, May 7th, 2024ఈసీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?: MLC లేళ్ల అప్పిరెడ్డిఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందిఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారుఇంకొకపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారుఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుందిఅదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పిందికానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోందిఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెళ్ళకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారుచంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారువాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారుచంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఈసీకి హితవు పలుకుతున్నాంల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?12:48 PM, May 7th, 2024ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ షాక్టీడీపీ వీడి వైస్సార్సీపీలో చేరిన 50 మంది టీడీపీ కార్యకర్తలుపార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్12:43 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• క్రమం తప్పకుండా ఇన్ని రోజులు పథకాలిచ్చిన జగన్కు ఇప్పుడే ఇబ్బందులు..• మీ బిడ్డ జగన్ను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా?• ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పండి..• వీళ్లు ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు..• జూన్ 4న అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఈ బటన్లన్నీ క్లియర్ చేస్తాం..12:36 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారు..• జగన్ను బటన్లు నొక్కిన పథకాల సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్నారు..• జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసేలా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది..• ఆన్గోయింగ్ స్కీమ్స్ కు మాత్రమే జగన్ బటన్లు నొక్కాడు.. అవేమీ కొత్తవి కాదు..• అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపారు..• జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితిరాజానగరంలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం కోసం క్లిక్ చేయండి 12:28 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• 2019లో బాబుపై ప్రతీకారంగా ప్రజలంతా సైకిల్ను ముక్కలుగా విరిచి పక్కకు పడేశారు• ఆ తుప్పు పట్టిన సైకిల్కు రిపేర్లు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు• రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు.. ఫలితం లేదు• దత్తపుత్రుడి సైకిల్ క్యారేజ్పై మాత్రమే కూర్చుంటా.. టీ గ్లాస్ పట్టుకుంటా అన్నాడు• ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్ను ఇక్కడికి దింపారు• ఢిల్లీ మెకానిక్స్ అంతా ఏపీకి వచ్చి తుప్పుపట్టిన సైకిల్ చూశారు• సైకిల్కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేదని ఢిల్లీ మెకానిక్స్ గుర్తించారు• ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగుచేస్తామని ఢిల్తీ మెకానిక్స్ అడిగారు• చంద్రబాబు పిచ్చి చూపులు చూసి బెల్ ఒక్కటే మిగిలిందని కొట్టడం మొదలు పెట్టాడు• చంద్రబాబు కొడుతున్న ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో 11:49 AM, May 7th, 2024బోండా ఉమా కొడుకి దౌర్జన్యంYSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి ప్రచారం చేస్తున్న వైస్సార్సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుబాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లాతన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావుగెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులుప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీసెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడిటీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లువైస్సార్సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 11:37 AM, May 7th, 2024జననేత కోసం జనంఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలుమరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షోసీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు11:11 AM, May 7th, 2024పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులువిద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులుచేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్లంచ్ మోషన్ కింద విచారించనున్న ఏపీ హైకోర్టుచంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు11:02 AM, May 7th, 2024షర్మిలపై కేసు నమోదుఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పై కేసు నమోదైంది. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన కేసు నమోదు చేసిన వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన కడప కోర్టు10:32 AM, May 7th, 2024నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపుబనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుంవైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డిఅదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డివైఎస్సార్సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవగాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు10:29 AM, May 7th, 2024మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.ఇప్పటివరకూ కొనసాగుతున్న సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్లకు ఈసీ బ్రేక్మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?10:19 AM, May 7th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. TDPకి ఏపీ బీజేపీ షాక్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదుఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలికూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుందిఎక్స్ లో ట్వీట్ చేసిన బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు10:00 AM, May 7th, 2024మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబుచంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420.. అయన చేయని అక్రమాలు లేవు..ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడుతెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్9:49 AM, May 7th, 2024ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్సీపీ ఆగ్రహంకొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలెఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నోఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCPతెలంగాణలో సబ్సిడీ ఇన్ఫుట్కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్నఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్సీపీలో చేరామన్న స్థానికులు9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులుతనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ప్రచారంవిశాఖపట్నం లోక్సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్ ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్ కల్యాణ్ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఈసీ సీరియస్ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్ చేసిన వైస్సార్సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 -
AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
హైదరాబాద్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని రీతిలో ఈ దఫా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. సంక్షేమాభివృద్ధిలు, సామాజిక న్యాయం అజెండాగా అధికార వైఎస్సార్సీపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడకముందే ప్రచార క్షేత్రంలోకి దిగింది. మరోవైపు.. పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు గందరగోళం నడుమ అయోమయంగానే సాగుతోంది కూమిటి పార్టీల ప్రచారం.ఏపీలో ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5గం. ప్రచార పర్వం ముగియనుంది. మే 13వ తేదీన(సోమవారం) ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ చివరి నాలుగు రోజుల్లో ప్రచారం హోరెత్తె అవకాశాలున్నాయి.ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లతో సంబంధం లేకుండా.. ఏడాది కిందటి నుంచే వైఎస్సార్సీపీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అభ్యర్థుల ఎంపిక.. అందునా సిట్టింగ్లలో ఎవరెవరిని తప్పిస్తారనేది ముందు నుంచే చెబుతూ పార్టీని, పార్టీ శ్రేణుల్ని మానసికంగా సిద్ధం చేస్తూ వచ్చారు. అందుకే సిట్టింగ్లలో కొందరికి సీట్లు దక్కకపోయినా.. పార్టీ కేడర్ మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదు. ఆ వెంటనే సిద్ధం సభలతో పార్టీకి ఉన్న అశేష ప్రజాదరణను దేశం మొత్తానికి చూపించిన సీఎం జగన్.. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు.ఇక బస్సు యాత్ర ముగిసిన వెంటనే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో.. మరోవైపు జగన్ కోసం సిద్ధం పేరిట మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ విశ్వసనీయత ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో.. సీఎం జగన్ కేవలం తన పరిపాలన గురించి, చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే సీఎం జగన్ ప్రచారం ఏ రూపంలో ఉన్నా సరే.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఇక కూటమి పార్టీల ప్రచారానికి ప్రజా స్పందనే కరువైంది. ఒకవైపు ఎన్నికల ప్రచార సభలకు జనం లేక వెలవెలబోతుంటే.. పిల్ల కాలువను సముద్రంలా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతోంది. యువగళం, ప్రజాగళం, వారాహి.. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎవరికి వారే సభలు పెట్టినా.. ఆఖరికి అంతా కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహించినా.. జనం ఆసక్తి చూపించడం లేదు. ఆఖరికి.. సూపర్సిక్స్ ల్యాంటి గిఫ్ట్ ప్యాక్లతో ఎరవేసే యత్నం చేసినా.. ఛీ కొట్టేస్తున్నారు. కూటమి పార్టీల ప్రధాన నేతలు ప్రచారంలో జనాకర్షణ కోసం చెమటోస్తున్నారు.ప్రస్ట్రేషన్తో చంద్రబాబు ప్రజాగళం సాగుతోంది. తన హయాంలో జరిగిన ఇది అని చెప్పలేకపోతున్నారు, ప్రజల్లో సెంటిమెంటును ఎమోషన్ను రెచ్చగొట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తనకు అధికారం వస్తే ఇలా చేస్తానని ఇవి అమలు చేస్తానని చెప్పుకోలేకపోతున్నారు. ఇక ఊగిపోతూ పవన్ చేస్తున్న ప్రసంగాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అసలు ప్రచారం చేస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పూర్తిగా దూరం ఉండిపోయారు. ఇంకోవైపు వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చే కుట్రలో భాగంగా సీఎం జగన్ను.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం చెప్పుకోవడం వేస్ట్.కూటమిలో బీజేపీ కూడా ఉండడంతో.. చివరి నాలుగు రోజుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారంలోకి దిగనున్నారు. మోదీ, అమిత్ షాలు ప్రచారం చేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ఏపీ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతంగా ప్రతిపక్ష కూటమి ప్రచారం అయోమయంగా, గందరగోళంగా సాగుతుండగా, ఒక షెడ్యూల్ ప్రకారం క్లారిటీతో వైఎస్సార్సీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. -
ప్చ్.. పవన్ మెడలు వంచిన చంద్రబాబు
మన్యం, సాక్షి: పాపం.. పవన్ కల్యాణ్ జనసేనకు దక్కిన 21 సీట్లకు కూడా అభ్యర్థులకు దిక్కులేక ఎంత సతమతం అవుతున్నారో!.. ఇది ఏపీ ప్రజల్లో కొందరి అభిప్రాయం. కానీ, చంద్రబాబు నాయుడి రాజకీయాలు అర్థం చేసుకునేవాళ్లెవరైనా పవన్ను పాపం అని కాదు కదా.. ఛీ కొట్టి తిరస్కరిస్తారు. పాలకొండ అభ్యర్థి విషయంలో రాత్రి పూట పవన్ చేసిన ప్రకటనే ఇందుకు కారణం. చంద్రబాబు నాయుడు రాజకీయం ఎంత ఘోరంగా ఉంటుందో ఈ దఫా ఎన్నికల టైంలో స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు పొత్తు, కూటమి అంటూ ఇటు జనసేనకు, అటు బీజేపీకి సీట్లు ఇచ్చారే గానీ, ఆ సీట్లలో కూడా తన వాళ్లనే పోటీ చేయిస్తున్నారు. కాకపోతే.. వారికి సైకిలు గుర్తు ఉండదు. బీజేపీ, జనసేన బీఫాంల మీద పోటీకి దిగబోతున్నారు.. అంతే! బీజేపీలో, జనసేనల అభ్యర్థుల జాబితాను చంద్రబాబు దాదాపుగా తన మనుషులతో నింపేశారు. ఈ క్రమంలో ఆ రెండు పార్టీల్లో మొదటి నుంచి ఉన్న సీనియర్లకు అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. బీజేపీ అభ్యర్థుల్లో.. ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, రోషన్న, సీఎం రమేష్ లాంటివాళ్లే కాకుండా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు మనిషేనని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇది చాలదన్నట్లు పురంధేశ్వరి పేరు చెప్పుకుని.. రూ. 3 కోట్లు ఇస్తే సీటు వదిలేస్తానని టీడీపీ నేతకు ఓ బీజేపీ నేత ఆఫర్ ఇచ్చినట్టు ఓ ఆడియో లీక్ కావడం, బీజేపీ-టీడీపీ చీకటి ఒప్పందాలకు ఊదాహరణ అనే చెప్పొచ్చు. ఇది చాలదన్నట్లు మరికొన్ని చోట్లా అభ్యర్థుల్ని మార్చుకునేందుకు ఆ రెండు పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. మరోవైపు జనసేన పరిస్థితి ఇంతే!. దక్కిన 21 సీట్లలోనూ అభ్యర్థుల్ని నింపేందుకు పవన్ తెగ ఇబ్బంది పడిపోయారు. పవన్లోని ఆ గందరగోళాన్ని చంద్రబాబు ఎంచక్కా క్యాష్ చేసుకున్నారు. ఒకవైపు వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వంశీకృష్ణ యాదవ్, అరణి శ్రీనివాసులకు టికెట్లు ఇవ్వడం కూటమిలో మంట రాజేసింది. ఇది చాలదన్నట్లు భీమవరం, అవనిగడ్డ, ఇప్పుడు పాలకొండకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థుల్ని ఖరారు చేయడం, ఈ మధ్యలో రైల్వే కోడూరు అభ్యర్థిని తప్పించి మరీ టీడీపీ మనిషి అయిన అరవ శ్రీధర్కు టికెట్ ఇవ్వడం చూస్తే చంద్రబాబు పవన్ మెడల్ని ఏమేర వంచి తాను అనుకున్నది చేశారో స్పష్టం అవుతోంది. వాస్తవానికి పాలకొండ విషయంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు తనయుడు జయకృష్ణ ఎంపిక జనసేన శ్రేణుల్ని ఏమాత్రం సహించని విషయమే. ఎందుకంటే.. గతంలో పోటీ చేసిన ప్రతీసారి ఆయన విజేతలకు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఈసారి టీడీపీ తరపున టికెట్ ఆశించారు. అదే సమయంలో పడాల భూదేవీ కూడా పోటీ చేయాలనుకున్నారు. కానీ, పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లడంతో.. ఈ ఇద్దరూ అందులో చేరి టికెట్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఈలోపు జనసేన నాగేశ్వరరావుకు మంగళగిరి నుంచి పిలుపు రావడంతో జనసేన శ్రేణులు తమ అభ్యర్థే పోటీ చేయబోతున్నట్లు సంబురాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. చివరకు.. బాబు కుట్ర రాజకీయమే ఫలించి టీడీపీ నుంచి చేరిన జయకృష్ణకే టికెట్ దక్కింది. పోటీ చేయడానికి జనసేనలో సరైన అభ్యర్థులే లేరా?.. తెలుగుదేశం వారిని జనసేనలో చేర్చుకుని మరీ వారికి పవన్ టికెట్లు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జనసేన నేతలు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థిత్వానికి విపరీతమైన కాంపిటీషన్ ఉన్నదని చెబుతూ.. ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించడం టైం పాస్ వ్యవహారమేనని పవన్ చేష్టలతో ఇప్పుడు అర్థమవుతోంది కదా!. -
పవన్తో పని చేసినందుకు అసహ్యం వేస్తోంది: పోతిన మహేష్
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలో కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేనకు షాక్ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పదవికి పోతిన వెంకట మహేష్ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ఆవేశంలోనో.. సీటు రాలేదోనో తాను జనసేన పార్టీకి రాజీనామా చేయలేదన్న.. భవిష్యత్తు ఇచ్చేవాడు నాయకుడని, పవన్ను నమ్మి అడుగులేసి తామంతా మోసపోయామని పోతిన మహేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై జనసేనలోని నా బాధ్యతలకు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశాను నేను అవేశంతోనో, సీటు రాలేదనే అసంతృప్తితోనో మాట్లాడట్లేదు భవిష్యత్తుకు ఇచ్చేవాడే నాయకుడు.. నటించేవారు నాయకుడు కాలేదు రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేదు పవన్ కల్యాణ్ను నమ్మి అడుగులు వేశాను కొత్తతరం నాయకత్వం కోసం గుడ్డిగా అడుగులు వేశాం పవన్ కల్యాణ్ మార్పు తీసుకొస్తాడని నమ్మాం 2014లో పోటీ చేయకపోయినా, 2019లో ఒక్క సీటు గెలిచిన 2024పై ఆశలు పెట్టుకున్నాం జరుగుతున్నది, జరిగింది అర్థం కాక పిచ్చెక్కింది అయినా పవన్ కల్యాణ్లో స్పందన లేదు రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు , నాలాంటి కొత్తతరం నాయకులకు పవన్ సమాధానం చెప్పాలి పవన్ కల్యాణ్ నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలి మేడిపండు చూడ మేలిమి ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. లాంటి వ్యక్తి పవన్ కల్యాణ్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్ళు ప్రయాణం చేసినందుకు మామీద మాకు అసహ్యం వేస్తుంది పార్టీ నిర్మాణం, క్యాడర్ పై పవన్ దృష్టి సారించలేదు అన్నీ తాత్కాలికం.. అంతా నటన.. నమ్మి నట్టేట మునిగిపోయాం ప్రజలు జనసైనికులకంటే తెలివైనవారు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావట్లేదు అనుకున్నాం ఎంత చెప్పినా ప్రజలకు జనసేన పట్ల నమ్మకం రాలేదు 25 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కళ్యాణ్ కనీసం 25 సీట్లలో పోటీ చేయలేకపోయారు 25రోజుల తర్వాత పార్టీ భవిషత్తు చెప్పగలరా? 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకి ఏం భవిషత్తు ఇవ్వగలరు పవన్ స్వార్ధానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి పార్టీలో మీకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడ్డాం కానీ అన్నీ మీకు తెలిసే అన్నీ జరుగుతున్నాయి పవన్ కల్యాణ్ చూపులో ద్వంద అర్థాలు ఉన్నాయి సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకే కేటాయించారు గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మీకోసం నిలబడతారా? జనసేన ఎందుకు పెట్టారు.. ఏం ఆశించి పెట్టారు.. అసలు జనసేన ఎవరికోసం పెట్టారు? పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టారని తెలుస్తోంది అన్నీ ఆధారాలను బయటపెడతాను కాపు యువతను బలి చేయొద్దని కన్నీటితో అభ్యర్ధిస్తున్నా మీరు మా గొంతు కోస్తున్న నొప్పి తెలుస్తుంది మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకుంటే, మీరు ఆస్తులు కొనుక్కున్నారు మా రక్తమాంసాలపై మీరు భవంతులు కట్టుకున్నారు కాకినాడ మేయర్ సరోజ, శేష కుమార్, విశాఖలో మహిళా నాయకురాలికి మాత్రమే పదవులు పొడిగించారు మీ గురించి, పార్టీలో బ్రోకర్ పనులు బయట పెడుతున్నారనే భయంతోనే వాళ్ల పదవులు పొడిగించారు సుజనా చౌదరి(విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి) గతంలో బినామీ ఛానల్ లో మీ తల్లిని దూషించారు అలాంటి సుజనాకు మీరు టికెట్ ఎలా ఇప్పిస్తారు? సుజనా గెలుపులో మీరు ఎలా భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నారు కన్నతల్లిని విమర్శించి, పచ్చనోట్లు పడేస్తే అన్నీ మర్చిపోయారా? విజయవాడలో జనసేన జెండా లేదు.. గాజు గ్లాసు గుర్తు లేదు మేము బతికించిన పార్టీని మీరు చంపేశారు టీడీపీ వేసే కుక్క బిస్కెట్లు మనకి వద్దు అన్నారు.. ఇప్పుడు ఆ బిస్కెట్లు ఎందుకు తీసుకున్నారు జనసేనను సీట్లు అడగకుండా బీజేపీ ఎందుకు త్యాగం చేశారో చెప్పాలి బీజేపీ, టీడీపీని సీట్లు అడిగితే మీరు ఎందుకు ఇచ్చారు? పొత్తు ధర్మం బిజెపి, టీడీపీలకు లేదా, కేవలం జనసేనకు మాత్రమే ఉందా పొత్తు కుదిర్చితే ఎక్కువ స్థానాలు కోరుకోవాలి కదా.. ఎక్కువ సీట్లు సాధించాలి కదా! మీరెందుకు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించారు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన నుండి పోటీకి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా.. అన్ని పార్టీలు విధేయతకు పట్టం కట్టాయి కసాయివాడికి కనికరం ఉంటుంది.. మీపట్ల విధేయతతో ఉన్నందుకు కనీసం కనికరం లేదా? మీమనసు ఇంత పాషాణ హృదయం అని ఊహించలేదు 21 అసెంబ్లీ, 2ఎంపీల్లో ఏడు అసెంబ్లీ, ఒక ఎంపీ మాత్రమే జనసేన కోసం పనిచేసినవాళ్లకు ఇచ్చారు టీడీపీ నుండి వచ్చిన నేతలు జనసేనను టీడీపీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా? రాబోయే 12 నెలలో జనసేన అడ్రస్ గల్లంతు అవుతుంది జనసేన పార్టీ ప్రజారాజ్యం-2 అయి తీరుతుంది త్యాగాలకు బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకు పనికి రారా? మంగళగిరి, విజయవాడ పశ్చిమ బీసీల నుండి తీసుకుని కమ్మలకు ఇవ్వలేదా? పశ్చిమ సీటు బలహీన వర్గాలలో ముస్లింలకో, సోము వీర్రాజు లాంటి వారికి ఇవ్వచ్చుగా? పెట్టుబడిదారుడైన సుజనా చౌదరికి ఎందుకు ఇచ్చారు? పద్మశాలిలకు ఒక్కసీటు ఎందుకు కేటాయించలేదు? సుజనా స్థానంలో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ దొరకలేదా? ఇదెక్కడి సామాజిక న్యాయం ? పవన్ కల్యాణ్ కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు రాజకీయ కుట్రలో భాగంగా కులాలకు కొమ్ము కాస్తున్నారు 21 సీట్లలో ఒక్క చోట కూడా కాపులు హర్షించలేదు పార్టీ భవిషత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది కాపులు జనసెనకు దూరమయ్యారు.. పవన్ కి కాపులు మద్దతు ఇవ్వట్లేదు కులాల మధ్య కుట్రలకు తెరలేపారు గెలిచే భీమవరం స్థానాన్ని వదిలి పిఠాపురం ఎందుకు వెళ్ళారు భీమవరంలో టీడీపీ నాయకుడిని ఎందుకు తీసుకొచ్చి టికెట్ ఇచ్చావు సొంతఇల్లు కట్టుకోవడానికి భీమవరం ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పిన మాట అవాస్తవం ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడివి అయ్యుండి వేరే పార్టీ నేత కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్? అనకాపల్లి సీటు ఎందుకు వదులుకున్నారు? అనకాపల్లిలో నాగబాబు వచ్చాక పారిశ్రామికవేత్తల దగ్గర ఫండ్స్ వసూలు చేశారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు.. అందుకే అక్కడినుండి వచ్చేశారు నాదెండ్ల మనోహర్ కు జనసేన అనే బస్సు ఇస్తే ఆయన పెద్ద కొండకు గుద్ది ముక్కలుముక్కలు చేసారు నష్టపోయింది మాత్రం మేము మేము చెప్పేది వినే ఓపిక లేనపుడు పార్టీ ఎందుకు పెట్టారు పొత్తు మరో పదేళ్లు కావాలా? ఇప్పుడు చంద్రబాబు ఆ తర్వాత, ఆ తర్వాత కూడా ఎవరు ముఖ్యమంత్రిని చేయాలో చెప్తే బానిసల్లా జెండాలు మొస్తాం నాదెండ్లా(నాదెండ్ల మనోహర్ను ఉద్దేశించి)... తెనాలి వస్తా, అక్కడే ప్రేస్మీట్ పెడతా నేను చెప్పేవన్నీ నిజాలే.. నాకు దేనికీ భయం లేదు చివరిగా నాకు ఓకే ఒక కోరిక.. పిఠాపురంలో మీ ఇల్లు గృహ ప్రవేశానికి అన్నా లేజినోవాతోనే రావాలి మీ నెల రోజులు పర్యటన షెడ్యూల్ కి ఏర్పాట్లు చేయండి జనసేన పార్టీ మొత్తం వాట్సాప్ లోనే నడుస్తుంది ‘‘కొత్తతరం నేతల్ని పవన్ తయారు చేస్తారని గుడ్డిగా అడుగులు వేశాం. 2019లో జనసేనకు ఒక్క సీటు వచ్చినా.. పవన్తో నడిచి భంగపడ్డాం. నటించేవాళ్లు ఎన్నటికీ నాయకులు కాలేరు. స్వార్థరాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్. అందుకే పార్టీ నిర్మాణంపైగానీ, కేడర్పైగానీ ఆయన ఏనాడూ దృష్టి పెట్టలేదు. ’’ అని పవన్కు పోతిన మహేష్ చురకలు అంటించారు. ఇదిలా ఉంటే.. జనసేనలో పోతిన తొలి నుంచి ఉన్నారు. పవన్ను నమ్ముకునే పార్టీలో కొనసాగుతున్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జనసేన బలోపేతం కోసం ఎంతో కృష్టి చేశారాయన. ఈ క్రమంలోనే వెస్ట్ సీటుపై మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరకు టికెట్ కోసం పెత్తందారులతో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. విజయవాడ వెస్ట్ సీటు కోసం మొదటి నుంచి ఆసక్తికర రాజకీయం నడిచింది. టీడీపీ నుంచి ఇద్దరు నేతలు సీటు కోసం యత్నించగా.. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లొచ్చనే ప్రచారం తొలి నుంచి నడిచింది. దీంతో మహేష్ పవన్ నుంచి ఆ సీటు తనకేనని మాట తీసుకున్నారు. ఈ లోపు సీన్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఏపీ బీజేపీ.. పొత్తులో భాగంగా ఆ సీటును తన్నుకుపోయింది. పవన్ ద్వారా చంద్రబాబు తన అనుచరుడు సుజనా చౌదరి(బీజేపీ)కి ఇప్పించుకున్నారు. అయినా కూడా మహేష్ సీటు కోసం ప్రయత్నించారు. పవన్పై చివరి నిమిషం వరకు నమ్మకం ప్రదర్శించారు. అయినప్పటికీ చివరకు.. వేల కోట్లున్న అగ్రవర్ణ నేత కోసం బీసీ నేత అయిన మహేష్ను పవన్ దగా చేశారు. పవన్ను నమ్మి తాను మోసపోయినట్లు మహేష్ ఇప్పుడు తన అనుచరుల వద్ద వాపోయారు. అధికారంలోకి వస్తే.. ఏదైనా పదవి ఇస్తామని పవన్ ఆఫర్ చేసినప్పటికీ మహేష్ అందుకు లొంగలేదని తెలుస్తోంది. పోతిన మహేష్ తదుపరి రాజకీయ అడుగులు ఎటు అనేది తెలియాల్సి ఉంది. -
ఏప్రిల్ 06: ఏపీ ఎన్నికల సమాచారం
