More

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన షర్బతి దేవి

7 Aug, 2017 20:36 IST
ప్రధాని మోదీకి రాఖీ కట్టిన షర్బతి దేవి

న్యూఢిల్లీ: రక్షాబంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాఖీ కట్టారు.103 ఏళ్ల బామ్మ షర్బతి దేవి సోమవారం మోదీకి రాఖీ కట్టేందుకు ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చారు. బామ్మతో రాఖీ కట్టించుకున్న ప్రధాని... ఆమెతో ఆత్మీయంగా మాట్లాడారు. వీల్‌ చెయిర్‌కు దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుని ఆమెతో ముచ్చటించారు.

50ఏళ్ల క్రితమే తన సోదరుడిని కోల్పోయిన షర్బతి దేవి ప్రధానిలో తన సోదరుడిని చూసుకుని మురిసిపోయింది. అంతేకాకుండా ప్రధానిని చేతులతో నిమిరి, ఆశీర్వదించారు. ఈ విషయాన్ని పీఎంవో కార్యాలయం ట్విట్‌ చేసింది. మరోవైపు పలువురు స్కూల్‌ విద్యార్థినులు ప్రధానికి రాఖీ కట్టారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా యడియూరప్ప తనయుడు

అలాంటి వీడియోలపై దృష్టి పెట్టాం: కేంద్ర మంత్రి

ప్రైవేట్‌ లాకర్లలో భారీగా బ్లాక్‌ మనీ.. కొనసాగుతున్న సోదాలు

నితీష్‌ ఆహారంలో విషం.. అందుకే ఆయన అలా : మాంజీ

చెత్త కుప్పలో బ్యాగ్‌...తీసి చూస్తే డాలర్ల కట్టలు