ముంబై: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝాకు కరోనా పాజిటీవ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘ఇంతవరకు నాలో కరోనా లక్షణాలు ఏవి కనిపించలేదు. అయినా నాకు కరోనా పాజిటీవ్ అని తేలింది. రాబోయే 10-12 రోజులు నేను హోం క్వారంటైన్లో ఉండబోతున్నాను. కరోనా వ్యాప్తి లక్షణాలను తక్కువగా అంచనా వేయకండి. మనందరికి కరోనా ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండండి’ అంటూ సంజయ్ ఝా ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే పలువురు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు సంజయ్ ఝా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ రీట్వీట్ చేశారు.(కొత్త జంటకు షాక్: వధువుకు కరోనా)
కాంగ్రెస్ అధికార ప్రతినిధికి కరోనా
22 May, 2020 16:31 IST