More

మరోసారి విలన్‌గా..

15 Sep, 2019 00:32 IST
రెజీనా

ఇటీవల తెలుగులో విడుదలైన ‘ఎవరు’ సినిమాలో సమీర పాత్రలో రెచ్చిపోయారు రెజీనా. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈ పాత్రలో రెజీనా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా మరోసారి అలాంటి పాత్రనే రెజీనా చేస్తున్నారని తెలిసింది. విశాల్‌ హీరోగా ఆనంద్‌ అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. మిలటరీ ఆఫీసర్‌ పాత్రలో విశాల్, పోలీసాఫీసర్‌ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోయంబత్తూరులో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ దాదాపు ఇరవై రోజులు జరుగుతుంది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్‌ చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌ విజయం.. అల్లు అరవింద్‌ శుభాకాంక్షలు..

యానిమల్‌ బాక్సాఫీస్‌ సునామీ.. రాష్ట్రాల వారిగా కలెక్షన్స్‌ ఇవే

తొలి సినిమా సక్సెస్‌.. ప్రేక్షకులతో కేక్‌ కట్‌ చేసిన హీరో

పుష్ప-2తో పోటీ పడనున్న మూవీ.. షూటింగ్‌లో స్టార్ హీరోకు గాయాలు!

స్టార్ హీరో కొత్త చిత్రం.. టైటిల్ ఫిక్స్!