April 6th AP Elections 2024 News Political Updates 09:06 PM, April 06 2024 షర్మిల వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కౌంటర్ తాను చేస్తోన్న ఆరోపణలపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజలు కూడా షర్మిల విమర్శలను గమనించాలి జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఎలా బ్రహ్మరథం పట్టారో పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ఎలాంటి స్పందన వచ్చిందో అందరు చూస్తున్నారు జిల్లా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారో షర్మిల గమనించాలి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మాట్లాడే విషయంలోను షర్మిల అత్మ పరిశీలన చేసుకోవాలి తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ ఎలా ప్రారంభించారో.. తెలంగాణా నా సొంత ప్రాంతం అంటూ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ను గతంలో ఎలా దుయ్యబట్టారో అందరికి తెలిసిందే వైఎస్సార్ కుమార్తెగా అమెను గౌరవిస్తున్నాం తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని అంటే చాలా సంతోషించాం కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకులందరిని ముంచివేసింది 06:25 PM, April 06 2024 అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు: సీఎం జగన్ కావలి లో జన ప్రభంజనం కనిపిస్తోంది మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.? మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్ ఉన్నాడు పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు.! చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు ఎన్నికల ముందు మాత్రమే బాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది బాబు తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు మేనిఫెస్టో చూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా ? చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు ? మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు.! ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం మేనిఫెస్టో లోని 99 శాతం హామీలు నెరవేర్చాం ఇంటింటికి పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాం లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా ? చంద్రబాబును 4 నెలలుగా ప్రశ్నలు అడుగుతూ వచ్చా ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్యపెడతాడు పేదవాడికి మంచి చేశానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా? నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ పెట్టాం మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంధంగా భావించాం 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి పేదలకు ఈ మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి 2014 లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇచ్చారు చంద్రబాబును పొరపాటున కూడా నమ్మొద్దు చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు .. చేశాడా ? ఆడబిడ్డ పుడితే రూ . 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు .. ఇచ్చాడా ? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు .. ఇచ్చాడా ? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. వేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు ... నిర్మించాడా ? 04:42 PM, April 06 2024 చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అందుకే ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సీఎం జగన్ 1.60 లక్షల ఉద్యోగాలు కల్పించారని చంద్రబాబు అంగీకరించారు చంద్రబాబు వాలంటీర్ల వ్యతిరేకి చంద్రబాబు నిర్వాకం వల్లే పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కష్టాలు పడ్డారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం 04:28 PM, April 06 2024 ‘మార్గదర్శి’ పై కేసు నమోదు ద్వారక పోలీస్ స్టేషన్లో 188 సెక్షన్ల కింద కేసు ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.52 లక్షలు తరలింపు ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు కేసు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న పోలీసులు మార్గదర్శి సితం పెట అకౌంట్ అసిస్టెంట్ వి. లక్ష్మణ్ రావు, ఆఫీస్ బాయ్ శ్రీను పై కేసు నమోదు 03:14 PM, April 06 2024 ఢిల్లీకి విశాఖ బీజేపీ నేతలు బీఎల్ సంతోష్ ను కలిసిన విశాఖ బీజేపీ నేతలు విశాఖ టికెట్ జీవీఎల్కు ఇవ్వాలని కోరిన నేతలు విశాఖలో బీజేపీ ని కాపాడాలని నేతల ఆందోళన జేపీ నడ్డాను కూడా కలవనున్న విశాఖ బీజేపీ నేతలు 01:45 PM, April 06 2024 అనకాపల్లి: ఎన్నికల కోసం జనసేన నేతల మద్యం దిగుమతి సోమలింగంపాలెం వద్ద గడ్డిమెట్లో దాచిన మద్యం పట్టివేత మద్యం విలువ రూ.90 లక్షలపైన ఉంటుందని అంచనా గోవా నుంచి తెచ్చిన మద్యంగా పోలీసుల నిర్ధారణ 01:30 PM, April 06 2024 పాలకొల్లులో రెండో రోజు చంద్రబాబు పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాలోని కూటమి అభ్యర్థులు, ముఖ్యనేతలతో అంతర్గత సమావేశం ఎన్నికల సన్నద్ధత పై కూటమి అభ్యర్థులు, నేతలతో చర్చ మూడు పార్టీల నేతల మధ్య అంతర్గత సర్దుబాట్లపై దిశానిర్దేశం 01:25 PM, April 06 2024 రఘురామకృష్ణంరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఖరారు పాలకొల్లు సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరుల ఆందోళన చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించిన రామరాజు అనుచరులు ఉండి గడ్డ రామరాజు అడ్డ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ నినాదాలు 01:20 PM, April 06 2024 చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా కడపలో కిరాణా షాపులు బంద్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కిరాణా షాపుల్లో సరసమైన ధరలకు గంజాయి లభిస్తుందని వ్యాఖ్య 01:15 PM, April 06 2024 వైఎస్సార్సీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ అమలాపురం టికెట్ దక్కకపోవడంతో 3 రోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన రాజాబాబు 12:58 PM, April 06 2024 చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్ని అబద్దాలైన ఆడగల వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు వృద్ధులకు రూ. 4000 చొప్పున పెన్షన్ ఇస్తానని మరో అబద్ధం చెప్తున్నాడు 2014 ఎన్నికల అప్పుడు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి అమలు చేయలేదు వలంటీర్ వ్యవస్థ పై నిమ్మగడ్డ రమేష్ ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయించాడు పెన్షన్ల కోసందూర ప్రాంతాలకు వెళ్లి మండుటెండలో అవస్థలు పడి కొంతమంది వృద్ధులు చనిపోయారు ఆ అవ్వ తాతల ఉసురు చంద్రబాబుకు తప్పదు చంద్రబాబు ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చిన తిరిగి సీఎంగా జగనే అవుతారు 12:42 PM, April 06 2024 వాళ్లు కాపులకు ఏం చేశారసలు?.. : ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు రబ్బరు చెప్పులు వేసుకున్న వారిని అసెంబ్లీకి తీసుకెళతానని పవన్ కల్యాణ్ మోసం చేశాడు చంద్రబాబు కు దాసోహం అంటూ 21 సీట్లు తీసుకున్నాడు బీజేపీలో ఉన్న ఒక్క కాపుకి కూడా చంద్రబాబు సీటు లేకుండా చేశాడు పవన్ కల్యాణ్ కోసం కాపు జాతి లేదు కాపుల కోసం పని చేసే ఎవరికైనా మద్దతు ఉంటుంది 31 సీట్లు కాపు లకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు బిజెపి ఒక్క సీటు ఇవ్వలేదు.. టీడీపీ కూడా కాపులకు న్యాయం చేయలేదు అందుకే.. కాపులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు వ్యాఖ్యలు 12:02 PM, April 06 2024 ప్రతీ పేదోడి గుండెల్లో జగన్: గుడివాడ అమర్నాథ్ ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే! మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేదవాడు అనుకుంటాడు సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడు సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుంది సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్ సీఎం రమేష్ ఎంపీ నిధులు అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా..? సీఎం రమేష్ బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకోడానికి వచ్చాడు.. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే కొణతాల, దాడి వీరభద్రరావుపైనా మంత్రి అమర్నాథ్ సెటైర్లు అనకాపల్లిలో రాజకీయ శత్రువులను నేను కలిపాను వారు ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి అలాంటి వారు నామీద పడి ఏడుస్తున్నారు సీఎం జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తా 11:55 AM, April 06 2024 షర్మిల వ్యాఖ్యల్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా: ఎంపీ అవినాష్రెడ్డి కడప ఎన్నికల ప్రచారం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు స్పందించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అద్యక్షురాలు షర్మిల అన్నారు ఆ వ్యాఖ్యల్ని అమె విజ్ఞతకే వదిలేస్తున్నా ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉంది మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలి 11:49 AM, April 06 2024 టీడీపీ త్వరలో నామరూపాల్లేకుండా పోతుంది: వైవీ సుబ్బారెడ్డి సీఎం రమేష్ ఎక్కడి నుంచో వచ్చి ఉత్తరాంధ్రలో రౌడీయిజం చేస్తున్నారు సీఎం రమేష్ మార్క్ రౌడీయిజం మనకు కావాలా? సీఎం రమేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాజ్యసభలో ఖాళీ అయినట్లే.. మిగతా మూడు చోట కూడా టీడీపీ ఖాళీ అవుతుంది ఎన్నికల తర్వాత నామారూపాల్లేకుండా పోతుంది 10:55AM, April 06 2024 కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకానా? టీడీపీ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం బీజేపీతో అంతర్గత మార్పులపై చంద్రబాబు ఫోకస్ నరసాపురం, కడప ఎంపీ స్థానాలు ఇచ్చిపుచ్చుకునే యోచనలో టీడీపీ బీజేపీ మాడుగుల, చింతపూడి, మడకశిర, సూళ్లురుపేట, సత్యవేడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు? 10:37AM, April 06 2024 విశాఖలో జీవీఎల్ పోస్టర్ల కలకలం విశాఖలో బీజేపీ నేత జీవీఎల్ పేరిట పోస్టర్లు జన జాగరణ సమితి పేరిట ఆంధ్రాయూనివర్సిటీలో వెలిసిన పోస్టర్లు విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కే కేటాయించాలంటూ సందేశాలు విశాఖ అభివృద్ధి కోసం పార్లమెంట్లో జీవీఎల్ గళం వినిపించారని.. ఆయనకే టికెట్ ఇవ్వడం న్యాయమంటూ పోస్టర్లపై రాతలు పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీకి విశాఖ ఎంపీ సీటు విశాఖ బీజేపీకి వెళ్తే గనుక.. నరసాపురం కోరే ఛాన్స్ నరసాపురం ఓకే అయితే గనుక.. టీడీపీలో తాజాగా చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చే అవకాశం 09:48AM, April 06 2024 ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే: కేశినేని, దేవినేని అవినాష్ విజయవాడ పటమట లంక 14వ డివిజన్లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం కార్యక్రమం ప్రచారంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కారం చూపిన దేవినేని అవినాష్: కేశినేని నాని స్క్రూ బ్రిడ్జి అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయం: కేశినేని నాని జగన్ అందించే పథకాలు మాకు అందాయి అని ప్రతీ గడపలో చెబుతున్నారు: కేశినేని నాని నేదురుమల్లి నీ, ఎన్టీఆర్ నీ వెన్ను పోటు పొడిచింది చంద్రబాబును కాదా?: కేశినేని నాని చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేసే జగన్ ప్రభుత్వం పై కుక్కల్లాగా వాగుతున్నారు: కేశినేని నాని మేము మాటలు వ్యక్తుల కాదు చేతల ప్రభుత్వం లో వున్నాము: కేశినేని నాని టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదు: కేశినేని నాని రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తోంది: దేవినేని అవినాష్ స్క్రూ బ్రిడ్జ్ అండర్ పాస్ పనులు ఎలా పూర్తి చేస్తారో అని ఎల్లో మీడియా లో విమర్శించారు: దేవినేని అవినాష్ అండర్ పాస్ పనులను త్వరితగిన పూర్తి చేస్తున్నాం: దేవినేని అవినాష్ నిస్సిగ్గుగా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు: దేవినేని అవినాష్ రిటైనింగ్ వాల్ టిడిపి నిర్మిస్తే వరదలు ఏందుకు వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పాలి: దేవినేని అవినాష్ ఓటమి భయంతోనే వ్యక్తి గత రోషణకు చేస్తున్న టీడీపీ నేతలు: దేవినేని అవినాష్ ప్రజలు అందరూ వైఎస్ఆర్సీపీ కి అండగా ఉన్నారు: దేవినేని అవినాష్ 09:15AM, April 06 2024 చంద్రబాబుకి బుద్ధి చెప్తాం: నెల్లూరు ప్రజలు నెల్లూరులో చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్కు స్వాగతం పలికేందుకు సిద్ధం జై జగన్ అంటూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధం అంటూ ప్రజల నినాదాలు 08:27AM, April 06 2024 నెల్లూరు సిద్ధమా?: సీఎం జగన్ ట్వీట్ నేడు ఉమ్మడి నెల్లూరులో సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం బహిరంగ సభ ఇప్పటికే రాయలసీమలో బస్సు యాత్ర సూపర్ సక్సెస్ Day-9 నెల్లూరు జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2024 07:54AM, April 06 2024 రాజమండ్రిలో బీజేపీ ఆఫీస్ ప్రారంభం నేడు రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన బీజేపీ ఆఫీస్ను ప్రారంభించనున్న పురందేశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నేడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి 07:32AM, April 06 2024 ఇవాళ పల్నాడులో చంద్రబాబు ప్రచారం పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం క్రొసూర్, సత్తెనపల్లి ప్రజా గళం బహిరంగ సభలు 07:17AM, April 06 2024 చుక్కాని లేని జనసేనాని విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ పార్టీ నిర్మాణం, ఒక సిద్ధాంతమంటూ లేకుండా పోయిన పవన్ కల్యాణ్ కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ భారీ భారీ డైలాగులు.. పేర్ల వాడకాలు బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం మరీ ఎబ్బెట్టు మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ అభిమానులతో నినాదాలు చేయించిన పవన్ తర్వాత 50–60 స్థానాలలో పోటీ అంటూ ప్రచారం ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చెయ్యి అని ప్రకటనలు చివరకు 21 సీట్లకు పరిమితం కావటంతో జనసేన శ్రేణులే.. అసలు పవన్ ఎందుకు పార్టీ పెట్టాడా? అని నిలదీతలు పైగా చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడనే విమర్శ పవన్పై 07:04AM, April 06 2024 నేడు 9వ రోజు మేమంతా సిద్ధం యాత్ర తొమ్మిదో రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగనున్న సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో సిద్ధం బహిరంగ సభ నిన్న యాత్రకు విరామం.. నెల్లూరు నేతలతో సీఎం జగన్ భేటీ ఇప్పటికే రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో పూర్తైన ఎన్నికల ప్రచార యాత్ర అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ సీఎం జగన్కు బ్రహ్మరథం పట్టిన వైనం పేదలే స్టార్క్యాంపెయినర్లుగా ప్రచారం దూసుకెళ్తున్న సీఎం జగన్ పాలనపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్తో పాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న సీఎం జగన్ మేనిఫెస్టోలో మరింత మంచి జరిగేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టే యోచన ప్రతీ సభలోనూ జరిగిన మంచిని వివరిస్తూ.. కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -9. ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు కావలి బైపాస్ దగ్గరబహిరంగ సభ జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/3oqaBoGJAU — YSR Congress Party (@YSRCParty) April 6, 2024 06:45AM, April 06 2024 షర్మిలపై మండిపడ్డ ఎమ్మెల్యే సుధా కడపలో పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారం షర్మిల ప్రచారంలో చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించిన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా విచారణ కోర్టులో జరుగుతుండగానే అవినాష్ రెడ్డి హంతకుడని షర్మిల మాట్లాడటం సమంజసం కాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా వైఎస్ వివేకానందరెడ్డి హత్య పట్ల అందరిలో బాధ ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గతంలో దివంగత వైఎస్అర్, వివేకానందరెడ్డిలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇప్పుడు సిఎం వైఎస్ జగన్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తు అండగా నిలుస్తున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేము ఎవరి ఇంటికి వెళ్లినా మా తమ్ముడు, మా అన్న అంటూ చెబుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అలాంటి మంచి వ్యక్తులపై నిరాధార అరోపణలు చెయ్యడం దారుణం: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా చంపిన వ్యక్తి అప్రూవర్ గా మారి బయట తిరుగుతున్నాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా కోర్టులు ఇంకా తీర్పులు ఇవ్వాల్సి ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఈలోపు తొందరపడి అవినాష్రెడ్డి మీద షర్మిల ఆరోపణలు చేయడం సరికాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా నా భర్త ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే జగనన్న నన్ను తోబొట్టులా అదరించాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా రెండవ మారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల ప్రచారం చేసుకోకుండా ఏదొ పొలిటికల్ ఏజెండాను పెట్టుకుని మాట్లాడుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇకనైనా ఇలాంటివి వదిలిపెట్టి ప్రచారం చేసుకొవాలి: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ప్రెస్ వ్యాఖ్యలు 06:30AM, April 06 2024 ఎల్లో మీడియాపై ఐపీఎస్ ఆఫీసర్ అసోషియేషన్ సీరియస్ చంద్రబాబు కోసం బరితెగించొద్దు! పచ్చమందకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వార్నింగ్ ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయి ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం... ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం అందరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ‘వీళ్లా ఐపీఎస్లు’ కథనంపై మండిపడ్డ చీఫ్ సెక్రటరీ.. పరువునష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ తమ కౌంటర్ను ‘ఈనాడు’ బ్యానర్గా వెయ్యాలని డిమాండ్.. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్, ఐపీఎస్ల అసంతృప్తి ఒక వర్గానికి కొమ్ముకాస్తారా: పౌర సంఘాల ధ్వజం రామోజీ, పచ్చ మీడియా రాతలపై ఈసీ, ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు ఈసీ నియామకాలపైనా ఎందుకు అక్కసు? ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తే ఆహా ఓహో అని పొగడ్తలు.. అదే ఈసీ కొత్త ఎస్పీలను నియమిస్తే మాత్రం దు్రష్పచారం ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ.. రామోజీ జేబు సంస్థ కాదు.. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో జాబితా పంపిన సీఎస్.. ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలను నియమించిన ఈసీ చంద్రబాబు కోసం హద్దులు దాటుతున్న ఎల్లో మీడియా! ఐపీఎస్ అధికారులను కించపరిచేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి గత మూడు రోజులుగా వరుస కథనాలు సరైన ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తుండటంపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియస్ చంద్రబాబుకి తొత్తుగా మారిన ఎల్లో మీడియాపై ఇప్పటికే ఉమ్మేస్తున్న… pic.twitter.com/LaB6dcPczr — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 సామాన్యులే మన పార్టీ కార్యకర్తలు!#YSJaganAgain#VoteForFan pic.twitter.com/UyO2f6gCUh — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 -
చుక్కాని లేని జనసేనాని
విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు ఒక సిద్ధాంతం లేదు. పార్టీ నిర్మాణం లేదు. ఇవి చాలదన్నట్లు ఆయన కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం ఎబ్బెట్టుగా కనిపిస్తున్నది. అది ఒకటైతే, మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ మాట్లాడి, తర్వాత 50–60 స్థానాలలో పోటీ, తద్వారా ప్రభుత్వంలో పెద్ద చెయ్యి అని ప్రకటించి, చివరకు 21 సీట్లకు పరిమితం కావటం తన పార్టీ వారికి, తన సామాజిక వర్గం వారికి కూడా ఇబ్బందికరంగా తయారైంది. చుక్కాని అంటూ లేని పార్టీ పరిస్థితి ఇంతకు భిన్నంగా ఉంటుందా?స్థాపించి నిండా పది సంవత్సరాలు గడిచినా తన సిద్ధాంతాలు ఏమిటో తెలియని రాజకీయ పార్టీ ఒకటి ఉందంటే నమ్మబుద్ధి కావటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీకి అయినా సిద్ధాంతాలు, లక్ష్యాలు, విధానాలన్నవి చుక్కాని వంటివి. కానీ పవన్ కల్యాణ్ 2014లో స్థాపించిన జనసేన పార్టీకి నేటి వరకు కూడా ఒక సిద్ధాంత పత్రం ఏమీ లేదు. కనీసం ఎన్నికల సమయంలోనైనా వారు మేనిఫెస్టో ఏదీ ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ చారిత్రకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ దేశంలోని ప్రముఖ రాష్ట్రాలలో ఒకటి. అక్కడి అయిదు కోట్లమంది ప్రజలు అనేక రంగాలలో ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో కూడా క్రియాశీలంగా ఉన్న వివేకవంతులు. అటువంటి రాష్ట్రానికి సారథ్యం వహించగోరే ఒక పార్టీ ఇంత దారీ తెన్నూ లేని విధంగా సాగుతుండటం ఆశ్చర్యకరమైన విషయం. ఇటువంటివి ఆలోచించదగిన విషయాలనే స్పృహ అయినా ఆ పార్టీ అధ్యక్షునికి ఉందా అనే అనుమానం కలుగుతున్నది. పవన్ కల్యాణ్ అసలు పార్టీ ఎందుకు పెట్టినట్లు? పెట్టిన ఈ పదేళ్లుగా ఏమి చేసినట్లు? మునుముందు ఏమి చేయాలన్నది తన ఆలోచన? తన మాటలను, చేతలనుబట్టి చూస్తే రాజకీయ పరిశీలకు లకు ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు అయినా స్పష్టమైన సమాధానాలు కన్పించటం లేదు. ఆయన పార్టీ ప్రకటించిన 2014లో ఆంధ్రప్రదేశ్ ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడి పోయింది. విభజిత రాష్ట్రం అనేక వనరులను కోల్పోయింది. రాజ కీయ పార్టీలకు, సాధారణ ప్రజలకు కూడా కొత్త రాష్ట్రాన్ని తిరిగి ఏ విధంగా నిలబెట్టాలనేది ఒక పెద్ద సమస్య. అప్పటి పరిణామాలన్నీ వారికి మానసికంగా కూడా కొంత అయోమయాన్ని సృష్టించాయి. అటువంటి స్థితిలో ఏర్పడే ఒక కొత్త రాజకీయ పార్టీ తనదైన విధంగా సమాధానాలను వెతకాలి. వాటిని ఒక సిద్ధాంత పత్ర రూపంలో రూపొందించి ప్రజల ముందుంచాలి. ఆ మేరకు స్వయంగానూ, ఏకీ భావం గల ఇతర పార్టీలు, వర్గాలతోనూ కలిసి కార్యాచరణను చేప ట్టాలి. కానీ ఇటువంటిదేమీ చేయలేదు. నేటికీ చేయటం లేదు. ఇది ఒక కోణం కాగా, మరొక కోణాన్ని చూద్దాము. పవన్ కల్యాణ్ సామాజికంగా కాపు వర్గానికి చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో రెడ్లు, కమ్మల తర్వాత మూడవ బలమైన వర్గం. అయినప్పటికీ రాజకీయాధికారం తమకు లేకుండా పోయిందని, దానిని అందు కోవాలనే కోరిక వారిలో బలంగా ఎప్పటి నుంచో ఉంది. అందుకోసం గట్టి ప్రయత్నాలు మొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో పి. శివశంకర్ ఆధ్వర్యాన జరిగాయి. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణల నుంచి కూడా ఈ సామాజిక తరగతులను కదిలించారు. ఆ ప్రయత్నాలు విఫల మయ్యాయి. తర్వాత చిరంజీవి రాకతో వారిలో తలెత్తిన ఆశలు కూడా ముందుకు సాగలేదు. ఇపుడు ఆ వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ను వారిలోని కొందరు తమ వాడు అనుకోవటం తప్ప ఆశాభావాలు గత రెండు విడతలలోనూ ఎంత మాత్రం కనిపించటం లేదు. అందుకు ఒక కారణం ఆయన... శివశంకర్, చిరంజీవి వంటి గౌరవ ప్రతిష్ఠలను, నమ్మకాన్ని సంపాదించు కోలేక పోవటం. రెండు – తనలో అటువంటి పరిణతిగానీ, దార్శనికత గానీ ఉన్నా యనే అభిప్రాయం ఆ వర్గం వారికి 2014లో గానీ, తర్వాత ఈ పదే ళ్లలోగానీ ఏర్పడక పోవడం. మూడు – ఒక పార్టీని సీరియస్గా నడిపే ఆలోచన, దక్షత, స్థిరత్వం, వ్యవహార ధోరణి అసలెప్పుడూ కన్పించక పోవటం. నాలుగు – పైన అనుకున్నట్లు తన సిద్ధాంతాలు, విధా నాలు, ప్రణాళికలు, ఆ ప్రకారం ఆచరణలు ఏమిటో అర్థం కాక పోవటం. అయిదు – సినిమాలలో కావలసిన కొన్ని లక్షణాలకు, సీరి యస్ రాజకీయాలకు అవసరమైన పద్ధతులకు మధ్య తేడా పాటించక తన విలువను తానే తగ్గించుకోవటం. దానితో, కాపులలోని యువతరానికి పవన్ కల్యాణ్ పట్ల ఇతర త్రానూ గల సినిమాటిక్ ఆకర్షణ రాజకీయ ఆకర్షణగా మారటం తప్ప, వారిలోని ఇతరులకు ఆయనపై తమనేదో ఉద్ధరించగలడనే ఆశా భావం ఏమీ కలగటం లేదు. గత ఎన్నికల ఫలితాలు ఇందుకొక స్పష్టమైన సూచన. గమనించదగినదేమంటే, ఒకవేళ ఆయన శివశంకర్, చిరంజీవిల వలె తమ సామాజిక వర్గాన్ని, ఇతర బడుగు, బల హీన వర్గాలను కూడదీసే ప్రయత్నం చేసినట్లయితే ఆంధ్ర రాజకీ యాలలో మూడవ ధ్రువం ఏర్పడే అవకాశం ఉండేది. వ్యక్తిగతంగా తనకు ఆ దార్శనికత, సమర్థత ఉన్నట్లు కనిపించదనేది వేరే విషయం. కానీ కనీసం సూత్రరీత్యా అటువంటి అవకాశం ఉండేది. ఈ పరిస్థితుల దృష్ట్యా పవన్ కల్యాణ్ గత పది సంవత్సరాలలో ఎటువంటి విలువనూ పెంచుకోలేక పోయారు. తనకు సంబంధించి అంతా సినిమాటిక్ గానే కనిపిస్తుంది. జనసేన అనే పేరు, కార్యకర్తలను సైనికులు అనటం, మహిళా సభ్యులను వీర మహిళలనటం, ఎక్కడైనా సమస్య కనిపిస్తే తోకచుక్క తెగిపడినట్లు వచ్చి హడావిడి చేసి మాయమవటం తప్ప అందుకు కొనసాగింపు లేకపోవడం, ప్రసంగాలలో దురుసుతనం, వీరాలా పాలు, అందుకు తగినట్లు సినిమా లలో వలెనే హావభావాలు. ఈ విధంగా, ఆంధ్రప్రదేశ్ వంటి ముఖ్య రాష్ట్రం ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటుండిన దశలో, ఒక సిద్ధాంతం, విధానాలంటూ లేకుండా ఒక పార్టీని నెలకొల్పటం, పదేళ్లయినా అదే పరిస్థితి ఉండటం, రాజకీయాధికారాన్ని కోరుకుంటున్న తన సామాజిక వర్గా నికి ఎటువంటి ఆశాభావాన్ని కల్పించలేక పోవటం, చివరకు పార్టీ నిర్వహణ సైతం గందరగోళంగా సాగుతుండటాన్ని బట్టి, పవన్ కల్యాణ్ జనసేన ఆంధ్రప్రదేశ్లో, నిజమైన అర్థంలో ఒక నికరమైన, స్థిరమైన, సీరియస్ రాజకీయ పార్టీ అనే గుర్తింపును, గౌరవాన్ని సంపా దించుకోలేక పోయింది. సిద్ధాంతాలు, లక్ష్యాల మాట ఇలా ఉంటే, జనసేన అధ్యక్షుని ఎన్నికల వ్యవహరణ ఏ విధంగా ఉన్నదో చూద్దాం. ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకి. కానీ ఆ విషయంలో డబుల్ గేమ్ ఆడిన టీడీపీ అ«ధ్యక్షుడు చంద్రబాబును 2014 ఎన్నికలలో బలపరిచారు. చంద్ర బాబు రైతాంగానికి, పేదలకు నష్టం చేసినందున 2004లో, 2009లో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తి. అదే విధంగా, రాష్ట్ర విభజ నను పూర్తిగా బలపరచిన బీజేపీతోపాటు అపుడు చంద్రబాబు వెంట నిలబడ్డారు. తర్వాత 2019 ఎన్నికలలో వామపక్షాలతో స్నేహం చేశారు. అప్పటికి అయిదేళ్లు రాజకీయం చేసినా, తన సామాజిక వర్గం పెద్ద సంఖ్యలోగల గాజువాక, భీమవరం స్థానాల నుంచి స్వయంగా పోటీ చేసి కూడా ఓడారు. అయిదేళ్లలో తన సిద్ధాంతాలేమిటో చెప్ప లేదు. సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం పేరిట తమ వారినీ ఒప్పించ లేక పోయారు. ఆ వర్గానికి కంచుకోటలైన జిల్లాలు అంతటా అదే పరిస్థితి ఎదురైంది.విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ తనకు సిద్ధాంతం లేదు. పార్టీ నిర్మాణం లేదు. సోదరుడు చిరంజీవి రాజకీయాలలో ఉండినప్పటిలా తన సామాజిక వర్గంగానీ, ఇతర బడుగు బలహీన వర్గాలుగానీ ఆయనను ఒక ఉద్ధారకునిగా ఏమీ చూడటం లేదు. అది ఒకటైతే, మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ మాట్లాడి, తర్వాత 50–60 స్థానాలలో పోటీ, తద్వారా ప్రభుత్వంలో పెద్ద చెయ్యి అని ప్రకటించి, చివరకు 21 సీట్లకు పరిమితం కావటం తన పార్టీ వారికి, తన సామాజిక వర్గం వారికి కూడా ఇబ్బందికరంగా తయారైంది. తీరా అందులో గెలిచేదెన్ని, తమ కూటమి అధికారానికి రాగలదనే హామీ ఎంత అనేవి ఎవరికీ అంతు పట్టని ప్రశ్నలయ్యాయి. మౌలికంగా చుక్కాని అంటూ లేని పార్టీ పరిస్థితి ఇంతకు భిన్నంగా ఉండగలదా? - వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు - టంకశాల అశోక్ -
PK: పిఠాపురం గోళీలు పని చేయట్లేదా?
