న్యూఢిల్లీ: రక్షాబంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాఖీ కట్టారు.103 ఏళ్ల బామ్మ షర్బతి దేవి సోమవారం మోదీకి రాఖీ కట్టేందుకు ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చారు. బామ్మతో రాఖీ కట్టించుకున్న ప్రధాని... ఆమెతో ఆత్మీయంగా మాట్లాడారు. వీల్ చెయిర్కు దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుని ఆమెతో ముచ్చటించారు.
50ఏళ్ల క్రితమే తన సోదరుడిని కోల్పోయిన షర్బతి దేవి ప్రధానిలో తన సోదరుడిని చూసుకుని మురిసిపోయింది. అంతేకాకుండా ప్రధానిని చేతులతో నిమిరి, ఆశీర్వదించారు. ఈ విషయాన్ని పీఎంవో కార్యాలయం ట్విట్ చేసింది. మరోవైపు పలువురు స్కూల్ విద్యార్థినులు ప్రధానికి రాఖీ కట్టారు.