More

కేపీహెచ్‌బీ కాలనీలో దొంగల బీభత్సం

26 Jun, 2016 09:26 IST
కేపీహెచ్‌బీ కాలనీలో దొంగల బీభత్సం

హైదరాబాద్ : కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ఒకేరోజు మొత్తం 7 చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు. కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లో తాళం వేసున్న ఒక ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. సమీపంలోని ప్రగతినగర్‌లోని ఓ ఇంట్లో రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు అందుబాటులో లేకపోవడంతో.. ఎంత మొత్తం చోరీకి గురైంది అనే విషయంలో స్పష్టత రాలేదు. శనివారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో ఈ దొంగతనాలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫూటేజిల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వారిని గెలిపించేందుకు కాంగ్రెస్‌ డమ్మీలను పెట్టింది: మంత్రి కేటీఆర్‌

ఈ నెల 28 నుంచి మద్యం షాపులు బంద్‌  

‘మూడ్‌ ఆఫ్‌ తెలంగాణను బీఆర్‌ఎస్‌ మూడోసారి గెలుస్తుందా?’

Nov 26th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

ఢిల్లీ లీడర్లకు కేసీఆర్‌ భయం