కాకినాడ, సాక్షి: జనసేన విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్నదంతా పదేళ్లుగా ఆ పార్టీని వెంటపెట్టుకుని తిరిగిన వాళ్లెవరికీ సహించడం లేదు. సీఎం అవుతాడని కలలుగన్న అభిమానుల ఆశలు పటాపంచల్ చేస్తూ మళ్లీ చంద్రబాబుతోనే పొత్తుకు వెంపర్లాడడం.. ఇటు రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. గత ఎన్నికల్లో 130 ఫ్లస్ సీట్లకు పోటీ చేసిన జనసేన.. ఇప్పుడు 21 స్థానాలకే పరిమితం కావడాన్ని జనసేన కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. పోనీ ఆ 21 సీట్ల కేటాయింపులో అయినా జెన్యూన్గా ఉన్నాడా? అంటే అదీ లేదు. కనీసం రెండు పదుల స్థానాలకు అభ్యర్థుల్ని సైతం ఎంపిక చేయలేని పరిస్థితికి దిగజారిపోయాడు పవన్. అదే సమయంలో.. చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నుంచి పార్టీ మారిన వాళ్లకు.. అధికార వైఎస్సార్సీపీ ఫిరాయించిన వాళ్లకు సీట్లిచ్చి ఆయా స్థానాల్లో పాతుకుపోయిన జనసేన కేడర్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో రాజీనామాల పర్వంతోనూ పవన్కు నిరసన తగిలింది. పోనీ తన సీటు విషయంలో అయినా కచ్చితత్వం ప్రదర్శిస్తున్నాడా? అంటే అదీ లేదు. అసలు పిఠాపురంలో పోటీ చేయడం పవన్ నామినేషన్ వేసే దాకా అనుమానమే అనే పరిస్థితిని తీసుకొచ్చారు ఇప్పుడు. భీమవరం, గాజువాక ఓటర్లకు భరోసా ఇవ్వలేకపోయిన పవన్.. ఇప్పుడు పిఠాపురం ఓటర్లకు ఏం భరోసా ఇస్తాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారాహి పేరిట ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి రెండ్రోజులు మామూలు హడావిడి చేయలేదు. బహిరంగ సభతో పాటు ఆటోలెక్కి రోడ్ల మీద ఓ హడావిడి చేశాడు. అదేంటో.. ఆ రెండ్రోజులు తిరగక మునుపే జ్వరం పేరుతో నియోజకవర్గాన్ని వీడారు. పార్టీ నిర్వహణను నాదెండ్ల మనోహర్కు.. నియోజకవర్గ ప్రచార బాధ్యతలను తనపై గుర్రుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు అప్పగించారు. అంటే పిఠాపురంలో గెలుపుపై పవన్ ఆశలు వదిలేసుకున్నట్లేనా?.. ఆ మాత్రం జ్వరానికి పవన్కు పిఠాపురంలో గోళీలు దొరకవా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. చంద్రబాబుకి బానిసత్వం ప్రదర్శించడంలో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆల్ టైం రికార్డు సృష్టిస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీని పూర్తిగా చంద్రబాబు చేతిలో పెట్టారు. బాబు నుంచి వెన్నుపోటు రాజకీయం నేర్చుకుని దానిని జనసేన కేడర్పైనే ప్రయోగిస్తున్నారు. తన చుట్టూరా ఎప్పుడూ బౌన్సర్లను ఉంచుకునే పవన్.. పార్టీ నేతలు, కార్యకర్తలు సహా ఎవరినీ దగ్గరకు రానీయకుండా జాగ్రత్తపడుతుంటారు. అలాంటిది పార్టీ మీటింగ్లలో తనపై బ్లేడ్లతో దాడి జరిగిందంటూ ఆరోపణలకు దిగడం మరో కొసమెరుపు. ఈ ఆరోపణల్ని జనసేన శ్రేణులు సైతం స్వాగతించడం లేదు. పోనీ దాడికి సంబంధించిన ఆధారాలు ఏమైనా చూపించారా? అంటే అదీ లేదు. ఇక.. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే ట్యాగ్లకు అదనంగా ఇప్పుడు అదనంగా బ్లేడ్ బాబ్జీ అంటూ పవన్కు మరో ట్యాగ్ తగిలించారు. అట్లుంటది ప్యాకేజీ స్టార్తో అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలా పవన్ ఇటు జనాల్లో.. అటు జనసేన శ్రేణుల్లో రాజకీయంగా మరి చులకనైపోతున్నాడు. -
ఏప్రిల్ 05.. ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 5th Telugu Updates 09:23 PM, ఏప్రిల్ 05 2024 ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్ జవహర్రెడ్డి ఆగ్రహం తనపై రాసిన తప్పుడు వార్తపై మండిపడ్డ సీఎస్ ఈనాడు చీఫ్ ఎడిటర్కి లేఖ రాసిన సీఎస్ ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు తప్పుడు కథనం సీఎస్ జవహర్రెడ్డి ఎలక్షన్ కమిషన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు తప్పుడు కథనం అబద్ధపు రాతలపై ఖండన లేఖ విడుదల చేసిన సీఎస్ తన ఖండన ఈనాడు మొదటి పేజీలో రాయాలని కోరిన జవహర్ రెడ్డి లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని.స్పష్టం చేసిన సీఎస్ ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారు? ఐపీఎస్ అధికారులు ఏసిఆర్లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చింది ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా.. లేఖలో పేర్కొన్న సీఎస్ 09:09 PM, ఏప్రిల్ 05 2024 పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ ముగ్గురిపైన క్రిమినల్ చర్యలకు దిగాలని ఐపీఎస్ అధికారుల సంఘం నిర్ణయం ఐపీఎస్లపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం.. ప్రకటన విడుదల చేసిన ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని ఖండించిన సంఘం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ప్రకటించిన ఐపీఎస్ల సంఘం 08:14 PM, ఏప్రిల్ 05 2024 పేదలపై చంద్రబాబు కక్ష సాధింపు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని అడ్డుపడింది చంద్రబాబు కాదా? చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ఎవరు నమ్మరు షర్మిలను చంద్రబాబు తప్పు దోవ పట్టిస్తున్నారు దివంగత మహానేత వైయస్సార్ పాలనను సీఎం జగన్ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు వైఎస్సార్ మరణం తర్వాత ఎఫ్ఐఆర్లో ఆ మహానేత పేరును కాంగ్రెస్ చేర్చింది అలాంటి పార్టీలో షర్మిల చేరడం ఆంధ్ర రాష్ట్రానికి ఆమెకి ఎటువంటి సంబంధాలు లేవు కొంతసేపు తెలంగాణ కోడలు అంటుంది కొంతసేపు ఆంధ్ర ఆడపిల్లను అంటుంది షర్మిల మాటలకు పొంతన లేదు సీఎం జగన్ పై రాళ్లు వేస్తే దివంగత వైఎస్సార్ కూడా నిన్ను క్షమించడు నారా లోకేష్కు దమ్ముంటే మంగళగిరిలో గెలిచి చెప్పమనండి మీడియా వాళ్లందరూ వెళ్లి నారా లోకేష్ మంగళగిరిలో గెలుస్తారా..? లేదా అడగండి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు ఈ రాష్ట్రంలో 175కు 175 గెలిచే పార్టీ వైఎస్సార్సీపీ నారా లోకేష్కి దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోదీ, అమిషా, పవన్ కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్. టీడీపీ నేతలు మెడ నిండా ఎన్ని కండువాలు వేసుకుంటున్నారో వాళ్లకే తెలియదు 05:59 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల: వాసిరెడ్డి పద్మ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను షర్మిల మాట్లాడుతున్నారు తీర్పు శిక్ష ఈవిడే వేసేస్తున్నారు.. ఇది తీవ్రమైన అంశం విచారణలో ఉన్న అంశాల పై ఇంత రాజకీయం చేయడం సరికాదు కడప ప్రజలు అమాయకులు.. అజ్ఞానులు కాదు వైఎస్ కుటుంబాన్ని విడదీయాలని జరుగుతున్న కుట్ర కడప ప్రజలకు కొత్త కాదు షర్మిల సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ వివేకానందను ఓడించడానికి చేసిన కుట్రలు మరిచిపోయారా? ఆ రోజు కుట్రలు చేసిన వారు ఈరోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నారు చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కుకుంది అవినాష్ రెడ్డి పై హంతకుడని నింద వేస్తున్నారు కోర్టులో విచారణ జరుగుతున్న అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చడం వెనుక ఉన్న రాజకీయమేంటి? చంద్రబాబు రాజకీయంలో షర్మిల, సునీత పావులుగా మారారు ఏం సాధించడానికి మీరు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్ రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ కాదా? ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా? ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు మూసేశారు ఏపీకి నష్టం జరిగినా తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తామన్నారు తెలంగాణలో నాయకులను వాడుకుని మోసం చేశారు ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆరోజు ఎందుకు అనుకున్నారు ఏపీ ప్రజల కోసం ఈ రోజు ఎందుకు వస్తున్నారు చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారు చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్ లు తీసుకుంటున్నారు మీ యూటర్న్ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి.. ప్రజలకు సంజాయిషీ చెప్పాలి వివేకాను రాజకీయంగా లేకుండా చేసిన వారితో చేతులు కలిపారు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది ఆధారాలు లేకుండా అవినాష్ పై ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల్లో ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి ఏపీ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి ఎవరు ఏం చేశారో కడప ప్రజలకు తెలుసు షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికలకు విరుద్ధం కచ్చితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం 05:01 PM, ఏప్రిల్ 05 2024 ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ బస్సుయాత్ర 9వ రోజు శనివారం(ఏప్రిల్ 6) షెడ్యూల్ ఉదయం 9 గంటలకు చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. 04:53 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు బుజ్జగించినా తేలని గోపాలపురం టికెట్ పంచాయితీ చంద్రబాబు ముందే బయటపడ్డ వర్గ విభేదాలు చంద్రబాబు బస చేసిన నల్లజర్ల ప్రియాంక కన్వెన్షన్ హాల్ వద్ద ముళ్లపూడి వర్గీయుల ఆందోళన మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు ఫ్లకార్డులతో నిరసన,నినాదాలు ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అదుపు చేసిన పోలీసులు, స్పెషల్ ఫోర్స్ మద్దిపాటి వెంకట రాజుని వెంటనే మార్చాలంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు బైఠాయించి తెలుగు తమ్ముళ్ల నిరసన 03:45 PM, ఏప్రిల్ 05 2024 గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?: పోసాని కృష్ణమురళి ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్కు దేవుడు చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారు చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్ను చంపేశారు చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు పవన్ కల్యాణ్ను చంద్రబాబు లొంగదీసుకున్నారు 02:02 PM, ఏప్రిల్ 05 2024 అచ్చెన్న, అయ్యన్నలకు ఈసీ నోటీసులు టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడుకి ఎన్నికల సంఘం నోటీసులు సీఎం వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు టీడీపీ నేతలపై ఈసీఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు కి నోటీసులు ఇచ్చిన సీఈఓ మీనా 01:45 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుపై ఫైర్.. టీడీపీ మీటింగ్లో తిట్ల పురాణం చిప్పగిరి మండలం నెమకల్లు టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కు సొంత పార్టీ లో నిరసన సెగ పార్టీ కార్యకర్తల ఆత్మీయసమావేశం లో వీరభద్ర గౌడ్ సమక్షంలో రెండు వర్గాలు రసాభాస మా అవసరం మీకు పట్టదా అంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ఒక్క వర్గానికే ప్రాధాన్యత చంద్రబాబు ఇస్తున్నాడని తెలుగు తమ్ముళ్లు మండిపాటు సమాచారం ఇవ్వకుండా మీటింగులు ఎలా పెడతారంటూ ఒకరి పై నొకరు తిట్ల పురాణం 1:15 PM, ఏప్రిల్ 05 2024 విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా: కేఏ పాల్ మన పార్టీ(ప్రజాశాంతి) అధికారంలోకి వస్తుంది అందుకే విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా కారణం నేను విశాఖలోనే పుట్టి, పెరిగి చాలా సేవ చేశా రాయలసీమ ముఖ్యమంత్రిలు విశాఖను పట్టించుకోలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశాను స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల భూముల కోసం కోర్టులో పోరాడా స్టీల్ ప్లాంట్ కోసం రూ.8 వేల కోట్లు ఇస్తానని చెప్పాను ఇవ్వకపోతే నేను జైలు శిక్షకు కూడా సిద్ధంగా ఉన్నాను కోర్టుల్లో జడ్జిలు తప్పుడు తీర్పులు ఇస్తే వారి సంగతి తేల్చుతా 12:30 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు నిరసన సెగ టికెట్ల కేటాయింపుపై భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనల్లో నిరసన సెగలు పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు కేటాయించాలంటూ నినాదాలు నల్లజర్ల లో చంద్రబాబు బసచేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ శ్రేణుల నిరసన బొరగం శ్రీనివాస్ కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయుల ఆందోళన పోలవరం అభ్యర్థి ని మార్చాలని నినాదాలు చేస్తున్న టీడీపి శ్రేణులు 11:43 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు: హోం మంత్రి తానేటి వనిత వలంటీర్లను గోనె సంచులకు మోసుకునేవాళ్లు.. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు తలుపులు తట్టి ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు డేటా తీసుకెళ్లి అమ్మేస్తున్నారు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారన్న అన్న వ్యక్తి పవన్ కల్యాణ్ వలంటీర్లను చిన్న చూపు చూస్తూ కించపరుస్తూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్.. కోర్టులకు వెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించింది ఎవరు?.. చంద్రబాబే అవ్వ తాతల మరణాలకి చంద్రబాబే కారణం చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు పుష్కరాల్లో షూటింగ్ ల పేరుతో సామాన్యుల ప్రాణాలు పట్టణ పెట్టుకుంది ఎవరు చంద్రబాబు కాదా....? జగనన్న బస్సు యాత్రకు వస్తున్న జన సందోహన్ని చూసి వీరికి వణుకు పుడుతుంది దళిత మహిళలని లేకుండా నాపై చెత్తాచెదారం అంటూ హీనంగా మాట్లాడారు.. చంద్రబాబు కొవ్వూరులో టిడిపి వ్యక్తిని తీసుకెళ్లి గోపాలపురంలో ఎందుకు పెట్టారు జవహర్ ను తీసుకెళ్లి గతంలో తిరువూరులో పెట్టింది ఎవరు.... కొవ్వూరు నియోజకవర్గం లో ఒక రూపాయి దోచుకున్నానని నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వైదొలుగుతాను...? దోచుకున్నానని ఆధారాలతో నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం... కొవ్వూరు లో టిడిపి హాయంలో ఏడేచ్చగా దోచుకుంది వారి నాయకులు దొమ్మేరులో దళిత యువకుడు ఆత్మహత్య చనిపోతే చంద్రబాబు నాపై ఆపాదిస్తున్నారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులపై బురద చల్లితే సానుభూతి వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు భ్రమరావతి కట్టినంత ఈజీ కాదు ప్రజల్లో అబద్దాల మేడలు కట్టడం ప్రజల గుండెల్లో జగనన్న సంక్షేమ పథకాలు గూడు కట్టుకుని ఉన్నాయి జగనన్నను పేదలు ఆరాధ్య దైవంగా భావిస్తూ పేదల గుండెల్లో స్థానం కల్పించారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై నాయకులపై బురద చల్లితే.. మైలేజీ వస్తుందని అనుకోవడం వారి భ్రమ కొవ్వూరులో గోపాలపురంలో కూడా టిడిపిలో వర్గ విభేదాలు రెండు గ్రూపులు ఉన్నాయి వైఎఎస్సార్సీపీలో కొవ్వూరు గోపాలపురంలో ఐక్యతగా పనిచేస్తున్నామని కడుపుమంటతో ఉక్రోశంతో చంద్రబాబు ఉన్నారు ప్రజలు ఎవరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలవడం కాదు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను.. చంద్రబాబు తన మ్యానిఫెస్టోలో లో కాపీ పేస్ట్ చేస్తున్నారు మా నియోజకవర్గంలో దళితులపై అట్రాసిటీ కేసులు పెట్టామని అంటున్నారు ఒకటైన నిరూపించమని సవాల్ చేస్తున్నాను టిడిపి హయంలో మహిళలను వివస్రను చేశారు ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకుంటారు అన్న వ్యక్తి చంద్రబాబు పురందేశ్వరి అధికారులపై బురద చల్లాలి అనుకోవడం బాధాకరం ఐఏఎస్ ఐపీఎస్ చిన్న స్థాయి ఉద్యోగుల సైతం వారి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తారు వారి ప్రభుత్వానికి కొమ్ము కాయరు టీడీపీ హయాంలో అలా చేసినట్లు ఉన్నారు అందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారు తూర్పు గోదావరిలో హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు 11:03 AM, ఏప్రిల్ 05 2024 సీఎం రమేష్ ఓ అహంకారి: ఎమ్మెల్యే ధర్మశ్రీ అనకాపల్లిలో సీఎం రమేష్ రౌడీయిజం తనిఖీలకు వచ్చిన అధికారులతో సీఎం రమేష్ అనుచిత ప్రవర్తన తీవ్రంగా ఖండించిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులు, హింసను సహించరు సీఎం రమేష్ ఎక్కడ నుండి వచ్చారు మళ్లీ అక్కడికే పంపుతారు సీఎం రమేష్ అహంకారంతో విర్రవీగుతున్నారు సీఎం రమేష్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు తనపై అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ పై పరువు నష్టం దావా వేస్తా 10:52 AM, ఏప్రిల్ 05 2024 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ నమ్మకద్రోహి: మంత్రి పెద్దిరెడ్డి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి నే కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది కూడా మాజీ సీఎం కిరణ్ ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారు కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేధించాడు కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకద్రోహి గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించాం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తాం చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారు ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు పుంగనూరు ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 10:34 AM, ఏప్రిల్ 05 2024 ప్రజా సమస్యల పరిష్కారమే జగన్ ప్రభుత్వం ఎజెండా టీడీపీ చేయని అనేక అభివద్ధి పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది అబద్ధపు ప్రచారాలు చేసుకునీ కాలం గడుపుతున్న టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజా సమస్యలు పట్టవు పెన్షన్ కోసం వృద్ధుల మరణ మృదంగం కి టీడీపీ నేతలు కారణం కాదా ఎందుకు గద్దె రామ్మోహన్ నీ గెలిపించామా? అని స్థానిక ప్రజలు వాపోతున్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలను ఇంటికే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 10:02 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు అవ్వా తాతల ఉసురు తప్పదు: చింతల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ వృద్ధులు పడుతున్న అవస్థలు చూస్తే చాలా బాధ వేస్తుంది పెన్షన్ కోసం వృద్ధులను మంచాలపై తీసుకు వెళ్లాల్సి వస్తోంది వలంటరీ వ్యవస్థ పై చంద్రబాబు కక్ష కట్టి తప్పుడు ఫిర్యాదులు చేయించాడు నాలుగు సంవత్సరాల 11 నెలల పాటు వలంటీర్లు సేవలు అందించారు ప్రతినెల 1వ తేదీ ఉదయాన్నే వలంటీర్లు పెన్షన్లు అందించే వాళ్ళు తప్పుడు ఫిర్యాదులు చేసి వలంటీర్లను పక్కన పెట్టించిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా ఎన్నికల సంఘం పునరాలోచన చేసి వాలంటీర్లతో పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 09:37 AM, ఏప్రిల్ 05 2024 వేర్ ఈజ్ లోకేషం? ఎన్నికల వేళ.. టీడీపీలో ఆసక్తికర పరిణామం తెర వెనుకే ఉంటున్న చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు శంఖరావాలకు సైతం బ్రేక్ ఇచ్చిన లోకేష్ పూర్తిగా ఉండవల్లి నివాసానికే పరిమితమైన వైనం మంగళగిరి ప్రచారానికి వెళ్తే.. అడుగడుగునా నిలదీస్తున్న జనం దీంతో.. లోకేష్ ప్రచారానికి దూరంగా ఉంటున్న పార్టీ శ్రేణులు అపార్ట్మెంట్లలో ప్రచారానికే మొగ్గుచూపిస్తున్న నారా లోకేష్ వైఎస్సార్సీపీ అభ్యర్థి లావణ్యకు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న మంగళగిరి వాసులు సోషల్ మీడియాలో సినబాబుపై పేలుతున్న సెటైర్లు 09:09 AM, ఏప్రిల్ 05 2024 టీడీపీని కబళిస్తున్న చంద్రబాబు తప్పిదాలు: విజయసాయిరెడ్డి 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్సీపీలో చేరుతున్నారు జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు.. వలంటీర్ వ్యవస్థ పై పిర్యాదులు చేసి.. పింఛన్ దారులకు దూరం చెయ్యడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం.. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తెలుగుదేశం పార్టీనే కబలించి వేస్తుంది.. వలంటీర్ మీద ఆధారపడిన ప్రతి కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు.. అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తాం.. రేపటి(ఏప్రిల్ 6) సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చింతరెడ్డిపాలెం నుంచి ప్రారంభం అవుతుంది ప్రతీ స్వాగత పాయింట్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్కు స్వాగతం పలుకుతారు.. సాయంత్రం నాలుగు గంటలకి సీఎం జగన్ కావలి చేరుతారు.. 6 గంటలకి సభ ముగుస్తుంది నెల్లూరు చేరిక కార్యక్రమంలో YSRCP MP అభ్యర్థి విజయసాయి రెడ్ది వ్యాఖ్యలు 09:02 AM, ఏప్రిల్ 05 2024 ఇవాళ బస్సు యాత్రకు విరామం నెల్లూరులోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం యాత్ర నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం బస చేసిన ప్రాంతంలోనే.. నెల్లూరు జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం జగన్ రాయలసీమ జిల్లాల యాత్రపై సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్ ఇప్పటికే వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విజయవంతంగా సాగిన యాత్ర ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సలహాలు-సూచనల మేరకు కొత్త పథకాలను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉదయం నుంచే చింతరెడ్డిపాలెం సీఎం జగన్ బస కేంద్రానికి చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రేపు.. తొమ్మిదవ రోజు బస్సు యాత్రలో పాల్గొననున్న సీఎం జగన్ నెల్లూరు బైపాస్ చింతరెడ్డిపాలెం బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానున్న యాత్ర రేపు కావలిలో సిద్ధం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ 08:47 AM, ఏప్రిల్ 05 2024 విజయసాయిరెడ్డి సమక్షంలో చేరికలు నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పండగ వాతావరణం టీడీపీ నుంచి పలువురు వైఎస్సార్సీపీలోకి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ Sc కమిషన్ మెంబర్ రవీంద్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి 08:27 AM, ఏప్రిల్ 05 2024 నేటి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఇలా.. నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు పర్యటన ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు స్థానిక టీడీపీ నేతలతో కీలక మంతనాలు నిర్వహించే ఛాన్స్ 08:06 AM, ఏప్రిల్ 05 2024 రఘురామ కొత్త రాగం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొత్త రాగం కూటమి తరఫునే పోటీ చేస్తానని గతంలో ప్రకటించుకున్న రఘురామ సీటు తన్నుకుపోయిన బీజేపీ.. తన అనుచరుడి కోసం పైరవీలు మొదలుపెట్టిన చంద్రబాబు తాజాగా రఘురామ కొత్త రాగం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమంటూ ప్రకటన నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక. చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటూ రఘురామ వ్యాఖ్య నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుందంటూ గప్పాలు 07:42AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు గంజాయి వ్యాఖ్యలు.. భగ్గుమన్న వ్యాపారులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రావులపాలెం బంద్ కు పిలుపునిచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ రావులపాలెంలో టీడీపీ నిర్వహించిన ప్రజా గళం సభలో వ్యాపారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు రావులపాలెంలో కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతారంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన వ్యాపారులు బంద్ నిర్వహించడంతోపాటు చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న చాంబర్ ఆఫ్ కామర్స్ చంద్రబాబు మాటలపై మండిపడుతున్న ఆర్యవైశ్య సంఘాలు 07:15AM, ఏప్రిల్ 05 2024 మరో రెండు జనసేన సీట్లు బాబు ఖాతాలోకే చంద్రబాబుతో పొత్తంటే బాబు మెచ్చిన వాళ్లకి, బాబు చెప్పిన వాళ్లకి, బాబు పంపిన వాళ్లకి టికెట్లిచ్చేయడమే. జనసేనకు కేటాయించిన మరో రెండు సీట్లనూ చంద్రబాబు ఇలాగే కొట్టేశారు. టీడీపీ నేతలకే దక్కిన రైల్వేకోడూరు, అవనిగడ్డ జనసేన సీట్లు అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్కే గతంలో జనసేనను తీవ్రంగా విమర్శించిన బుద్ధ ప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన బుద్ధ ప్రసాద్ బుద్ధ ప్రసాద్కు టికెట్ఇవ్వడంపై అవనిగడ్డ జనసేనలో అసంతృప్తి రాజీనామాలకు సిద్ధమైన పలు వర్గాలు మరోవైపు.. బాబు ఒప్పుకోలేదని రైల్వేకోడూరు అభ్యర్ధిని మార్చేసిన పవన్ యనమల భాస్కరరావు పేరును స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్ బాబు కోసం.. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రధాన అనుచరుడు అరవ శ్రీధర్కు టికెట్ మూడు రోజుల కిందట జనసేనలో చేరిన ముక్కవారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ పవన్ నిర్ణయంపై మండి పడుతున్న పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయా స్థానాల్లో జనసేన శ్రేణుల నిర్ణయం? 