More

విద్యుత్‌ తీగలు తెగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం

14 Jan, 2018 08:15 IST

సాక్షి, మహబూబాబాద్‌: విద్యుత్‌ తీగలు తెగిపడడంతో మహబూబాబాద్‌ మీదుగా సాగే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కె.సముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ దగ్గర ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

వెంటనే స్పందించిన రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. విద్యుత్‌ వైర్లు తొలగించిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

గ్రంథాలయ వారోత్సవాలు

అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

నిరంతర పర్యవేక్షణ ఉండాలి

చదువు విలువ తెలిసిన వారికే మద్దతు

ఇంటి వద్దే ఓటు హక్కు..