07:06AM, ఏప్రిల్ 05 2024 అధికారులపై సీఎం రమేష్ దౌర్జన్యం అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దౌర్జన్యం టీడీపీ సానుభూతిపరుడు షాపుపై డీఆర్ఐ అధికారుల తనిఖీలు జీఎస్టీ రికార్డులు తనిఖీలు చేస్తున్న అధికారులపై గుండాయిజం తనిఖీలు వెంటనే ఆపాలంటూ బెదిరింపులు నా సంగతి మీకు తెలియదు అంటూ రౌడీయిజం అధికారులను ఏక వచనంతో సంబోధిస్తూ అధికారుల చేతిలో నుంచి ఫైళ్లు లాక్కున్న సీఎం రమేష్ సీఎం రమేష్ రౌడీయిజం చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు ప్రశాంతమైన అనకాపల్లిలో గతంలో ఎన్నడు ఇటువంటి సంఘటన జరగలేదంటున్న ప్రజలు అధికారులపై టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన సీఎం రమేష్ పోలీసులు సర్ది చెప్పిన పట్టించుకోని సీఎం రమేష్ టీడీపీ కార్యకర్తలు ఎక్కడ నుంచో వచ్చి అనకాపల్లిలో రౌడీయిజం చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం 06:54AM, ఏప్రిల్ 05 2024 నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం నేటి నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాజమండ్రి ఎంపీ బరిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి పొత్తులో భాగంగా.. పది అసెంబ్లీ, ఆరు ఎంపీ సీట్లు తీసుకున్న ఏపీ బీజేపీ సీట్ల పంపకంపై ఏపీ బీజేపీలో తీవ్ర అసంతృప్తి.. పురందేశ్వరి తీరుపై విమర్శలు టీడీపీ తీసుకున్న విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం బీజేపీ నరసాపురం సీటును వదులుకునే చాన్స్ నరసాపురం ఎంపీ సీటు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్న రఘురామ కృష్ణంరాజు కడప ఎంపీ సీటును బీజేపీ ఇచ్చే యోచనలో టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం టీడీపీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ మరో మూడు నాలుగురోజుల్లో సీట్లు మార్చుకునే అంశంపై రానున్న స్పష్టత 06:49AM, ఏప్రిల్ 05 2024 తిరుపతి జిల్లా సిద్ధంపై సీఎం జగన్ ట్వీట్ తిరుపతి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం యాత్ర గురువారం సీఎం జగన్ బస్సు యాత్రకు తిరుపతి ప్రజల బ్రహ్మరథం సాయంత్రం నాయుడుపేట బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం: సీఎం జగన్ నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం: సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు: సీఎం జగన్ 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం: సీఎం జగన్ ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు: సీఎం జగన్ తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు: సీఎం జగన్ పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా?: సీఎం జగన్ పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి?: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా?: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి: సీఎం జగన్ ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు: సీఎం జగన్ చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే: సీఎం జగన్ Day-8 తిరుపతి జిల్లా సిద్ధం! #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/1GxnW91kLr — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/ewqX04uLG4 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 06:40AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకి ఈసీ నోటీసులు సీఎం జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు గురువారం నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం మార్చి 31వ తేదీన నిర్వహించిన ప్రజా గళం సభల్లో చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీకి వైఎస్సార్సీపీ లేళ్ల అప్పిరెడ్డి, మరొకరు ఫిర్యాదు ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుకి నోటీసులు 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ ఈసీ ఆదేశం 06:30AM, ఏప్రిల్ 05 2024 చివరకు ఇదీ టీడీపీ పరిస్థితి: YSRCP ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి టీడీపీకి అంత బెరుకేంటో? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. వలంటీర్ వ్యవస్థను నిలువరించి.. ఫించన్లను జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ అదే సమయంలో.. టీడీపీని మరింతగా ముంచేస్తున్న పొత్తులు సీట్ల పంపకాల్లో బాబు ఒంటెద్దు పోకడ ప్రజల్లో దిద్దుకోలేక.. పార్టీలో సర్దుకోలేక చేతులెత్తేస్తున్న చంద్రబాబు! ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి అంత బెరుకేంటి @JaiTDP..? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. దాంతో నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ టీడీపీని నిండా ముంచేస్తున్న పొత్తులు, సీట్ల పంపకాల్లో బాబు… pic.twitter.com/nJNBTLnz5B — YSR Congress Party (@YSRCParty) April 4, 2024 -
టీడీపీ కోసం మరో అభ్యర్థిని మార్చేసిన పవన్
సాక్షి, అన్నమయ్య: జనసేన శ్రేణుల అభిప్రాయాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పూచిక పుల్లలా తీసి పారేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇంకా ఒకట్రెండు పెండింగ్ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రటించాల్సి ఉంది. అయితే ఈలోపే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పునకు దిగింది. అదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారనే!. తాజాగా రైల్వే కోడూరు అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మార్చేశారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును గురువారం మధ్యాహ్నాం ప్రకటించింది జనసేన పార్టీ. యనమల భాస్కర్ స్థానంలో అరవ శ్రీధర్ను అభ్యర్థిగా పోటీలో నిలుపుతున్నట్లు ఒక నోట్ రిలీజ్ చేసింది. క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ మార్పు చేసినట్లు సదరు నోట్ తెలిపింది. అయితే.. యనమల ఇంకా ప్రచారంలోకి దిగకముందే ఈ మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. అదే సమయంలో.. ముక్కావారి పల్లె గ్రామసర్పంచ్గా ఉన్న అరవ శ్రీధర్.. మూడు రోజుల కిందటే జనసేనలో చేరడం గమనార్హం. అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్#VoteForGlass pic.twitter.com/5zGc4kndba — JanaSena Party (@JanaSenaParty) April 4, 2024 అంతకు ముందు.. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా యనమల భాస్కర్పై సర్వేల్లో సానుకూలత రాలేదని.. మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకుండా పోయిందంటూ అభ్యర్థి మార్పుపై జనసేన నేరుగా ప్రకటన చేసేయడం గమనార్హం. ఇప్పటికే ఆళ్లగడ్డ సీటును టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్ధ ప్రసాద్కు కేటాయించిన సంగతి తెలిసిందే. మన్యం పాలకొండ స్థానం సైతం టీడీపీ నుంచే వలస వచ్చిన నిమ్మక జయకృష్ణకే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఆ ప్రకటన కూడా వెలువడనుంది. -
పండుటాకులు విలవిల
సాక్షి నెట్వర్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిల కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ఎన్నికల సంఘంపై తమ అనుకూలురుతో ఒత్తిడి తెచ్చి పింఛన్ల పంపిణీ చేయనీయకుండా వలంటీర్లను ఈ ముగ్గురు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవ్వాతాతలు, ఇతర పింఛన్ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1నే లబ్దిదారులు ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్ అందిస్తుండగా ఈసారి టీడీపీ, జనసేన కుతంత్రాలతో సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం ఎండా కాలం కావడంతో వేసవి తాపానికి వడదెబ్బ కొట్టి మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 20 మంది పింఛన్ లబ్దిదారులు మృత్యువాత పడటం విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబీకులు చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఆయన వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతలు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఒక్కరోజే 20 మంది మృత్యువాత అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన ఎన్.రాజమ్మ (85) సచివాలయం వద్దకు నడిచి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో రాయి కాలుకు తగిలి ముందుకుపడి మృతి చెందింది. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లిలో టీడీపీ కుట్రలతో ఆందోళనకు గురైన దుగ్గిలమ్మ(70) అనే వృద్ధురాలు మృతిచెందింది. అలాగే గుండెపోటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మద్దులచెర్వులో చోటు చేసుకుంది. అదేవిధంగా కొండకమర్ల పంచాయతీ పోలేవాండ్లకొత్తపల్లిలో సన్నాయప్ప (73) తన భార్య పింఛన్ కోసం ఎండలో నడుచుకుంటూ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వడదెబ్బకు గురై మృతి చెందాడు. సూళ్లూరుపేట సాయినగర్లో ఈశ్వరవాక లలితమ్మ (58) వితంతు పింఛను కోసం గాండ్లవీధి సచివాలయం వద్ద క్యూలో నిలబడి ముందుకు పడిపోయి ప్రాణాలు విడిచింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం ఎరికంబట్టు దళితవాడకు చెందిన అప్పాస్వామి(75) పెన్షన్ కోసం ఇంటి బయటే మంచంపై ఎదురు చూస్తూ ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై మరణించాడు. అలాగే చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన నన్నేసాహెబ్ (76) పింఛన్ కోసం వెళ్లి సచివాలయం వద్ద కుర్చిలో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన సచివాలయం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు నన్నేసాహెబ్ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఘడియపూడి పునరావాస కాలనీలో బొమ్మల శేషయ్య (70) పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లి ఇంటికి చేరుకుని భోజనం చేసి నీరసంగా పడుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేపడానికి ప్రయత్నించగా విగత జీవుడై ఉన్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లికి చెందిన బుర్ర శామ్యూలు (71) గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. అలాగే గుంటూరు జిల్లా కొల్లిపరలో దొప్పలపూడి బాబూరావు (62) వ్యవసాయ కూలీ. ఈ క్రమంలో పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లిన బాబూరావు తిరిగొస్తూ ఇంటికి సమీపంలో కుప్పకూలిపోయి మరణించాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరుకు చెందిన సయ్యద్ ఖాదర్బాషా బోదకాలుతో బాధ పడుతున్నాడు. ఈసారి సచివాలయం వద్ద ఇస్తారని తెలిసి కుమారుడి బైక్పై అక్కడకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక అస్వస్థతకు గురై మృతిచెందాడు. కాకినాడ జిల్లా తూరంగి పగడాలపేటకు చెందిన అడపా వీర్రాజు (67) పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో కళ్లు తిరగడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు వీర్రాజును ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. అలాగే ఏటిమొగ ప్రాంతానికి చెందిన పట్టా అప్పారావు(61) సమీపంలోని సచివాలయానికి వెళ్లాడు. ఎండ తీవ్రతతో సచివాలయం దగ్గరే స్పృహ తప్పాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఏటిమొగలోని రాజీవ్ గృహకల్ప సముదాయానికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన పిల్లి నాగేశ్వరమ్మ (75) కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్న సచివాలయానికి కాలినడకన బయలుదేరింది. కొంత దూరం నడిచి ఆయాసంతో పడిపోయి మృత్యువాత పడింది. పల్నాడు జిల్లా దుర్గి మండల పరిధిలోని నెహ్రూనగర్ తండాకు చెందిన రమావత్ సాలిబాయి (70) పెన్షన్ కోసం ముటుకూరు 2 సచివాలయానికి ఆటోలో వెళ్తుండగా దారి మధ్యలో సొమ్మసిల్లి కుప్పకూలింది. ఆమెను ముటుకూరు పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దిగువతొట్లివారిపల్లె గ్రామానికి చెందిన టి. మంగమ్మ(68) ఇంట్లోనే ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలిపోయి మృతి చెందింది. పింఛన్ కోసం ఎండలో వెళ్లి వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాజుబాబు (48) పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయానికి ఎండలో వెళ్లాడు. దీంతో వడదెబ్బకు గురికావడంతో ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందినట్లు ఆయన భార్య సీత తెలిపింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ వేలమామడికి చెందిన పాడి సొములు(65) పింఛన్ కోసం పెదకోట సచివాలయానికి నడుచుకుని వెళుతుండగా జాలడ గ్రామ సమీపంలో ఆయాసం రావడంతో కూర్చొన్నాడు. అదే సమయంలో సొమ్మసిల్లిపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన పింఛన్ లబ్దిదారుడు పాతకోకిల పెద్దిరాజు (63) పింఛన్ ఇస్తున్నారని తెలిసి సచివాలయానికి బయలుదేరాడు. తీవ్ర ఉద్వేగానికి గురైన పెద్దిరాజు ఇల్లు దాటి వెళుతుండగా కొద్దిదూరంలో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. చేతులు విరిగి.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట సచివాలయానికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన పోలి తులసమ్మ అనే వృద్ధురాలు తిరిగి వస్తూ కింద పడటంతో చేయివిరిగింది. ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం వేంపాడుకు చెందిన గ్రంధి మరియమ్మ (71) పింఛను నగదు కోసం ముండ్లమూరు సచివాలయానికి వెళ్లింది. మండుటెండలో ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ సెంటరుకు వచ్చింది. ఆటో ఎక్కే క్రమంలో ఎండధాటికి సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఈ క్రమంలో ఆమె మూతికి, పెదాలకు తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన పరుచూరి కృష్ణకుమారి (74) గుండెపోటుకు గురయ్యారు. చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పొన్న సుబ్బారావు అనే వృద్ధుడు పింఛను కోసం గ్రామ సచివాలయానికి వెళుతూ మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయారు. పింఛన్ తీసుకోవాలంటే 30 కి.మీ వెళ్లాల్సిందే టీడీపీ నేతల నిర్వాకంతో వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో గిరిజనులు అల్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చెన్నపాలెం గ్రామం గారపెంట పంచాయతీలో ఉండగా దాని సచివాలయం పుల్లలచెరువులో ఉంటుంది. పుల్లలచెరువు నుంచి చెన్నపాలెం గిరిజనగూడెం వెళ్లాలంటే రానుపోను కలిపి 30 కి.మీ దూరం. ఇప్పటి వరకు వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇస్తున్నారు. ఈనెల వలంటీర్లు రాకపోవడంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు కూడా సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి వచ్చింది. మండుటెండలో అంతదూరం వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కల్పించారంటూ వృద్ధులు, వికలాంగులు టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల డ్రామాలు ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డ్రామాలు మొదలుపెట్టారు. బుధవారం పట్టణంలోని సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్ల పంపిణీకి సంబంధించి టీడీపీ వల్ల ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి వృద్ధులను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇలా ఎందుకు కూర్చోబెట్టారు అంటూ సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. సచివాలయం బయటకు వచ్చి పింఛన్దారులతో మాట్లాడుతూ ఇంకా పింఛన్ డబ్బులు రాలేదు కానీ టీడీపీ వల్లే పింఛన్లు ఇంటికి రావడం లేదని అంటున్నారన్నారు. ఎమ్మెల్యే నిమ్మల వెళ్లిపోయిన తర్వాత అక్కడున్న పింఛన్దారులంతా ఇంటికి పింఛన్లు రాకుండా ఈ టీడీపీ నాయకులే అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరిపై పింఛన్దారుల ధర్నా పింఛను పంపిణీ విధానంపై చంద్రబాబు వైఖరి పట్ల లబ్దిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడులో సచివాలయం వద్ద పింఛనుదారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రతి నెల వలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ల కార్యక్రమాన్ని అడ్డుకున్న చంద్రబాబు వైఖరి నశించాలని నినాదాలు చేశారు. పాత పద్ధతిలో వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో ‘బోడె’ శవ రాజకీయం టీడీపీ, జనసేన కుట్రలతో ఈసారి పింఛన్ ఇవ్వటానికి వలంటీర్ లేకపోవటంతో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వెంపటి వజ్రమ్మ (80)గుండెపోటుకు గురై మరణించింది. గంగూరు ఏఆర్ నగర్ కాలనీలో ఉంటున్న వజ్రమ్మ గంగూరు 2 సచివాలయానికి పింఛన్ సొమ్ము కోసం వెళ్లగా బ్యాంకు నుంచి సొమ్ము రావాలని, సాయంత్రం పింఛన్ ఇస్తామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. సచివాలయం నుంచి ఇంటికి వచ్చిన కొద్ది క్షణాలకే గుండెపోటుకు గురై మృత్యువాత పడింది. మరోవైపు చేయాల్సిందంతా చేసి డ్రామాలకు టీడీపీ నేతలు తెరలేపారు. వజ్రమ్మ మృతిని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు యత్నించగా స్థానిక మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపి తిప్పికొట్టారు. వజ్రమ్మ మృతి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ బాధితురాలి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వజ్రమ్మకు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కాగా.. మంత్రి అక్కడ ఉన్న సమయంలోనే టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కూడా తన అనుచరులతో రావటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సమయంలో టీడీపీ అభ్యర్థి బోడెప్రసాద్, అతని అనుచరులు కల్పించుకుని జగన్ పింఛన్ ఇవ్వకపోవటంతోనే వజ్రమ్మ మరణించిందంటూ ఆరోపించారు. బోడె ప్రసాద్ వ్యాఖ్యల పట్ల మహిళలు అభ్యంతరం తెలిపారు. వజ్రమ్మ మరణాన్ని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు చేసిన యత్నాన్ని లబ్ధిదారులే తిప్పికొట్టారు. వలంటీర్లు పింఛను ఇస్తే చంద్రబాబుకు బాధ ఏంటని బోడె ప్రసాద్ను మహిళలు, పింఛన్ లబ్ధిదారులు ప్రశ్నించారు. జగనన్న పాలనలో ప్రతి నెల వేకువజామునే వలంటీర్లు ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు. వజ్రమ్మ అన్యాయంగా చనిపోయిందని, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారా అని నిలదీశారు. ఒక్కసారిగా మహిళలు తిరగబడటంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. -
Pawan: ‘మా బిడ్డకు వేరొకరు తండ్రా?’
సాక్షి, కృష్ణా: అవనిగడ్డ సీటు జనసేనలో కుంపట్లు రాజేసింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్కు టికెట్ ఖరారు చేస్తుండడాన్ని ఆ పార్టీ ‘అసలైన’ నేతలు భరించలేకపోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా.. దాదాపు ప్రసాద్కే టికెట్ ఖాయమైపోయిందనే చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ తరుణంలో ఆందోళనలకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి.విక్కుర్తి శ్రీనివాస్ నేతృత్వంలో ఇవాళ అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్కే టికెట్ కేటాయించాలని జనసేన నేతలు, ఆయన అనుచర గణం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ్టి సమావేశంలో తీర్మానం చేయాలని నిర్ణయించాయి. ఆలస్యం చేయకుండా ఈ తీర్మానాన్ని పవన్కు పంపడం ద్వారా.. సీటు శ్రీనివాస్కే కేటాయించేలా జనసేన అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అయితే.. ‘‘మండలి బుద్ధ ప్రసాద్ గతంలో జనసేనను పిల్లల పార్టీ అన్నారు. జనసేనలో డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మరీ సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్కు ఏముంది?. పార్టీలో అర్హులైనవాళ్లు ఎవరూ లేరా?. న్యాయంగా చూసుకుంటే అవనిగడ్డ టికెట్ నాకే దక్కాలి. కానీ, చివరి నిమిషంలో మార్చేశారు’’ అని విక్కుర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థినే నిలబెట్టేందుకు పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మాబిడ్డకు వేరొకరు తండ్రి అవుతారంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారాయన. పార్టీ కోసం కష్టపడిన ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క పార్టీ నాయకులను తీసుకొస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మమ్మల్ని కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. పదేళ్లు ఏ కష్టం వచ్చినా సరే.. పార్టీని వీడకుండా ఉన్నాం. ఒక్క సీటు నెగ్గిన కష్టకాలంలోనూ పవన్ వెంటే నడిచాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ పరాయి పార్టీ జెండాలు మోశాం. ఇప్పుడేమో.. చంద్రబాబు, పవన్ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్టు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తారా? అని.. జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవేళ పార్టీ వ్యక్తికి కాదని బయటకు వాళ్లకు ఇస్తే గనుక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పవన్ను అవనిగడ్డ జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. -
Pawan Kalyan: ‘మా బిడ్డకు వేరొకరు తండ్రా?’
కృష్ణా, సాక్షి: అవనిగడ్డ సీటు జనసేనలో కుంపట్లు రాజేసింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్కు టికెట్ ఖరారు చేస్తుండడాన్ని ఆ పార్టీ ‘అసలైన’ నేతలు భరించలేకపోతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా.. దాదాపు ప్రసాద్కే టికెట్ ఖాయమైపోయిందనే చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ తరుణంలో ఆందోళనలకు జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి. విక్కుర్తి శ్రీనివాస్ నేతృత్వంలో ఇవాళ అవనిగడ్డలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్కే టికెట్ కేటాయించాలని జనసేన నేతలు, ఆయన అనుచర గణం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ్టి సమావేశంలో తీర్మానం చేయాలని నిర్ణయించాయి. ఆలస్యం చేయకుండా ఈ తీర్మానాన్ని పవన్కు పంపడం ద్వారా.. సీటు శ్రీనివాస్కే కేటాయించేలా జనసేన అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అయితే.. ‘‘మండలి బుద్ధ ప్రసాద్ గతంలో జనసేనను పిల్లల పార్టీ అన్నారు. జనసేనలో డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని మరీ సీటు ఇవ్వాల్సిన అవసరం పవన్కు ఏముంది?. పార్టీలో అర్హులైనవాళ్లు ఎవరూ లేరా?. న్యాయంగా చూసుకుంటే అవనిగడ్డ టికెట్ నాకే దక్కాలి. కానీ, చివరి నిమిషంలో మార్చేశారు’’ అని విక్కుర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థినే నిలబెట్టేందుకు పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్కొన్నారు. మాబిడ్డకు వేరొకరు తండ్రి అవుతారంటే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారాయన. పార్టీ కోసం కష్టపడిన ఒకరిని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క పార్టీ నాయకులను తీసుకొస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మమ్మల్ని కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. పదేళ్లు ఏ కష్టం వచ్చినా సరే.. పార్టీని వీడకుండా ఉన్నాం. ఒక్క సీటు నెగ్గిన కష్టకాలంలోనూ పవన్ వెంటే నడిచాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ పరాయి పార్టీ జెండాలు మోశాం. ఇప్పుడేమో.. చంద్రబాబు, పవన్ ఒప్పందం ప్రకారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ను పార్టీలో చేర్చుకొని, టిక్కెట్టు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తారా? అని.. జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవేళ పార్టీ వ్యక్తికి కాదని బయటకు వాళ్లకు ఇస్తే గనుక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పవన్ను అవనిగడ్డ జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. -
టీడీపీ వాళ్లను చూసి నేర్చుకోండి.. పిఠాపురం జనసేన నేతలతో పవన్
పిఠాపురం: ‘టీడీపీ వాళ్లను చూసి నేర్చుకోండి.. వాళ్లను ఫాలో అవ్వండి’ అని తన పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్కళ్యాణ్ సూచించారు. పిఠాపురం పర్యటనను ఆదివారం అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్ వెళ్లిపోయిన ఆయన.. సోమవారం మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా జనసేన నేతలతో సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేన నేతలందరూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యాన ఆ పార్టీ నాయకులతో కలిసి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరుతో ఫొటో దిగాలని ఉందని, పరిస్థితులు అనుకూలించగానే రోజుకు 200 మందితో ఫొటోలు దిగాలని భావిస్తున్నట్టు తెలిపారు. తన విజయం కోసం స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మెజారిటీ ఎంత తీసుకురావాలనేది వారిపైనే వదిలేస్తున్నానని, వారు పడే కష్టం మీదే తన మెజారిటీ ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రైల్వే కోడూరు అభ్యర్థి అరవ శ్రీధర్, పాలకొండకు చెందిన నిమ్మక జయకృష్ణ తదితరులు జనసేనలో చేరారు. సాయంత్రం పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అంతా టీడీపీ నేతలతోనే అని పవన్ అంటుంటే.. ఇక తామెందుకు అంటూ జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి పనిచేస్తుంటే ఎవరి కిందో పని చేయాలనడం ఎంత వరకూ సమంజసమంటూ పవన్ తీరుపై వారు రుసరుసలాడుతున్నారు. -
Jana Sena: పెండింగ్ స్థానాలు ఇక వాళ్లకే!
గుంటూరు, సాక్షి: పొత్తుల ప్రకటన మొదలు, చంద్రబాబు నుంచి సీట్లు దక్కించుకోవడం, అభ్యర్థుల ఎంపిక.. ఇలా అన్నింటా పవన్ కల్యాణ్ ఇంతలా అయోమయానికి గురవుతారని పదేళ్లు ఆయన వెంట నడుస్తున్న నేతలెవరూ ఊహించి ఉండరు. పైగా మునుపెన్నడూ లేనంత కుట్ర పూరిత రాజకీయాలకు తెర తీస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ జెండాలు మోసే వారి కంటే, జెండాలు మార్చే వారికే విలువ పవన్ ఇస్తున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. నమ్ముకున్నవాళ్లకు సైతం పవన్ వెన్నుపోటు పొడుస్తున్న పరిస్థితులు చూస్తున్నవే. కేడర్ బలం కంటే ధనబలానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ తీరును నిరసిస్తూ పలువురు పార్టీని వీడారు. కొందరైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఆగాలనుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇంకా గుడ్డిగా పవనే నమ్ముకుంటున్నారు. పెండింగ్లో ఉన్న విశాఖ సౌత్, ఆళ్లగడ్డ, పాలకొండలోనూ జనసేన అసలైన నేతలకు మొండిచేయే దక్కనున్నట్లు తెలుస్తోంది. విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్ పేరు నుంచి తొలి నుంచి వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ వంశీని ఎమ్మెల్సీని చేస్తే.. పార్టీ ఫిరాయించి జనసేనలో చేరారాయన. అయితే విశాఖ సౌత్ నియోజకవర్గం హామీతోనే ఆయన జనసేనలో చేరినట్లు తొలి నుంచి ప్రచారం ఉంది. అయితే.. జనసేనలో తామేమీ గొర్రెలం కాదని, వంశీకి సీటు ఇస్తే ఊరుకునేది లేదంటూ జనసేన నేతలు అక్కడ ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో వంశీ తన అనుచరులతో వీరమహిళలపై దాడి కూడా చేయించారు. అయినప్పటికీ పవన్ మాత్రం వంశీకే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. విశాఖ సౌత్ను పక్కనపెడితే.. అవనిగడ్డ(కృష్ణా), పాలకొండ(మన్యం) అభ్యర్థుల కోసం జనసేన తీవ్ర కసరత్తులు చేసింది. పవన్ గొంతుతో ఐవీఆర్ఎస్ సర్వేలు సైతం నిర్వహించింది. మరోవైపు.. తాజాగా జనసేనలో చేరికలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో కేడర్ను కాదని బయటివాళ్లకే అవకాశం ఇవ్వాలని పవన్ డిసైడ్ అయ్యారనే చర్చ ఊపందుకుంది. పాలకొండలోనూ.. పాలకొండ ( పార్వతీపురం మన్యం జిల్లా) టికెట్ను నిమ్మక జయకృష్ణకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి దాకా టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న జయకృష్ణ.. ఇవాళ జనసేన కండువా కప్పుకోబోతున్నారు. ‘‘ పార్టీ ఏది అయితే నేమి కూటమిలోనే ఉంటాం కదా’’ అని ఆయన అనుచరులు సైతం మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాలకొండలో రాజకీయ కుటుంబంగా ఉన్న జయకృష్ణ.. వరుసగా పోటీ చేస్తున్నారే తప్ప గెలవడం లేదు. అయినా కూడా ఆయనకే టికెట్ ఇవ్వనున్నారు. ఇక ఇక్కడ హ్యాట్రిక్పై వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి కన్నేశారు. అవనిగడ్డ బరిలో ఆయన? కృష్ణా జిల్లా రాజకీయాల్లో అవనిగడ్డకు ప్రత్యేక స్థానం ఉంది. ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు వెళ్లింది. అయితే అభ్యర్థి విషయంలో మాత్రం పవన్ చాలా మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెరపైకి వచ్చింది సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పేరు. మండలి బుద్ధప్రసాద్ ఇవాళ అధికారికంగా జనసేనలో చేరనున్నారు. దీంతో సీటు దాదాపుగా ఆయనకే ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. అవనిగడ్డ నుంచి మూడు పర్యాయాలు బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా నెగ్గారు. కాంగ్రెస్తో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన గతంలో మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గానూ పని చేశారు. ఇప్పుడు ఈయన కూడా జనసేన తరఫునే పోటీకి దిగడం దాదాపుగా ఖరారయ్యింది. అవనిగడ్డలోనూ పవన్ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. కృష్ణారావుతో పాటు శ్రీనివాస్, బండిరెడ్డి రామకృష్ణ (టివి9)లాంటి పలువురు అభ్యర్థుల పేర్లనూ పరిశీలించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచే వలస వస్తున్న సీనియర్ నేతకు పవన్ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఈ పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మచిలీపట్నం జనసేన లోక్సభ అభ్యర్థి ప్రకటన
కృష్ణా, సాక్షి: పెండింగ్ ఎంపీ సీటుకు జనసేన అభ్యర్థిని ప్రకటించింది. ముందు నుంచి ఊహించినట్లే జనసేన తరఫు నుంచి మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ లోక్సభ స్థానం నుంచి తంగెనళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తారని పవన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి పొత్తులో భాగంగా.. జనసేన 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు తీసుకుంది. ఇప్పటికే ఒక లోక్సభ, 18 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా బాలశౌరిని మచిలీపట్నం పార్లమెంట్ స్థానపు అభ్యర్థిగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ తరఫున 2019లో ఎంపీగా నెగ్గిన వల్లభనేని బాలశౌరి.. ఈ ఏడాది జనవరి 14న పార్టీని వీడారు. ఫిబ్రవరి 4వ తేదీన జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే.. పెండింగ్లో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల కోసం పవన్ మల్లగుల్లాలు పడుతున్నారు. విశాఖ సౌత్ సీటును వంశీ యాదవ్కు కేటాయిస్తారని తొలి నుంచి ప్రచారం జరుతోంది. అయితే వంశీకి సీటు ఇవ్వొద్దంటూ అక్కడి జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినా ఆ వలస నేతకే ఇవ్వాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు పెండింగ్లో ఉన్న అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లకు ధనబలం ఉన్న నేతలను ఎంపిక చేయాలని పవన్ భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయా స్థానాల్లో ఇప్పటికే పవన్ వాయిస్తో ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించే చాన్స్ ఉంది. -
పిఠాపురంలో పవన్ గెలవడు: ముద్రగడ
కాకినాడ, సాక్షి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం సినిమా గ్లామర్ వల్లే పవన్ రాజకీయ ఉనికి ఇంకా కొనసాగగలుగుతోందని ముద్రగడ కుండబద్ధలు కొట్టారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడ పలు అభిప్రాయాల్ని పంచుకున్నారు. పవన్ కల్యాణ్కు సినీ గ్లామర్ మాత్రమే ఉంది. అందుకే యువకులు ఆయన వెంటపడుతున్నారు. కానీ, ఏరకంగా చూసుకున్నా పవన్ కంటే ఆయన అన్న చిరంజీవి ఎంతో బెటర్. రాజకీయాలు పక్కనపెట్టి పవన్ చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడు. అసలు పిఠాపురంలో ఎట్టిపరిస్థితుల్లో పవన్ గెలిచే ప్రసక్తే లేదు అని ముద్రగడ చెబుతున్నారు. ఇక తనపై పోలీసుల దాడి అప్పట్లో నారా లోకేష్ ఆదేశాల మేరకే జరిగిందని ముద్రగడ సంచలన ఆరోపణ చేశారు. అలాగే.. ఏపీలో సీఎం జగన్ పాలనపై ముద్రగడ ప్రశంసలు గుప్పించారు. సీఎం జగన్ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. వైఎస్ జగన్ మాదిరిగా ఏ సీఎం ఇంత స్థాయిలో ప్రజలకు సంక్షేమం అందించలేదు. అందుకే జ్యోతిబసు(పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి) కంటే ఎక్కువ కాలం జగన్ ఆంధ్రప్రదేశ్కు సీఎంగా చేయాలి అని ముద్రగడ ఆకాంక్షించారు. ఇక వైఎస్సార్సీపీలో చేరిన తాను.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని మరోమారు స్పష్టం చేశారు. -
Pawan Kalyan: పక్కలో బల్లెం
పదేళ్లుగా ఆయన వెంట ఉన్నా. జనసేన కోసం ఎంతో కష్టపడ్డా. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పని చేశా. పవన్ కల్యాణ్పై నమ్మకం ఉంది. సీటు గ్యారెంటీగా నాకే వస్తుంది.. టికెట్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో అప్పటికే రెండుసార్లు పవన్ను కలిసిన తర్వాత కూడా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మీడియా ముఖంగా భావోద్వేగంగా మాటలివి. కానీ, చివరకు ఏం మిగిలింది?.. విజయవాడ వెస్ట్ సీటును ఆఖరిగా బీజేపీ ఎగరేసుకుపోయింది. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో విజయవాడ వెస్ట్ పరిణామాలు వాడీవేడిగా సాగాయి. అప్పటికే పొత్తు ప్రకటన చేసినా.. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలు ఇక్కడి సీటు తమదేనంటూ ప్రకటించుకున్నాయి. టీడీపీ నేతలు జలీల్ఖాన్, బుద్దా వెంకన్నలు ఎవరికివారే ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలతో తమ బలప్రదర్శనలు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే.. ఈలోపే విజయవాడ వెస్ట్ సీటు ఆలోచన వదులుకోవాలని, అది జనసేనకు కేటాయిస్తామని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. మొదటిసారి.. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లొచ్చనే చర్చా మొదలైంది. దీంతో జలీల్ఖాన్ ఒక అడుగు ముందుకేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. విజయవాడ వెస్ట్ సీటును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో ‘చూద్దాం’ అని పవన్ జలీల్ఖాన్తో చెప్పారనే విషయం బయటకు పొక్కింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కాస్త ఆందోళనకు లోనయ్యారు. వెంటనే పవన్ కల్యాణ్ను కలిశారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పవన్ ఇచ్చిన భరోసాతో సీటు కచ్చితంగా తనకే వస్తుందని పాపం పోతిన మహేష్ భావించారు. రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, టీడీపీ బదులు బీజేపీ రూపంలో టికెట్ గండాన్ని.. చంద్రబాబు తెర వెనుక జరిపిన కుట్రల్ని ఆయన పసిగట్టలేకపోయారు. రెండోసారి.. కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది. ఆ సమయంలోనే విజయవాడ వెస్ట్పై బీజేపీ నేతలు కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ సీటు తమకే కావాలని బీజేపీ పట్టింది. దీంతో పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్న మహేష్.. ఆగ్రహానికి లోనయ్యారు. మళ్లీ పవన్ కల్యాణ్ను కలిశారు. టికెట్పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. కంగారు పడొద్దంటూ పవన్ మరోసారి అభయం ఇవ్వడంతో మహేష్ మెత్తబడ్డారు. కానీ, అప్పటికే వెస్ట్ సీటుపై నిర్ణయం జరిగిపోయింది!. బీజేపీ నేత వ్యాఖ్యలతో కన్ఫర్మ్ విజయవాడ వెస్ట్ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గత గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. వెస్ట్ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. పార్టీ డిసైడ్ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని ప్రకటన చేశారు. దీంతో.. మహేష్ మళ్లీ ఆందోళనకు దిగారు. అయినా నమ్మకమే! ఈసారి ఏకంగా.. తన కార్యాలయంలోనే మహేష్ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో.. ‘‘పార్టీకి విధేయుడిగా, పదేళ్లు నాకు నమ్మకస్తుడిగా ఉన్న నీకు.. విజయవాడ వెస్ట్ సీటు ఖాయం అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. తాజా సమావేశంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నా. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైఎస్సార్సీపీతో పోటీ పడలేరు. ఒకవేళ ఇక్కడి సీటు బీజేపీకే వెళ్తే.. అది కచ్ఛితంగా వైఎస్సార్సీపీకి అనుకూలిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ మాట నిలబెట్టుకోలేకపోతే? అనే ప్రశ్నకు.. ఒకవేళ బీజేపీ సుజనా చౌదరికే గనుక టికెట్ ఇస్తే రెబల్గా పోటీ చేస్తా.. అదీ పవన్ ఫొటోతోనే అని. తమ సత్తా చూపించుకునేందుకు కొత్త తరం నేతలకు కూడా అవకాశాలు దక్కాలి కదా అని వ్యాఖ్యానించారు. కానీ.. మూడోసారీ.. చివరకు విజయవాడ వెస్ట్లో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ జాబితాలో టికెట్ సుజనా చౌదరికే వెళ్లింది. అయినా విజయవాడ వెస్ట్ సీటుపై పోతిన వెంకట మహేష్ పట్టువీడడం లేదు. జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు రెండ్రోజుల ముందు మూడోసారి మహేష్ను పిలిపించుకున్న పవన్.. బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, మహేష్ ససేమీరా అంటున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పవన్ పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ వల్ల నిజంగా కాలేదా? కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం అని చెబుతున్న మహేష్కు.. పవన్ మాత్రం అన్యాయం చేశారు. అయితే.. టీడీపీ-బీజేపీల బలవంతపు పొత్తు కోసం విశ్వప్రయత్నం చేసిన పవన్.. మధ్యలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని, పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. మరి అంతగా బాధపడిపోయిన పవన్.. పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లకు కాకుండా జంప్జిలానీలకు ఒకట్రెండు సీట్లు ఇచ్చిన పవన్.. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో బీజేపీని ఒప్పించలేకపోయారా?.. నమ్మకంగా ఉన్న మహేష్కు టికెట్ ఇప్పించలేకపోయారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనసైనికులిప్పుడు. సీటు మహేష్కేనంటూ నమ్మించి మోసం చేశారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తూ వెన్నుపోటులో చంద్రబాబునే మించిపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు పాచికేనా? విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. అభ్యర్థి విషయంలో మాత్రం ‘రాజీ’ పడిందా?. వక్కల గడ్డ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాంలాంటి వాళ్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. నమ్మకస్తులు ఉన్నా.. సుజనా చౌదరికే టికెట్ ఎందుకు ఇచ్చారు? పేర్ల పరిశీలనలో ఏం జరిగింది?.. అని బీజేపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో చక్రం తిప్పిన చంద్రబాబే.. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరికే విజయవాడ వెస్ట్ నియోజక వర్గం టికెట్ దక్కేలా చేశారనే టాక్ బలంగా వినిపిస్తోందిప్పుడు. -
March 27th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 27th Latest News Telugu.. 9:04 PM, March 27th 2024 చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చాయి తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ ఈనాడు పేపర్ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు. వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు పెన్షన్ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం 7:06 PM, March 27th 2024 పురంధేశ్వరిని కలిసిన పరిపూర్ణానంద స్వామి హిందూపురం ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని వినతి. లేనిపక్షంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతా: పరిపూర్ణానంద ఉదయం వచ్చి మధ్యాహ్నం అభ్యర్థులైపోతున్నారు. పొత్తుకు ముందు నుంచే నేను హిందూపురం టికెట్ ఆశించా 6:06 PM, March 27th 2024 జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాలు పెండింగ్. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్ లో ఉంచిన జనసేనాని. ఆయా నియోజకవర్గాల నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయిన పవన్. విజయవాడ పశ్చిమ సీటు కోసం పవన్ ను కలిసిన పోతిన మహేష్. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు పవన్ కసరత్తు. ఈనెల 30 నుంచి పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించనున్న పవన్ 5:06 PM, March 27th 2024 ‘మేము సిద్దం’ బస్సు యాత్రకు గ్రామగ్రామాన ప్రజల బ్రహ్మరథం తమ అభిమాన నాయకుడు సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న జనం ప్రతి గ్రామానా పూలు చల్లుతూ ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు వేంపల్లెలో పూలు చల్లుతూ కోలాటం అడుతూ మహిళల స్వాగతం జనసంద్రంగా మారిన యర్రగుంట్ల గ్రామా గ్రామాన ప్రజలు తరలిరావడంతో ప్రొద్దుటూరు సభకు గంటన్నర అలస్యం ప్రొద్దుటూరుకు భారీగా చేరుకున్న ప్రజలు 4:58 PM, March 27th 2024 కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర కడప పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర వీరపునాయునిపల్లె చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర కాసేపట్లో యర్రగుంట్ల మీదగా ప్రొద్దుటూరు చేరుకోనున్న సీఎం జగన్ బస్సు యాత్ర ప్రొద్దుటూరు బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం జగన్ 4:34 PM, March 27th 2024 అధికారంలో వస్తే మద్యం ధరలు తగ్గిస్తాం.. ప్రజాగళం సభలో చంద్రబాబు నగరి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రతి రోజు నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు 3:55 PM, March 27th 2024 చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైనా పట్టుకుంటాడు చంద్రబాబు వెనుక ఉన్న తెలుగు తమ్ముళ్లకు.. పదిమంది జనసేనలకు తప్ప ...ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరు అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని తెలిసే ఇంటికి వెళ్లి మరీ పవన్ కాళ్లు పట్టుకున్నాడు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బాధపడని చంద్రబాబు.. అమిత్ షా డిమాండ్లకు తలొగ్గి తిరిగి పొత్తు పెట్టుకున్నాడు వాలంటీర్ల పై చంద్రబాబు యూటర్న్ అంతా దొంగ నాటకం వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడు వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తోంది వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదు చదువుకున్న వాలంటీర్లకు ఏది మంచో తెలుసు, అదే వాళ్లు ప్రజలకు చెబుతారు ఐదేళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తూ సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ అవమానకరంగా మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నాడు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే ఇప్పుడున్న వాలంటీర్లను ఇంటికి పంపి.. తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడు జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకుని వారికి జీతాలిస్తాడు 3:39 PM, March 27th 2024 నెల్లూరు సిటీలో నారాయణ చేసిన అభివృద్ధి ఓ బూటకం మాజీ మంత్రి నారాయణపై వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్ది ఫైర్ నెల్లూరు సిటిలో నారాయణ చేసిన అభివృద్ధి బూటకం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో నారాయణ.. హడ్కొ ద్వారా 11 శాతం వడ్డీతో 90 శాతం అప్పు తీసుకొచ్చారు.. టీడీపీ ప్రభుత్వం నుంచి సాయం శున్యం 830 కోట్లు అప్పు తీసుకుని పనులు కూడా పూర్తి చేయలేని అసమర్ధుడు పొంగూరు నారాయణ. 2019లో కేంద్ర పట్టణభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు, రాష్ట్ర పట్టణభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ ఉన్న సమయంలో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు.. స్మార్ట్ సిటీ జాబితాలో నెల్లూరుని చేర్చి ఉంటే.. పైసా ఖర్చు లేకుండా నెల్లూరు అభివృద్ధి జరిగేది రాజకీయాలకు నారాయణ సరిపోరు.. ఆయనోక అపరిచితుడు.. పని ఉంటే ఒకలా.. పని లేకపోతే మరోలా ప్రవర్తిస్తారు రూ 1100 కోట్లతో కేవలం రెండేళ్లలో పెన్నా నది.. సర్వేపల్లి కాలువ రిటైన్ వాల్స్.. పెన్నాపై కొత్త వంతెన వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ధి నెల్లూరు జిల్లా అభివృద్ధి.. 2007,2008,2009లో వైఎస్సార్ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి మొదలైంది. 3:29 PM, March 27th 2024 ‘వివేకం’ చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ ఈ చిత్రాన్ని లైవ్ స్ర్టీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం స్టేట్ ఎలక్షన్ కమిషన్ను ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో చిత్రీకరణ దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో హింసని ప్రేరేపించేలా ఉన్న సినిమా చర్యలు కోరిన లేళ్ల తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం 1:25 PM, March 27th 2024 ఎమ్మెల్సీ రఘురాజుపై ఫిర్యాదు ఎమ్మెల్సీ ఇందూకురి రఘురాజుపై అనర్హత పిటిషన్ ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు శాసనమండలి చైర్మన్కి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ విప్ పాలవలస విక్రాంత్ 1:20 PM, March 27th 2024 సీఎం జగన్ చేతల్లో చూపించే వ్యక్తి: మంత్రి విశ్వరూప్ సీఎం జగన్ దేశంలోనే ఎక్కడలేని అత్యుత్తమైన సోషల్ ఇంజనీరింగ్ విధానాన్ని అభ్యర్థుల విషయంలో పాటించారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేశారు ఇప్పటివరకు మాటలు చెప్పే నేతలే తప్ప సీఎం జగన్ చేసినట్టు చేతల్లో చూపించే నేతలు దేశంలో లేరు సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అమలాపురంలో నియోజకవర్గంలో ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ కామెంట్స్.. ప్రతి నియోజకవర్గంలోనూ సీఎం జగన్ను జనం అభ్యర్థిగా చూస్తున్నారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్సార్సీపీ విజయం తథ్యం 1:00 PM, March 27th 2024 చంద్రబాబు, లోకేష్కు కొడాలి నాని సవాల్.. గుడివాడలో ఐదోసారి నేను గెలవబోతున్నాను. ఎన్నికల ముందు నన్ను ఓడిచేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారు ఎంత మంది వచ్చినా వైఎస్సార్సీపీ తరపున హ్యాట్రిక్ కొడతాను. గుడివాడ టీడీపీ అడ్డా.. గాడిద గుడ్డు అని చంద్రబాబు సొల్లు చెబుతున్నాడు. నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్కు ఇదే నా సవాల్ చంద్రబాబు, లోకేష్ గుడివాడలో నాపై పోటీ చేసి గెలవాలి టీడీపీ పుట్టిన తర్వాత గుడివాడలో టీడీపీకి 50% ఓటింగ్ మూడు సార్లు మాత్రమే వచ్చింది నాపై పోటీకి భయపడి గంటకో వ్యక్తిని.. పూటకో వ్యక్తిని తెచ్చే బ్రతుకులు టీడీపీవి. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చినవాడిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు చంద్రబాబు ఎంత 420 వ్యక్తి అనేది చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసు చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడు ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీనే. గుడివాడలో గెలిచేది నేనే. మళ్లీ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది మేం ప్రజల్లోకి వెళ్లి ఇదే చెబుతున్నాం 12:45 PM, March 27th 2024 మేమంతా సిద్ధం యాత్ర.. పచ్చ మందలో టెన్షన్! మేమంతా సిద్ధం యాత్రతో ప్రజలకు మధ్యకు సీఎం జగన్. సీఎం జగన్ యాత్రలో పచ్చ మందలో టెన్షన్! జగనన్న మేమంతా సిద్ధం యాత్రతో బెంబేలెత్తిపోతున్న పచ్చమంద!#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/29WsfAYt6w — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 12:30 PM, March 27th 2024 లోకేష్ నుంచి అంతే ఆశించగలం: వైవీ సుబ్బారెడ్డి సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నీచర్ వెళ్తే దానికి రాద్దాంతం చేస్తున్నారు వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదే. అందుకే ఏ కంటైనర్ చూసినా అనుమానం వస్తుంది. దొడ్డి దారిలో మంత్రి అయిన లోకేష్కు ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేం. బీసీల అడ్డా అయిన ఉత్తరాంధ్రలో ఎంపీ అభ్యర్థులుగా ఓసీలు అయిన శ్రీ భరత్, సీఎం రమేష్లకు టికెట్లు ఇచ్చారు. వీరికి టికెట్లు ఇచ్చి కూటమి ఏం మెసేజ్ ఇచ్చిందో చెప్పాలి. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక బీసీలకే పోటీ చేసే అవకాశం కల్పించింది. ఉత్తరాంధ్రలో ఇతర ప్రాంత ఎంపీ ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ప్రచారంలో ఎండగడతాం. 12:10 PM, March 27th 2024 కూటమికి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కాడు. బోండా ఉమ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి సెంట్రల్కు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరు. గతంలో నరేంద్ర మోదీ చంద్రబాబుని పెద్ద దొంగ అన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ ముగ్గురు దొంగలే. సీఎం జగన్కు రాష్ట్రంలో జన బలం ఉంది. 11:41 AM, March 27th 2024 ప్రజాగళం.. పలమనేరు బయల్దేరిన చంద్రబాబు నేటి నుంచి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి ఎన్నికల ప్రచారం ప్రజాగళం పేరిట ప్రచారంలో పాల్గొననున్న టీడీపీ అధినేత పలమనేరు నుంచి ప్రజాగళం ప్రారంభం రోజుకి నాలుగు నియోజకవర్గాలు కవర్ చేసేలా రూట్మ్యాప్ రూపొందించిన టీడీపీ కాసేపటి కిందట కుప్పం నుంచి పలమనేరుకు బయల్దేరిన చంద్రబాబు 11:20 AM, March 27th 2024 కుప్పంలో చంద్రబాబు ఓటమి ఫిక్స్.. చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారనడం హాస్యాస్పదం. కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్. తెలుగుదశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దు అని చిచ్చూలు పెడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ నిజాలు మాట్లాడడు. గత ఐదేళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశాం. మేము అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుండి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీని చూసి చంద్రబాబు భయపడి డబ్బున్న వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తున్నారు. టీడీపీలో ఎవరైనా మాకు ఓట్లు వేయండి అని అడిగేవారు ఉన్నారా? చంద్రబాబు సమావేశాలకు కర్ణాటక, క్రిష్ణగిరి, చిత్తూరు వాళ్ళే పాల్గొన్నారు. వాలంటీర్లపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇచ్చాము. చిత్తూరు జిల్లా అన్ని విధాలా వెనుకబడింది. కోర్టును శాసించే హక్కు మాకు లేదూ. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. కుప్పంలో చంద్రబాబు అన్ని వర్గాలను అణగతొక్కారు. చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గానికి ఒక్క సీటు అయినా కేటాయించారా?. 11:00 AM, March 27th 2024 టీడీపీ, చంద్రబాబకు దేవినేని అవినాష్ కౌంటర్.. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన చేసింది సీఎం జగన్ ప్రభుత్వమే. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తిరుగుతున్న రోడ్లు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం వేసినవి కావా? కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన వ్యక్తి సీఎం జగన్. కాలువ కట్టపై ఇల్లు తీసివేస్తారని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అసత్య ప్రచారం తిప్పి కొడతాం కాపు కళ్యాణమండపం నిర్మాణంపై కట్టుబడి ఉన్నాం టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎవరో కూడా కొందరికి తెలియని పరిస్థితి నెలకొంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఎన్నికల్లో గెలవాలని గద్దె ప్రయత్నిస్తున్నారు ఏం అభివృద్ధి చేశారని తూర్పు నియోజకవర్గాన్ని కంచుకోటగా చెప్పుకుంటున్నారు తూర్పు నియోజకవర్గం టీడీపీ కంచు కోటను బద్దలకొడతాం నియోజకవర్గంలో బత్తిన రాముతో కలిసి ప్రజల ముందుకు వెళ్తాం జనసేన అధినేత పవన్ను సైతం చంద్రబాబు మోసం చేశారు జనసేన పార్టీపై చంద్రబాబు ఆదిపత్యాన్ని సహించలేకే వైసీపీకి వచ్చానని బత్తిన రాము తెలిపారు నియోజవర్గ సీనియర్ నాయకులు యలమంచిలి రవి, బత్తిన రాముతో కలిసి కుటుంబ సభ్యుల్లా నియోజకవర్గంలో పర్యటిస్తాం మంచి మెజారిటీతో సీటు గెలిచి ముఖ్యమంత్రి జగన్కు బహుమతిగా ఇస్తాం 10:30 AM, March 27th 2024 కూటమికి అభ్యర్థి కరువు.. అనపర్తిలో కూటమికి అభ్యర్థి కరువు అభ్యర్థులు దొరక్క అనపర్తి స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయలేకపోతున్న కూటమి నేతలు. బీజేపీ తరఫున అనపర్తిలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరు లేరు. దీంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూటమి నాయకులు 10:00 AM, March 27th 2024 ప్రొద్దుటూరులో టీడీపీ నేతల ఓవరాక్షన్.. ప్రొద్దుటూరులో మేము సిద్ధం సభ ఫ్లెక్సీలను చించివేసిన దుండగులు ఫ్లెక్సీలను చించిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాచమల్లు ఫ్లెక్సీల చించివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాచమల్లు. సీఎం సభకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ నాయకులు చించేశారు. సభా కార్యక్రమాలను ఆటంకం కలిగే విధంగా ప్రయత్నం చేయడం దుర్మార్గం. దీనిపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్సీపీ నాయకులను పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకూడదంటూ టీడీపీ అభ్యర్ది వరదరాజులరెడ్డి సొదరుడు రాఘవరెడ్డి బెదిరిస్తున్నాడు. దీనిపై కూడా ఎన్నికల కమిషన్ కూడా విచారణ చేయాలి. 8:45 AM, March 27th 2024 మేమంతా సిద్ధం.. సీఎం జగన్ వెంటే ప్రజలు నేటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న వెంట నడిచేందుకు ప్రజలంతా సిద్ధం. సీఎం జగన్ రాక కోసం వేచిచూస్తున్న ప్రజలు. ఎన్నికల సమరానికి తెరతీస్తూ నేడు ప్రచారాన్ని ప్రారంభిస్తున్న జగనన్న వెంట నడిచేందుకు మేమంతా సిద్ధం🔥#MemanthaSiddham #YSJaganAgain#VoteForFan pic.twitter.com/CTGG2ovhZd — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 A special illustration will be released today at 10:00 AM in tribute to our leader, @ysjagan garu, as he kickstarts the #MemanthaSiddham Yatra. Stay tuned!#YSJaganAgain pic.twitter.com/f0UmuPTXiW — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 8:00 AM, March 27th 2024 టీడీపీ, జనసేనకు షాక్ కోడూరు మండలంలో టీడీపీ, జనసేనకు షాక్ టీడీపీ, జనసేనను వీడి వైఎస్సార్సీపీలో చేరిన పది కుటుంబాలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సింహాద్రి రమేష్ బాబు కామెంట్స్.. పేదలకు ఉపయోగపడే వ్యవస్థలపై చంద్రబాబు నిత్యం విషం చిమ్ముతున్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి గ్రామ వాలంటీర్లను స్లీపర్ సెల్స్ అని చెప్పటం టీడీపీ తీరుకు నిదర్శనం గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ అవాకులు చెవాకులు పేలుతున్నారు చంద్రబాబుని, పవన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు జగనన్నకు మద్దతు పలుకుతున్నారు. పేదల కోసం చేపట్టిన పనులు అమలు చేసి సీఎం జగన్ సఫలీకృతుడయ్యారు సీఎం జగన్ మాటను ప్రజలు విశ్వసిస్తున్నారు 7:30 AM, March 27th 2024 బాబు, పవన్పై ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ఫైర్ వాలంటీర్లపై టీడీపీ నేతల వ్యాఖ్యలు దారుణం వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడంపై భరత్ సీరియస్ చంద్రబాబు, లోకేష్, పవన్ చిల్లర వ్యాఖ్యలకు వాలంటీర్లు సరైన బుద్ధి చెబుతారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై @JaiTDP నేతలు కత్తి కట్టడం దారుణం@ncbn, @naralokesh, @PawanKalyan చిల్లర వ్యాఖ్యలకు వాలంటీర్లు సరైన బుద్ధి చెబుతారు -రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్#YSJaganDevelopsAP#APVolunteers#YSJaganAgain#VoteForFan pic.twitter.com/ctYANQ5pu0 — YSR Congress Party (@YSRCParty) March 26, 2024 7:15 AM, March 27th 2024 నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర.. ఈరోజు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభం. ఎన్నికల ప్రచార భేరికి ఇడుపులపాయలో శ్రీకారం తొలి రోజు కడప పార్లమెంట్ పరిధిలో నిర్వహణ వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా కొనసాగనున్న యాత్ర ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద శిబిరానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి రాత్రికి అక్కడే శిబిరంలోనే బస చేయనున్న సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర నిత్యం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహణ రోజూ ఉదయం వివిధ వర్గాలతో మమేకం.. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడంపై సలహాలు, సూచనల స్వీకరణ సాయంత్రం పూట ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు 58 నెలల్లో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును వివరిస్తూ సభలు 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మోసాలను గుర్తు చేస్తూ ప్రసంగాలు ఇప్పుడు మళ్లీ అదే కూటమితో బాబు వస్తున్నారంటూ ప్రజలను అప్రమత్తం చేయనున్న సీఎం మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఓటుతో మరోసారి ఆశీర్వదించాలని వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి 99% హామీల అమలు, సుపరి పాలనతో జగన్ నాయకత్వంపై జనంలో పెరిగిన విశ్వసనీయత 175 శాసనసభ, 25 ఎంపీ సీట్లు లక్ష్యంగా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు సూపర్ హిట్ 7:00 AM, March 27th 2024 ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ- బీజేపీ బేరసారాలు ఆదోనిలో కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి ఆఫర్ ఇచ్చిన బీజేపీ నాయకులు సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతల ప్రతిపాదన పురందేశ్వరి ఆదీశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు (ఇతను సైతం బీజేపీ నాయకుడు)కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో . పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడే ఆడియో సాక్షాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి 6:45 AM, March 27th 2024 దిక్కుతోచని ‘కూటమి’! పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన ఒంగోలు పార్లమెంట్ స్థానం అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు.. బీసీ నేతకు బాబు హ్యాండ్ మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం వారికిస్తే మోదీ ఆగ్రహిస్తారన్న సందిగ్ధంలో టీడీపీ అధినేత ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి 6:30 AM, March 27th 2024 టీడీపీలో తిరుగుబాటు.. అవనిగడ్డ సీటు మండలి బుద్ధప్రసాద్కు ఇవ్వకపోవడంతో నిరసన పార్టీ పదవులకు 30 మంది నియోజకవర్గ టీడీపీ నేతల రాజీనామా మంగళగిరి పార్టీ కార్యాలయానికి రాజీనామా లేఖలు పెందుర్తిలో పంచకర్లకు బండారు అనుచరుల సహాయ నిరాకరణ టీడీపీ తీరుపై జనసేన నేతల ఆగ్రహం -
March 26th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 26th Latest News Telugu.. 06:40 PM, March 26th 2024 తాడేపల్లి : వైఎస్సార్సీపీలో చేరిన విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు టీడీపీ, జనసేన నేతలు పార్టీలో చేరిన వారిలో గండూరి మహేష్, నందెపు జగదీష్ (మాజీ కార్పొరేటర్లు) కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్ మెంబర్), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి) ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ 06:17 PM, March 26th 2024 తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్ సమక్షంలోవైఎస్సార్సీపీలో చేరిన రాజంపేట టీడీపీ ఇంఛార్జి గంటా నరహరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్ 06:05 PM, March 26th 2024 అమరావతి: ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీస్ మీటింగ్ అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు పత్రికల్లో ప్రజల అభిప్రాయాల్ని తప్పుదోవ పట్టించే వార్తలకు అడ్డుకట్ట వేయాలని కోరాం నిత్యం వైఎస్సార్సీపీపై బురద చల్లుతూ వార్తలు రాస్తున్న విధానంపై ఫిర్యాదు చేసాం 48 గంటల ముందు అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళేముందు అనుమతి తీసుకోవాలనే నిబంధనను సవరించాలని కోరాం పాంప్లెట్స్ పంచేందుకు అనుమతి తీసుకోవాలని నిబంధనను సవరించాలని కోరాం బ్రాండింగ్, హోర్డింగ్స్, పార్టీ ఆఫీసుల్లో ప్రచార ప్రకటనలపై నిబంధనలపై మరోసారి పునరాలోచించాలని కోరాం అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెల్లాం 05:50 PM, March 26th 2024 విజయవాడ: బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే చంద్రబాబుకు తెలుసు: రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడను అభివృద్ధి చేసి చూపించారు సీఎం జగన్మోహన్రెడ్డి జగన్మోహన్రెడ్డి పాలనలో మేం భాగస్వామ్యులైనందుకు ఆనందంగా ఉంది సీఎం జగన్.. బీసీలకు పెద్ద పీట వేశారనడానికి నేనే ఉదాహరణ ఒక బిసీ మహుళనైన నన్ను విజయవాడకు మేయర్ చేశారు విజయవాడ ఈస్ట్, వెస్ట్,సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీగా కేశినేని నానిని గెలిపించుకుంటాం చంద్రబాబు తన బినామీలను మా పై పోటీ పెడుతున్నాడు సామాన్యుడు రాజకీయాల్లోకి రాకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి నా పై వెస్ట్ లో పోటీకి దించుతున్నారు పశ్చిమనియోజకవర్గం వైఎస్సార్సీపీకి అడ్డా రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ జెండా ఎగురవేస్తాం ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి అధికప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబుకు బీసీలు తగిన బుద్ధి చెబుతారు -షేక్ ఆసిఫ్, విజయవాడ వెస్ట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి 05:40 PM, March 26th 2024 తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): టీడీపీ నేత బొజ్జల సుధీర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు వాలంటీర్లపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా నిష్పక్షపాతంగా గౌరవవేతనం తీసుకుంటూ ప్రభుత్వం తరపున సేవలందిస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులు అని బొజ్జల సుధీర్ మాట్లాడడం చాలా దారుణం. అలా మాట్లాడనికి అసలు మనిషినా, పశువునా? బొజ్జల సుధీర్ బేషరతుగా వాలంటీర్లకు, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేయాలి 05:30 PM, March 26th 2024 తాడేపల్లి : వైఎస్సార్సీపీలో చేరిన సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో వేనాటి రామచంద్రారెడ్డి(సూళ్లురుపేట), మస్తాన్ యాదవ్(వెంకటగిరి) మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, గొరకపూడి చిన్నయ్యదొర తదితరులు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ 05:25 PM, March 26th 2024 వైఎస్సార్సీపీ చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన చిన్నం రామకోటయ్య 05:20 PM, March 26th 2024 ఏపీ అసెంబ్లీ స్థానాల్లో మరోసీటు అదనంగా కోరుతున్న బీజేపీ రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఒకటి కావాలని బీజేపీ పట్టు రెండు సిట్టింగ్ స్థానాలు కావడంతో ససేమిరా అంటున్న టీడీపీ మొత్తం 11 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ 05:18 PM, March 26th 2024 టీడీపీని వీడే యోచనలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఏలూరు ఎంపీ టికెట్ యనమల కుటుంబానికి ఇవ్వడంతో మాగంటి బాబు అసంతృప్తి మాగంటి బాబు పార్టీ మారతాడని ప్రచారం 05:15 PM, March 26th 2024 పల్నాడు : పెదకూరపాడు టీడీపీ నేత కంచేటి సాయిని సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అమరావతిలో వైఎస్సార్సీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో సాయి అరెస్ట్ సత్తెనపల్లి పీఎస్ కు పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్, కార్యకర్తలు సత్తెనపల్లి కోర్టు దగ్గర పోలీస్ బందోబస్తు 05:13 PM, March 26th 2024 ఏలూరు : నారా భువనేశ్వరి పర్యటనలో ఉద్రిక్తత నారా భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది టికెట్లు రాని కొందరు గొడవ చేసే అవకాశం ఉందని అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది టీడీపీ కార్యకర్తలు, వ్యక్తిగత సిబ్బందికి మధ్య తోపులాట 05:12 PM, March 26th 2024 AP: ముగిసిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలి బీజేపీ శ్రేణులకు కేంద్రం పెద్దల దిశానిర్దేశం 05:11 PM, March 26th 2024 అమరావతి : రాజకీయ పార్టీల నేతలతో సమావేశంc కానున్న ఈసీ ఎన్నికల నియమ నిబంధనలపై పార్టీల నేతలతో చర్చించనున్న ఈసీ 04:45 PM, March 26th 2024 బుజ్జగింపు చర్యలు.. పార్టీ పదవులతో ఎర సీట్లు ఇవ్వలేని అసెంబ్లీ ఆశావహులకు పార్టీ పదవులు ఇస్తున్న టీడీపీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా రెడ్డి సుబ్రహ్మణ్యం. పార్టీ జాతీయప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్. విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులుగా గండి బాబ్జి హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకట రాముడు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్,మన్నె సుబ్బారెడ్డి,కొవ్వలి రామ్మోహన్ నాయుడు. పార్టీ కార్యదర్శులుగా ముదునూరి మురళీకృష్ణం రాజు,వాసురెడ్డి ఏసుదాసు నియామకం 03:41 PM, March 26th 2024 రఘురామ కృష్ణరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే హైదరాబాద్ లో హల్చల్ చేసిన రఘురామ మనుషులు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అభిమానులు పూజలు బీజేపీ మోసం చేసింది, టీడీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ 03:39 PM, March 26th 2024 కర్నూలు : కలకలం రేపుతున్న ఆడియో రికార్డు ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామన్న బీజేపీ నేత పురందేశ్వరికి రూ.3 కోట్లు ఇవ్వాలని బీజేపీ నేత ప్రతిపాదన పురందేశ్వరి ఆదేశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ 02:51 PM, March 26th 2024 విజయవాడ: వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం: దేవినేని అవినాష్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే పథకాలు అందిస్తున్నాం టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి పది సంవత్సరం అధికారంలో ఉండి స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు నియోజకవర్గంలో కుట్ర రాజకీయాల కు తెరలేపుతున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నా తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే జగన్ కోరిక ఎన్టీఆర్ హయంలో మద్యనిషేధం చేస్తే మరల ప్రజలను మద్యం మత్తులోకి ముంచిన వ్యక్తి చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడితనానికి ఆద్యం పడింది 02:49 PM, March 26th 2024 టీడీపీ నేత సుధీర్ రెడ్డిపై ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ఆగ్రహం వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి 02:34 PM, March 26th 2024 అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ముత్యాల నాయుడు మాడుగుల వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈర్లి అనురాధ ఈర్లి అనురాధ.. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కూతురు 01:47 PM, March 26th 2024 వలంటీర్లపై చంద్రబాబు,పవన్ పగ పెట్టారు: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గ్రామ వలంటీర్ల వలనే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి. కోవిడ్ సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి వలంటీర్లు సేవలందిచారు వలంటీర్లను టెర్రెరిస్ట్లతో పోల్చడాన్ని ఖండిస్తున్నాము గ్రామ వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పగ పెట్టారు సచివాలయ వ్యవస్థ ద్వారా సుమారు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి వలంటీర్లపై కక్ష పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు వైఎస్సార్సీపీ ఎవ్వరికి భయపడదు ఎవరికి ఎవరు భయపడుతున్నారో గమనించాలి సీఎం జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయాలని బీజేపి నిర్ణయించుకుంది స్టీల్ ఫ్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపిలో ఈ పార్టీలు ఎందుకు కలిసాయి? చంద్రబాబు ఎప్పుడైనా పిల్లలు చదువులు కోసం ఆలోచన చేసారా? రాష్ట్రంలో పేదవాడికి, పెత్తందారుడికి మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది 01:47 PM, March 26th 2024 టీడీపీ నేత బొజ్జల సుధీర్రెడ్డి వ్యాఖ్యలపై రచ్చ వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చిన టీడీపీ నేత సుధీర్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న వాలంటీర్లు, లబ్ధిదారులు సర్వత్రార వ్యతిరేకత రావడంతో టీడీపీ దిద్దుబాటు చర్యలు సుధీర్రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని అచ్చెన్నాయుడు బీరాలు 01:31 PM, March 26th 2024 ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ- బీజేపీ బేరసారాలు ఆదోనిలో కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి ఆఫర్ ఇచ్చిన బీజేపీ నాయకులు సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతల ప్రతిపాదన పురందేశ్వరి ఆదీశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు (ఇతను సైతం బీజేపీ నాయకుడు)కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో . పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడే ఆడియో సాక్షాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి 01:26 PM, March 26th 2024 నాకే టికెట్ ఎగ్గొట్టిన బాబు పోలవరం కడతానంటే నమ్ముతారా?: రఘురామ చంద్రబాబుకు రఘురామ టికెట్ డిమాండ్ బీజేపీ అధిష్టానం ఉద్దేశ్యాలు తేడాగా ఉన్నాయి ఏపీ బీజేపీని నడిపిస్తుంది ఎవరో నాకు తెలుసు కేంద్ర బీజేపీని నడిపిస్తున్నది కూడా వారేనా? బీజేపీ మోసం చేస్తే నాకు టికెట్ ఇవ్వరా? నరసాపురంలోనే తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇవ్వాలి చంద్రబాబు ఆడిన మాట తప్పి నాకు టికెట్ ఎగ్గొడితే ఎలా? నాకు సీటు ఇవ్వలేని వాడు (చంద్రబాబు) రేపు పోలవరం కడతానంటే ఎలా నమ్ముతారు? : రాష్ట్రానికి చంద్రబాబు ఏదో చేస్తానంటే ఎలా నమ్ముతారు? : రఘురామకృష్ణరాజు 01:16 PM, March 26th 2024 విజయవాడ: బీజేపీ పదాదికారుల సమావేశానికి సీనియర్లు దూరం సమావేశానికి హాజరుకాని సీనియర్లు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ తదితరులు పదాదికారుల సమావేశానికి సీనియర్లు గైర్హాజరుపై బీజేపీలో చర్చ ఎంపీ టిక్కెట్లు రాకపోవడంపై సీనియర్ల అలక 12:28 PM, March 26th 2024 కృష్ణాజిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న టీడీపీ శ్రేణులు మండలి బుద్ధప్రసాద్కు టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయం రోజుకొక మండలం నుంచి రాజీనామాలు చేస్తూ నిరసన తెలపాలని నిర్ణయం టీడీపీ క్రియాశీలక సభ్యత్వాలకు,పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేసిన అవనిగడ్డ మండలం టీడీపీ శ్రేణులు జనసేనకు ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించకూడదని తీర్మానం 12:25 PM, March 26th 2024 ఉద్యోగులపై ప్రతిపక్షాల అభాండాలు: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం ప్రభుత్వ చట్టాలను నిర్వర్తించడమే ఉద్యోగస్తుల బాధ్యత రాష్ట్రాన్ని బాగు చేసేందుకే వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు జాతీయ స్థాయిలో మంచిపేరు వచ్చింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే వలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం కరోనా సమయంలో సుధీర్రెడ్డి హైదరాబాద్లో దాకున్నాడు కరోనా సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారు లోకేష్ పోలీసులను బెదిరిస్తున్నారు పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి.. ఉద్యోగులే పర్మినెంట్ ఎన్నో పార్టీలను చూశాంజజ కానీ టీడీపీ మాదిరిగా ఎవరూ ఉద్యోగులను బెదిరించలేదు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు ఎవరూ భయపడరు ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది కోవిడ్ వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలే రెండు డీఏ ఇచ్చారు ఉద్యోగులు ఏది అడిగినా చేయాలనే తాపత్రయం సీఎం జగన్ది ఆర్థిక సమస్యలతోనే కొన్ని చేయలేకపోతున్నారు దశలవారీగా ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తున్నాం ఉద్యోగస్తులంతా పోస్టల్ బ్యాలెట్ను తప్పకుండా ఉపయోగించుకోవాలి వెల్ఫేర్ స్కీమ్స్లో దేశానికే ఆదర్శంగా ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగస్తులంతా అండగా ఉండాలి 12:19 PM, March 26th 2024 తిరుపతి టీడీపీ పార్టీ నేతలు రహస్య సమావేశం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం పై చర్చ ఏకమైన తిరుపతి టీడీపీ ముఖ్య నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చ తిరుపతి టీడీపీ నేత జే.బి.శ్రీనివాసులు ఇంట్లో సమావేశమైన నేతలు అధినేత చంద్రబాబు నాయుడు తో మరోసారి తిరుపతి సీటుపై పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేయనున్న నేతలు కుప్పం రావాలని మాజీ సుగుణమ్మ కు పిలుపు ఇచ్చిన చంద్రబాబు, చంద్రబాబు మాటను ఖాతరు చేయని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 12:01 PM, March 26th 2024 వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దారుణం: మార్గాని భరత్ జగనన్న పేదలకు సహాయం చేస్తున్నాడని కారణంతోనే జీతం లేకపోయినా వాలంటీర్లు పనిచేశారు అభం శుభం తెలియని వాలంటీర్లపై కత్తి కట్టడం దారుణం తెలుగుదేశం పార్టీ జిహాది పార్టీ ఎన్డీయే పొత్తు తాత్కాలికమే అని చంద్రబాబు కార్యకర్తల సమావేశంలోనే చెప్పాడు.. తాత్కాలికమంటే అర్థం ఏమిటి? నరేంద్ర మోదీ వస్తే ముస్లింలు ఓట్లు తీసేస్తాడని చెప్పిన వ్యక్తి చంద్రబాబ నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే సెక్యులరిజం ఉండదని క్రైస్తవులకు చెప్పిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అంటే ముస్లింలు, క్రైస్తవుల ఓట్లు వద్దని నేరుగా చెబుతున్నాడు ఓటమిని అంగీకరించలేని పనికిమాలిన వ్యక్తులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అమలవుతుండగా తప్పుడు కరపత్రాలు నాపై ఎలా పంచుతున్నారు.. దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసులదే మోరంపూడి ఫ్లైఓవర్ పనులకు నా స్థలాన్ని ఉచితంగా ఇచ్చాను నాపై తప్పుడు ప్రచారం చేసిన ఆదిరెడ్డి వాసు పై 10 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తున్నాను నేను అభివృద్ధి చేసిన ప్రతి ప్రాంతంలో నాపై తప్పుడు కరపత్రాలు పంచుతున్నారు ఆదిరెడ్డి వాసు.. పిరికిపందలా వ్యవహరించుకు. దమ్ముంటే నేరుగా నన్ను ఎదుర్కో.. ఐదేళ్లు నీ భార్య ఎమ్మెల్యేగా ఉంది.. రాజమండ్రికి మీరు ఏం చేశారు? ప్రజలను నమ్మించి మోసం చేసిన వారిని పొలిటికల్ తీవ్స్ అంటారు 2014 నుంచి 19 వరకు ఓట్లు వేయించుకుని ఆదిరెడ్డి భవాని రాజమండ్రి ప్రజలను నమ్మించి, మోసం చేశారు 11:24 AM, March 26th 2024 ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపీ కూటమి అభ్యర్థులు ఎంపికపై విమర్శలు చీటింగ్, ఫోర్జరీ, భూ కబ్జాలు చేసిన వారికి ఏ విధంగా సీట్లు ఇస్తారని ప్రశ్నిస్తున్న బీజేపీ, టీడీపీ నేతలు 40 ఎకరాల భూకబ్జాకు పాల్పడిన గీతం యూనివర్సిటీ సీఎం రమేష్పై 450 కోట్ల రూపాయల చీటింగ్ కేసు బ్యాంకులకు 47 కోట్లు రుణాలు ఎగవేసిన కొత్తపల్లి గీత బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కొత్తపల్లి గీతకు జైలు శిక్ష బీజేపీ పార్టీలో అవినీతిపరులు తప్పితే మంచివారికి చోటు లేదని ప్రశ్నిస్తున్న నేతలు 11:19 AM, March 26th 2024 అనపర్తి టీడీపీలో కలకలం అనపర్తి అభ్యర్థిగా గతంలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించిన చంద్రబాబు అనపర్తి స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి ఖరారు అవుతుందంటూ జోరుగా జరుగుతున్న ప్రచారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అనపర్తి టీడీపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిలిపివేసిన టీడీపీ క్యాడర్ మూకుమ్మడిగా దిగువ స్థాయి కేడర్ అంతా రాజీనామాలు చేసి జోన్ -2 ఇన్చార్జ్ సుజయ్ కృష్ణ రంగారావుకు అందజేత 11:17 AM, March 26th 2024 టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు.. మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కానీ టీడీపీ వలంటీలను ఉగ్రవాదులతో పోల్చడం దారుణం వలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణంగా మాట్లాడారు గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారు టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడడం సిగ్గుచేటు టీడీపీపై ఇక ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను ఏ ఒక్కరు వదులుకోరు కేవలం తమ స్వార్థం కోసం వాలంటీర్లపై టీడీపీ నిందలు వేస్తోంది 11:03 AM, March 26th 2024 అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై ఏపీ బీజేపీ కసరత్తు ఏపీలో 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ ఇప్పటికే 6 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన ఇవాళ ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం 10:05 AM, March 26th 2024 వలంటీర్లు ఉగ్రవాదులు కాదు.. సేవా సైనికులు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వలంటీర్లను చూసి చంద్రబాబు, టీడీపీ నేతలకు వెన్నులో వణుకు వలంటీర్లలో 70 శాతంకు పైగా మహిళలే ఉన్నారు వారంతా ఉగ్రవాదులా..? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వలంటీర్లతోనే సాధ్యమైంది వలంటీర్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నారు.. వారంటే చంద్రబాబుకు చులకన అందుకే టీడీపీ నేతలు వారిని ఉగ్రవాదులతో పోల్చుతున్నారు. సుధీర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి.. 09:26 AM, March 26th 2024 మాజీ మంత్రి బండారు ఇంటి వద్ద ఉద్రిక్తత పెందుర్తిలో కొనసాగుతున్న నిరసనలు పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని డిమాండ్ టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు బండారు తీవ్ర అస్వస్థతకు గురికావడానికి తండ్రీకొడుకులే కారణమంటూ మండిపాటు బండారుకు సీటు ఇవ్వకపోతే జనసేన అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరిక 09:22 AM, March 26th 2024 విశాఖ సౌత్ సీటుపై పవన్ కల్యాణ్ యూ టర్న్..? వంశీకే సీటు అంటూ హామీ ఇచ్చిన పవన్ ఇంటింటా ప్రచారం మొదలు పెట్టిన వంశీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించిన వంశీ చివరి నిమిషంలో జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు.. ఆందోళనలో వంశీ వర్గీయులు.. వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ధర్నాలు నిరసనలు వంశీ పై వ్యతిరేకతతోనే సౌత్ సీటు పెండింగ్ లో పెట్టారనే చర్చ మరో వైపు విశాఖ సౌత్ లేదా భీమిలి ఆశిస్తున్న బీజేపీ నేత మాధవ్ జరుగుతున్న పరిణామాలతో అయోమయంలో జనసేన క్యాడర్ 09:13 AM, March 26th 2024 టీడీపీ నేత సుధీర్ రెడ్డి మనీషా .. పశువా ?: వెల్లంపల్లి శ్రీనివాస్ వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు వలంటీర్లు సమాజ సేవ చేస్తున్నారు గౌరవ వేతనం తీసుకుని చుట్టుపక్కల వారికి సాయం అందిస్తున్నారు వలంటీర్లు ప్రజల కుటుంబ సభ్యులు లాంటివారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి పార్టీ నేతలు వాలంటీర్లు గురించి మాట్లాడితే సహించేది లేదు చంద్రబాబు మాటమీద నిలబడడు వలంటీర్లు గోనె సంచులు మోసే ఉద్యోగం అంటూ గతంలో హేళన చేసారు ఇటీవల వలంటీర్లు కొనసాగిస్తాం అంటున్నారు టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్లను దూషిస్తున్నారు ఇంకోసారి వాలంటీర్ల గురించి మాట్లాడితే సహించేది లేదు 08:56 AM, March 26th 2024 పెండింగ్ స్థానాలపై పవన్ కసరత్తు ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానాన్ని ప్రకటించిన జనసేన 3 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంపై తేలని పంచాయతీ 08:36 AM, March 26th 2024 కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటన కుప్పం నియోజకవర్గం ప్రజల్ని ఆకట్టుకోని చంద్రబాబు బహిరంగసభ చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా తిరుగు ప్రయాణమైన టీడీపీ కార్యకర్తలు టీడీపీకి ఓటు వేయకపోతే మగవాళ్ళను ఇంట్లోకి రానివ్వదంటూ మహిళల్ని రెచ్చగొడుతున్న చంద్రబాబు కుప్పంలో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లో ఇంటి ఇంటికి ప్రచారం చేసినా పట్టించుకోని కుప్పం ప్రజలు కుప్పంలో 33 వేల దొంగ ఓట్లు తొలగింపుతో చంద్రబాబు వెన్నులో వణుకు 08:31 AM, March 26th 2024 జనసేనలో తేలని టికెట్ల పంచాయితీ జనసేనలో తేలని అవనిగడ్డ ఎమ్మెల్యే, మచిలీపట్నం టిక్కెట్ల పంచాయితీ మచిలీపట్నం ఎంపీ టిక్కెట్పై ఆశలు పెట్టుకున్న వల్లభనేని బాలశౌరి ఇటీవల జనసేనలో చేరిన బాలశౌరి నిన్నటి వరకూ తనకే టిక్కెట్ అనే ధీమాలో ఉన్న బాలశౌరి తాజాగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధిగా తెరపైకి కొత్తపేరు మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధి కోసం పరిశీలనలో బాలశౌరితో పాటు బండారు నరసింహారావు పేరు బండారు పేరు పరిశీలనతో ఎంపీ టిక్కెట్ పై ఆందోళనలో బాలశౌరి అవనిగడ్డలో ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్న పవన్ బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ పేర్లతో సర్వేలు చేయిస్తున్న పవన్ ఐవీఆర్ఎస్ సర్వేలతో అయోమయంలో జనసేన క్యాడర్ 08:26 AM, March 26th 2024 సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్ ధర్మవరం టికెట్ కోసం వర్గపోరు మధ్యేమార్గంగా రేసులోకి మరోపేరు ధర్మవరం అసెంబ్లీ సీటుపై వీడని పీటముడి రేసులోకి సత్యకుమార్! ధర్మవరం టికెట్ కోసం పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి పట్టు ఇద్దరినీ పక్కనబెట్టి.. బీజేపీ తరఫున సత్యకుమార్ను బరిలోకి దించేందుకు సన్నాహాలు సూరి, శ్రీరామ్లలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం కూడా పోటీకి దిగడం, గొడవలు చేయడం, అల్లర్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ టికెట్ నిరాకరిస్తున్నట్లు సమాచారం 08:13 AM, March 26th 2024 మోదీతో జగన్ ది ప్రభుత్వ సంబంధమే: సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రం, రాష్ట్రం అన్నట్టుగానే బీజేపీతో అనుబంధం బీజేపీ నుంచి మాకెప్పుడో ఆఫర్ ఉంది ఎన్డీఏతో వెళ్లాలనుకుంటే ఎప్పుడో వెళ్లేవాళ్లం ఎవరితో పొత్తు వద్దని నిర్ణయించుకున్నాం నలుగురితో కలిసి పోటీచేస్తే తర్వాత తేడాలొస్తాయ్ చంద్రబాబులా పొత్తునుంచి బయటికొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడలేం గెలుపుపై వందశాతం ధీమాతో ఉన్నాం 87శాతం మందికి సంక్షేమం అందించాం ప్రతీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఓట్లు మాకే ప్రజలపై మాకు ఆ నమ్మకం ఉంది ఎంతమంది కలిసొచ్చినా వాళ్లకొచ్చే ఓట్లు 50 శాతం లోపే పవన్ పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్షా లేదు పర్సనల్గా పవన్ను చూస్తే జాలేస్తోంది అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా? రాజకీయాలపై పవన్కు ఒక క్లారిటీ లేదు రాజకీయ లక్ష్యాలే తప్ప.. వైఎస్ కుటుంబంలో గొడవలేం లేవు షర్మిల పట్ల అన్నగా జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు రాజకీయంగా షర్మిలే తప్పటడుగులు వేశారు ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదు 07:52 AM, March 26th 2024 30 నుంచి పవన్ ఎన్నికల ప్రచారం పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ ప్రారంభం మూడు విడతలుగా ప్రచారం రండి.. రండి.. ఇక్కడకే దయచేయండి పిఠాపురంలో నా కోసం ప్రచారం చేయండి టికెట్లు ఇవ్వని వారికి పవన్ నుంచి పిలుపు 07:21 AM, March 26th 2024 ‘శవా’లెత్తిపోతున్న టీడీపీ వ్యక్తిగత హత్యలకు రాజకీయ రంగు ఎన్నికల వేళ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాద్ధాంతం నల్లమాడ మండలంలో అమర్నాథ్రెడ్డి అనే వ్యక్తి హత్య టీడీపీలో ఏనాడూ కనిపించకపోయినా కార్యకర్తగా ప్రచారం చంద్రబాబు సహా టీడీపీ పెద్దలంతా ఓవరాక్షన్ 07:15 AM, March 26th 2024 ‘దేశం’లో కమలం కల్లోలం ఇప్పటికే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన టీడీపీ తాజాగా ఈ సీటు బీజేపీకని ప్రచారం.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు సీటు మారిస్తే ఊరుకోబోమని అధిష్టానానికి హెచ్చరిక పలువురు టీడీపీ నేతల రాజీనామా రాజీనామా పత్రాలు జోన్–2 ఇన్చార్జి సుజయ్ కృష్ణకు అందజేత అనపర్తి నుంచి పోటీకి ససేమిరా అంటున్న సోము వీర్రాజు 07:02 AM, March 26th 2024 ఇటు పేదల సైన్యం.. అటు పెత్తందార్ల పటాలం రిజర్వుడు స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40 శాతం సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్ రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ, 11 ఎంపీ సీట్లు అసెంబ్లీ, ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో.. 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే సేవే పరమావధిగా.. నిజాయితీ కొలమానంగా విద్యావంతులు, సామాన్యులకు పట్టం ఉపాధి కూలీ లక్కప్ప, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, కార్మికుడు ఖలీల్ అహ్మద్, రైతు బిడ్డ తిరుపతిరావుకు అవకాశం రాజకీయ సాధికారతతో సీఎం జగన్ బలంగా అడుగులు.. దేశ చరిత్రలో ఇదో రికార్డు 156 శాసనసభ, 20 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 33 శాసనసభ, 4 లోక్సభ స్థానాల్లోనే బీసీలకు చాన్స్.. బడుగులకు ఇచ్చింది 23 శాతమే ఓసీలకు కేటాయించిన 75 స్థానాల్లో 30 చోట్ల సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు చాన్స్ కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరితులకే బాబు టికెట్లు.. బడుగులకు మరోసారి వెన్నుపోటు 06:50 AM, March 26th 2024 రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’.. ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు, నివాళులు అర్పించి యాత్ర ప్రారంభం వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరులో సభ 27న రాత్రి ఆళ్లగడ్డలో బస.. 28న నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర బస్సు యాత్రలో రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనల స్వీకరణ సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు హాజరు పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు... మరోసారి చారిత్రక విజయం సాధించడమే లక్ష్యంగా "మేమంతా సిద్ధం" పేరుతో ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి భారీ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్న సీఎం @ysjagan. #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/JR8BXV6rqe — YSR Congress Party (@YSRCParty) March 25, 2024 06:47 AM, March 26th 2024 ఆరు అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం పెండింగ్లో పెట్టిన స్థానాలపై గందరగోళం పొత్తులో టీడీపీ సీట్లు 144.. ఖరారు చేసినవి 138 మాత్రమే పి.గన్నవరం జనసేనకు బదిలీ.. అనపర్తిపై తేల్చని బీజేపీ టీడీపీ సీట్లలో మిగతా ఆరు ఏవన్న దానిపై అనిశ్చితి బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలు ఏమిటో ఇప్పటికీ తేలలేదు గుంతకల్లు, ఆదోని, ఆలూరు సీట్లతో బంతాట రాజంపేట, జమ్మలమడుగులో ఏదన్నదీ తేలని వైనం దర్శి, అనంతపురం అర్బన్లో అభ్యర్థుల కోసం పాట్లు 4 ఎంపీ అభ్యర్థుల ఖరారులోనూ జాప్యమే 06:43 AM, March 26th 2024 వెన్నుపోటు పొడుస్తారా? టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం తడిగుడ్డతో గొంతులు కోసేవాడు అంటూ ప్రధానిపైనే టీడీపీ పోస్టులు మా పార్టీ సభ్యత్వం లేని రఘురామకు ఎందుకు సీటివ్వాలంటున్న బీజేపీ నేతలు 17 ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబే ఇచ్చి ఉండొచ్చుగా అంటూ మండిపాటు చివరికి కాంగ్రెస్తో కలిసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి మరోవైపు.. టీడీపీ అనుకూల పత్రికల్లోనూ మోదీపై విష ప్రచారం టీడీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోని రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ నేతల ఆగ్రహం -
‘పవన్ కూడా వెన్నుపోటు.. మరీ ఇంత దుర్మార్గమా?’
సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో వెన్నుపోటుకు పర్యాయపదంగా చంద్రబాబు పేరు కనిపిస్తుంది. ఎన్నికల వేళ.. బహుశా చంద్రబాబు దారిలోనే పయనించాలని పవన్ నిర్ణయించుకున్నాడేమో. అందుకే జనసేన తరఫున డబ్బున్న, అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చి ఆ మార్క్ను ప్రదర్శించుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వాళ్లను సైతం పక్కనపడేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు జనసేన పోటీ చేస్తోంది. అందులో ఇప్పటిదాకా 18 మంది అభ్యర్థుల్ని పవన్ ప్రకటించారు. ఇందులో కేవలం రెండే స్థానాలను(అనకాపల్లి, నరసాపురం) బీసీలకు కేటాయించారాయన. అందులో.. శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబా, చేనేత కులాలల ప్రస్తావన లేదు. ఇక ఓసీలకు ఏకంగా 12 సీట్లు ఇచ్చుకున్నారు. మైనారిటీలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు(నో టికెట్). జనసేనలో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చి.. వీర మహిళలెవరూ పోటీకి పనికి రారనే సంకేతాలు పంపించినట్లు ఉంది. ఇక.. భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్ల విషయంలో ఆయన అనుసరించిన తీరును జనసేన నేతలే మరీ దుర్మార్గమని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఆ స్థానాల్లో పక్క పార్టీ నేతలకు పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు పవన్ కల్యాణ్ . మొత్తంగా.. ధనసేన చేతిలో జనసేన నేతలుగా దగా పడ్డామనే మాట వినిపిస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్లు, గత ఎన్నికల్లో దారుణ ఓటమిపాలైనా కూడా పక్కపార్టీల వైపు చూడకుండా పవన్ వెన్నంటే ఉన్నవాళ్లు, పవన్ మీద నమ్మకంతో పార్టీలో చేరిన కొందరు ఉన్నారు. ఆ లిస్ట్లో బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ , రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ లాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. అలాంటి నమ్మకస్తులకు సైతం పవన్ హ్యాండ్ ఇవ్వడాన్ని ఆ నేతల అనుచరులు ఏమాత్రం భరించలేకపోతున్నారు. -
March 25th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 25th Latest News Telugu.. 9:10PM, March 25th 2024 పశ్చిమ గోదావరి జిల్లా: ఉండిలో ఇప్పటివరకు ఒక లెక్క సీఎం జగన్మోహన్రెడ్డి వచ్చినాక మరో లెక్క: పీవీఎల్ నరసింహ రాజు, ఉండి వైఎస్సార్సీపీ అభ్యర్థి పేదలకు సంక్షేమాన్ని చేర్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్ పేదలందరూ సీఎం జగన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆక్వా రైతుల్ని జగన్మోహన్రెడ్డి ఆదుకున్నట్టు ఏ ముఖ్యమంత్రి ఆదుకోలేదు జోన్ పరిధిని 10 ఎకరాల లోపు రైతులకు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకున్నారు శ్రీ కాళహస్తి టిడిపి అభ్యర్థి వాలంటీర్నీ స్లీపర్ సెల్స్ టెర్రరిస్టులు అనడాన్ని ఖండిస్తున్నాం ఇవాళ ఏ పేద గడపని అడిగిన వాలంటీర్ల వల్లే సంక్షేమం వస్తుందని చెబుతున్నారు సీఎం జగన్ గొప్ప ఆశయంతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు నూటికి 90 శాతం అర్హులైన వారికికి పథకాలు అందుతున్నాయంటే అది వాలంటీర్ల వల్లేసాధ్యం పేదవారికి ఏ పథకం ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియదు ఏ పథకానికి అర్హత ఉందో తెలుసుకుని సచివాలయాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారు వాలంటీర్లు ప్రపంచమంతా వాలంటరీ వ్యవస్థను అభినందిస్తుంతే ప్రతిపక్షాల బురద చల్లాలని చూస్తున్నారు వాలంటీర్లను తమ కుటుంబంలో సభ్యులుగా ప్రజలు చూసుకుంటున్నారు ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఈసారి ఎగరడం ఖాయం. నర్సాపురం పార్లమెంట్లో బీసీ మహిళను ఎంపీ గా నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ చంద్రబాబుటీడీపీ బీసీల పార్టీ అని వారిని మోసం చేశాడు బీసీ, ఎస్టీ, ఎస్టీ వెనకబడిన వర్గాలన్ని సీఎం జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఏ ఆశయంతో వచ్చాడో ఆ ఆశయాలనే పక్కనపెట్టి చంద్రబాబుకు పెంపుడు కుక్కలాగా మారాడు చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటున్నాడు.. నుంచో మంటే నుంచుంటున్నాడు పవన్ కళ్యాణ్ అయోమయ స్థితిలో ఉన్నాడు 7: 05PM, March 25th 2024 విశాఖ: వాలంటీర్లను టెర్రరిస్ట్ లన్న బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: అవంతి శ్రీనివాస్ వాలంటీర్ల సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వాలంటీర్లపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు వాలంటీర్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను కించిపరిచే విధంగా మాట్లాడారు టీడీపీ నేతలు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి 6: 20PM, March 25th 2024 ఏపీకి పురంధేశ్వరి నమ్మకద్రోహం చేశారు : సుంకర పద్మశ్రీ పురంధేశ్వరిని తూ.గో జిల్లాలో ప్రజలు తిరగనివ్వొద్దు పురంధేశ్వరికి రాజకీయ భిక్షపెట్టింది కాంగ్రెస్సే సోనియా పురంధేశ్వరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఆస్తులు కాపాడుకోవడానికి పురంధేశ్వరి కన్నతల్లిలాంటి కాంగ్రెస్ను మోసం చేశారు ప్రత్యేక హోదా, విభజన హామీలపై హామీ ఇచ్చాకే పురంధేశ్వరి మాట్లాడాలి 6:18 PM, March 25th 2024 గుంటూరు మంద కృష్ణ ఏపీలో మాదిగలను చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మేశాడు నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఎన్నికలొచ్చిన ప్రతీసారి చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకోవడం మంద కృష్ణకు అలవాటు ఈ నెల 30న మంద కృష్ణ నిర్వహించే సభను అడ్డుకుంటాం ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగల వాటా కోసం మంద కృష్ణ ఎప్పుడూ పోరాటం చేయలేదు 6:15 PM, March 25th 2024 విజయవాడ పురంధేశ్వరి అధ్యక్షతన రేపు బీజేపీ పదాధికారుల సమావేశం హాజరు కానున్న బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి, నాయకులకు బాధ్యతలు అప్పగించే యోచనలో ఏపీ బీజేపీ 6:12 PM, March 25th 2024 జనసేనలో తెగని విజయవాడ వెస్ట్ పంచాయితీ టికెట్ తనకే కేటాయించాలంటూ పోతిన మహేష్ దీక్ష దీక్ష ముగిసినా టికెట్ పై ఇంకా రాని క్లారిటీ నాకు సీటు ఇవ్వకపోతే కూటమికే నష్టం 2019 ఎన్నికల తర్వాత చాలా మంది పార్టీని వదిలేశారు నేను పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్నా - ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా 6:10 PM, March 25th 2024 బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అనే పదానికి అసలైన నిర్వచనం వైఎస్ జగన్ : వంగా గీత నా మీద నమ్మకంతోనే పిఠాపురం సీటు ఇచ్చారుజనం మనసులో జగన్, మా పిఠాపురం ప్రజల మనసులో నేనున్నాను పిఠాపురంలో మా విజయం తధ్యం నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ నేను వారి కుటుంబ సభ్యురాలినే కులాలకతీతంగా సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం మాది నాకు మళ్లీ పిఠాపురంలో సేవ చేసే అవకాశం వైఎస్ జగన్ కల్పించారు స్థానిక నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశాం స్కూల్స్, హాస్పిటల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేశాం ఎవరెన్ని కుట్రలు చేసినా పిఠాపురం పీఠం నాదే - కోర్టులు, పోలీస్ స్టేషన్లకు పర్మినెంట్ బిల్డింగ్స్ నిర్మించాం వైఎస్ జగన్ అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేస్తున్నారు 6:08 PM, March 25th 2024 బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని కలిసిన మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్న పురంధేశ్వరి ఎన్డీఏ అభ్యర్ధుల గెలుపు కోసం పని చేస్తామన్న మంద కృష్ణ మాదిగ 6:05 PM, March 25th 2024 కాకినాడ: జనసేనలో మహిళలకు గౌరవం లేదు జనసేన మాజీ రాష్ట్ర కార్యకదర్శి పోలసపల్లి సరోజ జనసేనలో చాలా అవమానాలు ఎదుర్కోన్నాను. పవన్ చెప్పే సిద్దాంతాలు..ఆశయాలు పేపర్ మీదకే పరిమితం పవన్ చుట్టూ ఒక కాపు కోటరీ ఉంది. ఆ కోటరీ పవన్ కలవనివ్వరూ జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ టీడీపీ కోవర్ట్ జనసేన కాపుల పార్టీయే కాదు..కమ్మవారి పార్టీ కూడా జనసేనలొ బిసి నాయకులకు విలువ లేదు. జనసేన 21 సీట్లలో మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చారు అందుకే జనసేన పార్టీకి గుడ్ బై చెప్పాను. 5:08 PM, March 25th 2024 అనకాపల్లి జిల్లా: టీడీపీలో మంటలు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని నిరసన టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు 5:01 PM, March 25th 2024 శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో టీడీపీ నేతల దౌర్జన్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చిలమత్తూరు లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవాల సందర్భంగా గొడవ 4:33 PM, March 25th 2024 YSRCP: మార్చి 27 బస్సుయాత్ర షెడ్యూల్ బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి కడపకు సీఎం జగన్ 12:20కి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 1 నుండి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న జగన్ 1:30కి బస్సుయాత్ర ప్రారంభం వేంపల్లి, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోనున్న బస్సుయాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొననున్న వైఎస్ జగన్ అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకోనున్న వైఎస్ జగన్ ఆ రాత్రి ఆళ్లగడ్డలోనే బస చేయనున్న వైఎస్సార్సీపీ అధినేత 3:57 PM, March 25th 2024 శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే కలమట ఫైర్ కొత్తూరు మండలం నివగాంలో అనుచరులతో సమావేశం జిల్లా టీడీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటరమణ పాతపట్నం విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలి సానుకూల నిర్ణయం రాకపోతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటా ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాను వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చి నాకు తీరని అన్యాయం చేశారు నాపై తప్పుడు నివేదికలు అధిష్టానానికి పంపించి జిల్లా నేతలు టికెట్ దక్కకుండా చేశారు: కలమట నాకు టికెట్ రాకపోవడంతో ఆవేదన చెందుతూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు: ఎంపీ జీవీఎల్ నిస్వార్ధంతో నేను చేసిన సేవ ఎప్పటికీ వృథాగా పోదు భవిష్యత్ లో బీజేపీ జెండా రెపరెపలాడిస్తా : ఎంపీ జీవీఎల్ అమరావతి రేపు బీజేపీ పదాధికారుల సమావేశం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ మిత్రపక్షాలతో సమన్వయంపై సమావేశంలో చర్చ నేతలు, కేడర్ కు దిశానిర్దేశం చేయనున్న బీజేపీ అధినాయకత్వం కడప: బద్వేల్ బీజేపీలో అసంతృప్తి సెగలు టికెట్ తనకే ఇవ్వాలని పనతల సురేష్ పట్టు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రోషన్నకు టికెట్ ఇవ్వొద్దంటూ సురేష్ పోస్ట్ కృష్ణా : అవనిగడ్డలో పీక్స్ కు టీడీపీ, జనసేన పొత్తు పంచాయితీ టికెట్ జనసేనకు ఇవ్వడంతో మండలి బుద్ధ ప్రసాద్ వర్గం తీవ్ర అభ్యంతరం సాయంత్రంలోపు మండలి బుద్ధ ప్రసాద్ ను అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ సానుకూల ప్రకటన రాకుంటే రాజీనామాకు సిద్ధమంటున్న బుద్ధ ప్రసాద్ వర్గం మండలి బుద్ధ ప్రసాద్ ఇంటి వద్ద సమావేశమైన టీడీపీ నేతలు 3:48 PM, March 25th 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు బాటలోనే పవన్ సర్వేల పేరుతో ఆశావాహులను, క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్ అవనిగడ్డ జనసేన అభ్యర్ధి కోసం ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ, వికుర్తి శ్రీనివాస్ పేరుతో సార్వే ఒకేసారి ముగ్గురు పేర్లతో సర్వే నిర్వహిచడంతో అయోమయంలో జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ సర్వేలతో రగిలిపోతున్న అవనిగడ్డ టీడీపీ కార్యకర్తలు 3:18 PM, March 25th 2024 ఏపీ బీజేపీ లిస్టు రెడీ.! రెండు రోజుల్లో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును ప్రచారంపై ఫోకస్ పెట్టిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వచ్చే నెల 5 నుంచి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం రాజమండ్రి నుంచి బీజేపీ ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి 3:05 PM, March 25th 2024 చిత్తూరు జిల్లా: టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానీయండి అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద మహిళలతో ముఖముఖీ సమావేశమైన చంద్రబాబు టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానీయండి.. అన్నం పెట్టొద్దు అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు 2:43 PM, March 25th 2024 పిఠాపురంపై పవన్లో పెరుగుతున్న ఆందోళన సీన్ సితార అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు టీడీపీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో పడవంటున్న జనసేన కార్యకర్తలు కాపులు కూడా ఓట్లేయడం కష్టమంటున్న పార్టీ నేతలు పిఠాపురంలో గెలవాలంటే ఏం చేయాలి? పవన్కళ్యాణ్ సమాలోచనలు నిన్న మంగళగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో పవన్ సమావేశం ఈసారికి హెల్ప్ చేయండి, ఎలాగొలా గెలుస్తానంటూ వర్మకు బుజ్జగింపులు పవన్ సూచన మేరకు ఇవాళ వర్మతో కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్ధి ఉదయ శ్రీనివాస్ భేటీ పరిస్థితి ఇలాగే ఉంటే కాకినాడ ఎంపీకి పోటీ చేయడం మంచిదని సన్నిహితుల సూచనలు 2:35 PM, March 25th 2024 టీడీపీకి షాక్ ఇస్తున్న అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు రాజంపేట పార్లమెంట్ పరిధిలో మూకూమ్మడిగా ప్రచారం ఆపేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్లమెంట్ సీటు బీజేపీకి ఇవ్వడంతో ఆయా ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తీవ్రంగా పడే అవకాశం ఉండటంతో ప్రచారం ఆపేసిన అసెంబ్లీ అభ్యర్థులు రాష్ట్రంలోనే... రాజంపేట పార్లమెంట్ వ్యాప్తంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండటం, బలిజలు 2.50 లక్షల ఓటింగ్ ఉండటంతో ఆందోళనలో ఎమ్మెల్యే అభ్యర్థులు. ముస్లిమ్స్ ప్రభావంతో పీలేరు, రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లి పల్లెలో తీవ్ర ప్రభావం.. బలిజల ప్రభావంతో రాజంపేట, రైల్వే కోడూరు కోల్పోయే అవకాశం. 2:25 PM, March 25th 2024 సోషల్ మీడియా శాడిజనికి గీతాంజలి బలి: కోన వెంకట్ ఒక పవిత్ర ఆత్మను చంపేశారు సోషల్ మీడియా శాడిజానికి నేను కూడా విక్టింనే చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది వీలైతే కొత్త చట్టాలను తేవాలి ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారు జనాన్ని భయపెడుతున్నారు ప్రముఖ సినిమా రచయిత, ప్రొడ్యూసర్, దర్శకుడు కోన వెంకట్ తెనాలిలో గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్ 2:21 PM, March 25th 2024 అవనిగడ్డలో తిరుగుబావుటా ఎగరేసిన టీడీపీ నేతలు పొత్తుల్లో జనసేనకు అవనిగడ్డ సీటు కేటాయించడం పై తీవ్ర అసంతృప్తి అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ మండలి బుద్ధప్రసాద్ ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ క్యాడర్ బుద్ధప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వకపోతే జనసేనకు సహకరించేది లేదు : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ జనసేనకు టిక్కెట్ ఇస్తే అవనిగడ్డ క్యాండెట్ ను ఓడిస్తాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ నలభైయేళ్లుగా పార్టీ జెండా మోశాం.. తొలిసారి మాకు బాధకలుగుతోంది : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ బుద్ధప్రసాద్ ను ఇండిపెండెంట్ గా పోటీచేయించి గెలిపించుకుంటాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ సీటు మాకే వస్తుందని ఎంతగానో ఆశించాం : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు మండలి బుద్ధప్రసాద్ కు సీటు దక్కక పోవడం మమ్మల్ని బాధించింది: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు అవనిగడ్డ సీటు విషయంలో చంద్రబాబు మరోమారు పునరాలోచించుకోవాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు నెలరోజుల నుంచి సీటు పై నాన్చుతూనే ఉన్నారు : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు మా ఆవేదనను అధిష్టానం గుర్తించాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు సీటు మాకెందుకు ఇవ్వడంలేదో సమాధానం చెప్పాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు జనసేనకు అనిగడ్డ సీటు ఇస్తున్నామని ఇంతవరకూ మాకు చెప్పలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు నిన్న జనసేన జాబితా ప్రకటనతోనే మాకు తెలిసింది : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు సీటు విషయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు 2:16 PM, March 25th 2024 నో టికెట్.. జీవీఎల్ వీడియో సందేశం విశాఖ ప్రజలకి , కార్యకర్తలకి జీవీఎల్ వీడియో సందేశం విశాఖ సీటు నాకు రానందుకు విశాఖ వాసులు చాలామంది ఫోన్ చేసి బాధపడ్డారు విశాఖ ప్రజల అభిమానం చూరగొన్నందుకు సంతోషంగా ఉంది గత మూడేళ్లగా విశాఖ అభివృద్దికి, విశాఖ ప్రజలకి సేవకి సంతోషాన్ని కలిగించింది విశాఖలో పోటీచేయడానికి అవకాశం రాని సంగతి మీకు తెలిసిందే ప్రజలకి మంచి జరగాలని నిస్వార్ధంగా సేవ చేశా విశాఖ అభివృద్దికి మనం కలిసి చేసిన సేవ వృదా అయిందని భావించద్దు ఎన్నికలని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సేవ చేయలేదు జీవీఎల్ ఫర్ వైజాగ్ అన్నది నిరంతర ప్రక్రియ ప్రజాసేవ, విశాఖ అభివృద్ది ఒక కమిట్ మెంట్ తో చేసేవి త్వరలోనే విశాఖ వచ్చి మీ అందరినీ కలుస్తా విశాఖ అభివృద్దే ధ్యేయంగా కార్యకర్తలంతా కలిసి ఒక కార్యచరణ రూపొందించుకుందాం విశాఖ అభివృద్దే లక్ష్యం విశాఖలోనే ఉంటూ భవిష్యత్ లో విశాఖ అభివృద్దికి మీ అందరితో కలిసి కృషి చేస్తా 1:52 PM, March 25th 2024 తిరుపతి టికెట్ పంచాయితీ.. సుగుణమ్మ కంటతడి తిరుపతి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు టికెట్ దక్కలేదని కంటతడి పెట్టిన సుగుణమ్మ అహర్నిశలు టీడీపీ కోసం పనిచేశా: సుగుణమ్మ తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరం: సుగుణమ్మ చంద్రబాబు చేపించిన సర్వేలు ఏమయ్యాయి?: సుగుణమ్మ టికెట్ జనసేనకు కేటాయించడంపై పునరాలోచన చేయాలి: సుగుణమ్మ బయటి వ్యక్తులకు ఎన్నికల్లో మద్దతు తెలపలేం: సుగుణమ్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతి టికెట్ పై మరోసారి చర్చించాలి : సుగుణమ్మ ఎక్కడి నుంచో వచ్చినవారికి మద్దతు పలకమంటే నేను అంగీకరించినా.. కేడర్ అంగీకరించడం లేదు: సుగుణమ్మ 1:46 PM, March 25th 2024 ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ వచ్చే నెల ఐదవ తేదీ నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో పర్యటించనున్న జాతీయ అగ్ర నేతలు బహిరంగ సభలతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి 1:35 PM, March 25th 2024 ఏపీలో పెండింగ్ సీట్లపై కూటమిలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇంకా 20 అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో పెట్టిన కూటమి 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని బీజేపీ టీడీపీ -7, జనసేన - 3 పెండింగ్ - 20 స్థానాలకు సామాజిక సమీకరణాల లెక్కల్లో కూటమి విజయనగరం స్థానం కాపులకు దక్కే అవకాశం విజయనగరం పరిధిలో 2 లక్షలకు పైగా తూర్పు కాపుల ఓట్లు తెరమీదకు కళా వెంకట్రావు, గేదెల శ్రీనివాస్, మీసాల గీత పేర్లు శ్రీకాకుళం, అనకాపల్లి, స్థానాలు కొప్పుల వెలమ, వెలమలకు కేటాయింపు ఒంగోలు, కడప పార్లమెంట్ స్థానాలకు గానూ రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేస్తారా? దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు స్థానాలకు ఖరారు కానీ టీడీపీ అభ్యర్థులు జనసేన నుంచి పెండింగ్ లో పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ స్థానాలు. 1:20 PM, March 25th 2024 కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు: ముద్రగడ కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి బాబుకు పవన్ సహకరించారు కాపులు రోడెక్కే పరిస్థితిని చంద్రబాబు కలగజేశాడు ఆనాడు చంద్రబాబు పక్కన ఉన్న పవన్ ఉద్యమకారులను కొట్టినా.. కేసులు పెట్టినా ఎప్పుడు మాట్లాడలేదు. కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు పక్కనుండి పవన్ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదు. ఇవాళ పిఠాపురం నుండి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీటితో గెలుస్తాను.. ఓటర్ల అమ్ముడు పోతారు అనే భావం వ్యక్తం చేశారు. పిఠాపురం ఓటర్లు డబ్బులకు అమ్ముపోయిన వారిగా మాట్లాడటం భాధాకరంగా ఉంది. ఓటర్లు ఈ విషయం గమనించమని కోరుతున్నాను. జనసేన బలోపేతానికి ఫలితం ఆశించకుండా పని చేయాలనుకున్నాను 70-80 సీట్లు.. సగ కాలం ముఖ్యమంత్రి పదవి అడగాలని జనసేనకు చెప్పాను. దీని పై పవన్ స్పందన ఎక్కడా రాలేదు. ఇనుప ముక్కను నీటిలో నాన బెడితే ఏలా ఉంటుందో.. అలా పవన్ కాలయాపణ చేశారు. 1:05 PM, March 25th 2024 చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ చంద్రబాబు గారి మ్యానిప్యులేషన్ల గురించి తెలియందెవరికి? సీటు కావాలంటే వందకోట్లు చెల్లించాలి ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు అది ఏడు కోట్లా, 20 కోట్లా స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడు బుకాయింపులు వద్దు. చంద్రబాబు గారి హాట్ డీల్స్ ఎలా ఉంటాయో పసివాడిని అడిగినా చెబ్తారు వొంటేరూ.. 12:55 PM, March 25th 2024 ముఖ్యనేతలతో పురంధేశ్వరి సమావేశం పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ ప్రచార షెడ్యూల్పై ఏపీ ముఖ్య నాయకులతో చర్చ ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నేడో, రేపో పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన బీజేపీ సభలకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు రాక వచ్చే నెల ఐదో తేదీ నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురంధేశ్వరి 12:40 PM, March 25th 2024 బాబు, సుజానా చౌదరిపై కేశినేని నాని ఫైర్ విజయవాడ వెస్ట్ బీజేపీ సీటుపై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ పరోక్షంగా సుజనా చౌదరిని కౌంటర్ చేసిన కేశినేని నాని వెస్ట్లో వైసీపీ అభ్యర్ధి ఆసిఫ్పై పెద్ద కుట్ర జరుగుతోంది మొన్నటి వరకూ జనసేనకే వెస్ట్ టిక్కెట్ అన్నారు ఇప్పుడు బీసీ వ్యక్తిని కాదని.. బీజేపీ నుంచి ఒక ధనికుడిని తీసుకొస్తున్నారు పశ్చిమ నియోజకవర్గం ముస్లింలు, బీసీలు, పేదలు ఉన్న నియోజకవర్గం సీఎం జగన్ ఒక కార్యకర్తగా ఎదిగిన ఆసిఫ్కు టిక్కెట్ ఇచ్చారు మన ప్రత్యర్ధులు చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే ఒక వ్యాపారవేత్తను మనపై పోటీకి పెట్టారు ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు నిజంగా ఇది పేదలకు పెత్తందార్లకు మధ్య పోటీనే చంద్రబాబు బీసీ, ఎస్సీ, మైనార్టీలను మోసం చేస్తున్నారు కేంద్రమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఉపయోగపడని వ్యక్తిని ఎందుకు తెస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఢిల్లీ నుంచి గల్లీ వరకూ వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తిని ఆసిఫ్ మీదకు వదిలారు డబ్బుతో పశ్చిమ నియోజకవర్గాన్ని కొనాలని చూస్తున్నారు మేనేజ్మెంట్తో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు 12:20 PM, March 25th 2024 పొత్తులో సీటు చిచ్చు.. అవనిగడ్డలో చిచ్చురాజేసిన సీటు పంచాయతీ పొత్తుల్లో జనసేనకు దక్కనున్న అవనిగడ్డ సీటు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అవనిగడ్డ టీడీపీ కేడర్ అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ మండలి బుద్ధప్రసాద్ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ కేడర్ భవిష్యత్ కార్యాచరణ కోసం సమావేశమైన అవనిగడ్డ టీడీపీ కేడర్ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలు 12:00 PM, March 25th 2024 రఘురామకు బీజేపీ కౌంటర్ రఘురామకృష్ణంరాజు విమర్శలపై బీజేపీ కౌంటర్ బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాలో ఆర్ఆర్ఆర్కు నో ఛాన్స్ జాబితాలో పేరు లేకపోవడంలో ఆశ్చర్యమేముందన్న బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా ఏపీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేకుండా సీటు ఎలా అంటూ సెటైర్లు వారిపై జాలిచూపే పార్టీలు ఎందుకు సీటు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి? ఎంపీల జాబితా ప్రకటన తర్వాత బీజేపీపై అక్కసు వెళ్లగక్కిన రఘురామకృష్ణంరాజు తనకి నర్సాపురం సీటు ఇవ్వలేదంటూ బీజేపీపై విమర్శలు. 11:36 AM, March 25th 2024 పవన్పై నమ్మకం ఉంది: పోతిన మహేష్ విజయవాడ వెస్ట్లో తేలని టికెట్ పంచాయితీ జనసేన తరఫున పట్టువీడని పోతిన మహేష్ కూటమిలో నాకు సీటు రావడమే న్యాయం: మహేష్ ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా: మహేష్ పవన్పై నమ్మకం ఉంది: మహేష్ నాకు టికెట్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు: మహేష్ 11:03 AM, March 25th 2024 కుప్పంలో భారీగా మద్యం పట్టివేత? చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల వేళ భారీ మద్యం పట్టివేత కర్ణాటక నుండి గుడుపల్లి మండలం సోడిగానీపల్లి కి తరలిస్తున్న మద్యం స్వాధీనం ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోబాపెట్టేందుకు ఈ మద్యం తరలిస్తున్నట్లు అధికారుల అంచనా రూ. 6లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసున్న పోలీసులు ఇద్దరు ముద్దాయిలు, ఒక ద్విచక్ర వాహనం ఒక కారును అదుపులోకి తీసుకున్న SEB పోలీసులు 10:47 AM, March 25th 2024 బాబు ఎగస్ట్రా సీటు ఇస్తారా? రసదయకంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాజకీయం అభ్యర్థుల్ని ప్రకటించినా.. కొన్ని చోట్ల తెగని పంచాయితీ భీమిలి లేదా విశాఖ సౌత్ సీటు అడుగుతున్న బీజేపీ నేత మాధవ్ టీడీపీ నుంచి భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేన నుంచి దక్షిణ విశాఖ ఆశిస్తున్న వంశీ యాదవ్ వంశీ యాదవ్కు సీట్లు ఇవ్వొద్దని జనసేన శ్రేణుల ఆందోళనలు ఇవాళో, రేపో చంద్రబాబును కలవనున్న మాధవ్ సీట్లు సర్దుబాటులో భాగంగా బీజేపీకి మరొక సీటు అదనంగా అడగనున్న మాధవ్ ఇచ్చేది అనుమానమే అంటున్న రాజకీయ వర్గాలు 10:02 AM, March 25th 2024 27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ‘ప్రజాగళం’ పేరుతో సన్నాహాలు రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పర్యటన 27న చిత్తూరు జిల్లాలో పర్యటన ప్రారంభం 31వ తేదీ వరకు పర్యటనలు ఖరారు 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ప్రచారం 28న రాప్తాడు, శింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ప్రచారం 09:38 AM, March 25th 2024 చివరకు బండారు ఇలా.. పెందుర్తి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్ దక్కకపోవడంతో మనోవేదన తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిక షుగర్ లెవల్స్ తగ్గిపోవడం వల్ల పల్స్ రేటు గణనీయంగా పడిపోయిందన్న డాక్టర్లు కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన బండారు.. మూడో లిస్ట్లోనూ నో టికెట్ పెందుర్తి టికెట్ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పంచకర్ల రమేష్ బాబుకు కేటాయింపు బండారుకు పలువురు టీడీపీ నేతల పరామర్శ మంత్రి రోజాను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితమేనంటూ స్థానికంగా చర్చ 09:27 AM, March 25th 2024 అద్దెకు మరో జనసేన కార్యాలయం జెండా ఎత్తేసిన మరో జనసేన కార్యాయలం నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో ఆఫీస్కు తాళం పట్టుమని 30 రోజులు గడవకముందే ‘అద్దెకు ఇవ్వబడును’ అనే బోర్డు మొన్నీమధ్యే ఉత్తరాంధ్రలో ఇలాంటి పరిస్థితి మాధవధారలోని జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీ కార్యాలయానికి తాళం వేసి టులెట్ బోర్టు కార్యాలయాలు నిర్వహించే స్తోమత లేనప్పుడు ఎందుకీ ఆర్భాటాలు అని నిలదీస్తున్న జనసేన నేతలు! 09:10 AM, March 25th 2024 పవన్.. మరీ ఇంత దుర్మార్గమా? ధనసేన చేతిలో జనసేన నేతలు దగా అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో జనసేన పోటీ 18 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన డబ్బున్న, అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చిన పవన్ కల్యాణ్ 18 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే బీసీలకు సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మైనారిటీలకు ఒక్క సీటు కూడా ఇవ్వని జనసేన అనకాపల్లి, నరసాపురం మాత్రమే బీసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబా ,చేనేత కులాలకు ఒక్క సీటు కూడా ఇవ్వని పవన్ కళ్యాణ్ మొత్తం 18 సీట్ల లో 12 సీట్లు ఓసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను పక్క పార్టీ నేతలకు పిలిచి ఇచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన కోసం పనిచేసిన నాయకులను పక్కన పడేసిన పవన్ జనసేన లో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చిన పవన్ జనసేన వీర మహిళలు ఎవ్వరు పోటీ కి పనికిరారని తేల్చిన పవన్ బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ , రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ.. పవన్ హ్యాండ్ ఇచ్చిన లిస్ట్ పెద్దదే 08:40 AM, March 25th 2024 సీ-విజిల్ యాప్.. అనంతలో 29 మంది సస్పెండ్ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా గా సీ-విజిల్ యాప్ ద్వారా అందిన 168 ఫిర్యాదులు విచారణ తర్వాత చర్యలు తీసుకున్నట్లు ప్రకటించిన కలెక్టర్ గౌతమి ఇప్పటిదాకా రూ. 16.94 లక్షల స్వాధీనం నిబంధనలు పాటించని 29 మందిని సస్పెండ్ 08:30 AM, March 25th 2024 గీత టికెట్పై గిరిజన సంఘాల్లో అసంతృప్తి అరకు ఎంపీ సీటు కొత్తపల్లి గీతకు ఇచ్చిన బీజేపీ పురందేశ్వరి తన స్వలాభం కోసమే గీతకు టికెట్ ఇప్పించారనే ఆరోపణ 2014లో వైఎస్ఆర్సిపీ అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాల ఫిర్యాదు 2019 లో జనరల్ స్థానం విశాఖ ఎంపీగా పోటీ చేసిన గీత గత విశాఖ ఎంపీ ఎన్నికల్లో కేవలం 1159 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత గత ఎన్నికల్లో 14వ స్థానంలో 0.09 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత ఎన్నికల సంఘం గుర్తించని జన జాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పి బీజేపీ టికెట్ కు లాబీయింగ్ చేసిన కొత్తపల్లి గీత కొత్తపల్లి గీతకు టికెట్ కేటాయింపు పై స్థానిక గిరిజన వర్గాల్లో అసంతృప్తి 08:12 AM, March 25th 2024 నేడు రామచంద్రపురానికి ఎంపీ మిథున్రెడ్డి కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి తోట త్రిమూర్తులు నిర్వహించే ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్న మిథున్ పిల్లి సూర్యప్రకాష్కు తన అనుచరులు సపోర్ట్ చేయాలని సమావేశం 07:45 AM, March 25th 2024 మేమంతా సిద్ధం.. తొలి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్రకు అంతా సిద్ధం మరో మరో 48 గంటల్లో వైఎస్ జగన్ బస్సుయాత్ర ప్రారంభం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ నుండి ప్రారంభం కానున్న బస్సుయాత్ర రోజుకొక జిల్లాలో సాగుతూ శ్రీకాకుళం జిల్లాలో ముగియనున్న యాత్ర జగన్ బస్సుయాత్రతో ఏపీలో మరింత పెరిగిన పొలిటికల్ హీట్ తొలిరోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ తొలి బస్సుయాత్ర సభలో జగన్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి బస్సుయాత్రతో వైఎస్సార్సీపీ కేడర్లో మరింత జోష్ 07:28AM, March 25th 2024 నేడు కుప్పానికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత పర్యటన రెండ్రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్న నారా చంద్రబాబు నాయుడు కుప్పం సెంటర్లో ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు రేపు హంద్రినీవా పరిశీలన 27 నుంచి ప్రజాగళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు ప్రతీరోజూ నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు 07:26AM, March 25th 2024 ఎమ్మెల్యే సీట్లలోనూ ఇంతేనా?.. బీజేపీ సీనియర్ల ఆవేదన బీజేపీ జాబితాలో సీనియర్లకి దక్కని అవకాశం ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశమివ్వడానికి సీనియర్ల గొంతుకోసారంటూ విమర్సలు జీవీఎల్, పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు,గారపాటి చౌదరి, సత్యకుమార్, విష్ణు వర్దన్ రెడ్డి లాంటి సీనియర్లకి టిక్కెట్లే ఇవ్వని అధిష్టానం ఎంపీ రేసులో చివరి వరకు ప్రయత్నించినా నిరాశే చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రల వల్లే సీనియర్లకి అవకాశం దక్కలేదంటున్న బీజేపీ వర్గాలు కాంగ్రెస్కి బాండ్ల రూపంలో రూ. 30 కోట్లు విరాళమిచ్చిన సీఎం రమేష్కి అనకాపల్లి ఎంపీ టికెట్ కడపకి చెందిన సీఎం రమేష్ కి అనకాపల్లి సీటు కేటాయించడంపై సీనియర్లు ఆగ్రహం సీఎం రమేష్కి టిక్కెట్ అంటే.. టీడీపీకి కేటాయించినట్లేనంటున్న బీజేపీ నేతలు బ్యాంకులని బురిడీ కొట్టిన కేసులతో పాటు.. ఎస్టీ కాదని కోర్టులో కేసులు నడుస్తున్న కొత్తపల్లి గీతకి అరకు పార్లమెంట్ నాలుగు దశాబ్దాలకి పైగా బీజేపీకి సేవలందించిన సోము వీర్రాజుని కాదని రాజమండ్రి నుంచి స్ధానికేతురాలైన పురందేశ్వరికి అవకాశం నరసాపురం టిక్కెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజుకి బీజేపీ చెక్ ఢిల్లీలో ఉండి 15 రోజులగా ప్రయత్నించినా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని బీజేపీ అధిష్టానం రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం సీనియర్ల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న వైనం బీజేపీలో చేరిన వెంటనే వరప్రసాద్కి తిరుపతి టిక్కెట్ ఒకటి రెండు రోజులలో పది అసెంబ్లీ స్ధానాల జాబితా ప్రకటించనున్న బీజేపీ ఎమ్మెల్యే జాబితాలోనూ ఇతర పార్టీ నేతలకే ఎక్కువ ఛాన్స్ 07:04AM, March 25th 2024 ఎల్లుండి నుంచే ‘మేమంతా సిద్ధం’ అధికార వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర ఎల్లుండి (మార్చి 27 నుంచి) ఇడుపులపాయ నుంచి మొదలు సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమంతో పాటు పాలనతో సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ప్రజల్లో సీఎం జగన్ పార్లమెంటరీ స్థానాల పరిధిలో బహిరంగ సభలు ఉదయం ప్రజలతో మమేకం.. సాయంత్రం పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ ఇంటెరాక్షన్లో ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ ఈ యుద్ధం 15 ఏళ్ళుగా నాకు అలవాటే. నాతో నడిచిన మీకూ అలవాటే... కౌరవ సైన్యాన్ని మరోసారి ఎదుర్కొనేందుకు నేను సిద్ధం... మీరు సిద్ధమా✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/GGPuif7Ig2 — YSR Congress Party (@YSRCParty) March 24, 2024 06:57AM, March 25th 2024 18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలు పెండింగ్ రెండు లోక్సభ స్థానాల్లో కాకినాడకు ఇప్పటికే అభ్యర్థి ఖరారు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించిన పవన్ అమిత్ షా చెబితే ఎంపీగా తాను పోటీ చేస్తానన్న పవన్ కాకినాడలో తాను ఎంపీగా పోటీ చేసి.. పిఠాపురం నుంచి ఉదయ్ పోటీ చేస్తాడని స్పష్టీకరణ 06:52AM, March 25th 2024 లోకేష్ ఎక్కడికెళ్లినా.. ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్కు చుక్కలు ఎక్కడికెళ్లినా ప్రజల నిరసనలు.. నిలదీతలు.. ప్రశ్నల వర్షం అధికారంలో ఉండగా ఏం చేశారు?.. కరోనా టైంలో ఏమైపోయారు? అంటూ నిలదీస్తున్న మంగళగిరి వాసులు లోకేశ్ ప్రచారంలో ఇదీ పరిస్థితి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న వైనం ప్రచారానికి ముఖ్య నేతల డుమ్మా చివరకు అపార్ట్మెంట్లలో ప్రచారానికే పరిమితమైన లోకేష్ మంగళగిరిలో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన? ఓటర్లకు బల్ల బండ్లు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్ల పంపిణీ ఓ ప్రదేశంలో వాటిని నిలిపి.. ఓటర్లే వాటిని తీసుకెళ్లేలా ఒత్తిడి అధికారులకు అనుమానం రాకుండా కొనసాగుతున్న ప్రలోభాలపర్వం 06:48AM, March 25th 2024 ఏపీ బీజేపీకి ఇలాంటి పరిస్థితా? వలసలకే సీట్లా?.. ఏపీలో బీజేపీకి అభ్యర్థులే కరువైన రీతిలో ఎంపీల లిస్టు ఆరు స్థానాల్లో నరసాపురం తప్ప అన్ని సీట్లూ వలస నేతలకే కండువా కప్పుకున్న రోజే వరప్రసాద్కు తిరుపతి సీటు కడప నుంచి అనకాపల్లికి వచ్చి సీఎం రమేష్ పోటీ ఈ మధ్యే చేరిన కిరణ్కుమార్రెడ్డికి రాజంపేట పురందేశ్వరికి రాజమండ్రి, కొత్తపల్లి గీతకు అరకు నిరుత్సాహానికి గురైన జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణు సీనియర్లలో తీవ్ర ఆవేదన వలస నేతలకు సీట్లు ఇప్పించడంలో చంద్రబాబు కీ రోల్ బాబును నమ్ముకున్న రఘురామ రాజు మాత్రం హ్యాండ్ 06:35AM, March 25th 2024 బాబుకి బుద్ధి చెప్పి తీరతా: గొంప కృష్ణ ఎన్ఆర్ఐ గొంప కృష్ణని నిండా ముంచిన చంద్రబాబు శృంగవరపుకోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఆశచూపి అమెరికా నుంచి పిలిపించిన చంద్రబాబు టీడీపీ కోసం కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టించిన నారా లోకేష్ బాబు, లోకేష్ను నమ్మి అమెరికా నుంచి వస్తే కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారంటూ గొంప కృష్ణ ఆవేదన రానున్న ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి బాబుకి బుద్ధి చెప్తానని శపథం! 06:30AM, March 25th 2024 టీడీపీ.. ఆ 31 స్థానాల్లోనూ గందరగోళమే 30కి పైగా స్థానాల్లో భగ్గుమంటున్న టీడీపీ నేతలు సీట్లు రాక పలుచోట్ల రెబల్స్గా మారిన తెలుగు తమ్ముళ్లు వారిని బుజ్జగించేందుకు శతవిధాలా యత్నిస్తున్న చంద్రబాబు ఎంత సర్ది చెప్పినా టికెట్ దక్కించుకున్నవారిని ఓడిస్తామంటున్న అసంతృప్తులు పైకి పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా లోలోన రగిలిపోతున్న వైనం పొత్తుల్లో పోయిన 31 స్థానాల్లోనూ గందరగోళమే రెడ్డిగూడెంలో బలప్రదర్శన చేపట్టిన టికెట్ దక్కని దేవినేని ఉమ ఏలూరు ఎంపీ టికెట్పై రాజీలేని పోరాటం చేస్తున్న బీజేపీ గోపాలపురంలో మద్దిపాటికి తప్పని అసమ్మతి బెడద -
ఎన్నికల బాండ్లలోనూ తిరకాసే!
ఎన్నికల బాండ్ల విషయంలో ఎల్లో మీడియా ఏడుపులు మాములుగా లేవు. అయితే.. ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపేణా భారీగానే డబ్బును మూటగట్టుకుంది. ఇక గుర్తింపులేని జనసేన కూడా ఈ విషయంలో ఏం తక్కువ తినలేదు. గురువారం సుప్రీంకోర్టుకు ఎస్బీఐ అందించిన ఎన్నికల బాండ్ల నంబర్ల ద్వారా ఏయే పార్టీకి ఎంత విరాళం అందిందో స్పష్టంగా వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి 2019 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ దాకా రూ.80 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలుగా వచ్చాయి. అయితే సరిగ్గా ఎన్నికల ముందర సీన్ మారింది. కేవలం అక్టోబర్ 2023 నుంచి ఫిబ్రవరి మధ్యలోనే రూ. 130 కోట్లను విరాళంగా టీడీపీ స్వీకరించింది. మొత్తంగా టీడీపీకి ఎన్నికల బాండ్ల రూపేణా వచ్చిన రూ. 212 కోట్లలో 55 శాతం ఫండింగ్.. అంటే సుమారు రూ. 118 కోట్లు కేవలం ఒక్క జనవరిలోనే అందడం గమనార్హం. టీడీపీకి ఎన్నికల బాండ్లు విరాళాలుగా సమర్పించిన వాళ్లలో.. షిరిడీ సాయి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూ.40 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ రూ.28 కోట్లతో రెండోస్థానంలో నిలిచాయి. యూపీ పవర్ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.20 కోట్లు, నాక్టో ఫార్మా లిమిటెడ్ రూ.14 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ రూ.13 కోట్లు.. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల లిమిటెడ్ రూ.10 కోట్లు ఎన్నికల బాండ్లు టీడీపీకి విరాళంగా ఇచ్చిన వాళ్లలో ఉన్నారు. ప్రముఖ విద్యాసంస్థ అయిన శ్రీ చైతన్య స్టూడెంట్ఫెసిలిటీ మేనేజ్మెంట్ తరఫున రూ. 5 కోట్లు ఇచ్చింది. ఇక జనసేన సంగతి భిన్నంగా ఉంది. సాధారణంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు వచ్చిన దాఖలాలు లేవు. అయితే.. బీజేపీ, టీడీపీ కూటమి భాగస్వామి, జనసేన మాత్రం ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించింది. పవన్ కల్యాణ్ పార్టీకే కాదు.. 2019-21 మధ్య గుర్తింపు లేని ఏ ఒక్క పార్టీకి కూడా విరాళాలు రాలేదు. కానీ, 2022 జనసేనకు రూ.22 కోట్లు, 2023లో మరో రెండు కోట్లు, 2024లో ఏకంగా 17 కోట్ల రూపాయలు.. మొత్తంగా 21 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయి. కొత్త పార్టీలు లేదంటే మునుపటి ఎన్నికల్లో తగినన్ని ఓట్లను సంపాదించని రాజకీయ పార్టీలను గుర్తింపు లేని పార్టీలుగా ఈసీ ప్రకటిస్తుంది. తద్వారా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్న గుర్తింపు లేని పార్టీగా జనసేన నిలవడం కొసమెరుపు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
టబుకి హాలీవుడ్ చాన్స్.. ఆ వెబ్ సీరీస్లో కీలక పాత్ర!
టీడీపీ నాయకుల దాష్టీకం..
ఘొల్లుమనే జోకులేసిన రఘురామ
ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు
ఫేస్బుక్, ఇన్స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం
వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...
కియారాకు అరుదరైన అవకాశం
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
తప్పక చదవండి
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
Advertisement