More

డ్రగ్స్ బానిసలపై ఎయిమ్స్ సర్వే

4 Jul, 2016 19:36 IST

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాలపై ఆధారపడి జీవిస్తున్న వారి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎయిమ్స్‌కు చెందిన నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్(ఎన్డీడీటీసీ) సహకారంతో సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేలో డ్రగ్స్‌పై ఆధారపడిన వారి సమాచారంతోపాటు, అవి వినియోగదారులకు ఏ విధంగా చేరవేస్తారన్న వాటిని గుర్తించనున్నారు. అయితే ఈ సర్వే నిర్వహించడానికి దాదాపు రూ.22.41 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

గత కొన్నేళ్లుగా ప్రపంచ మాదకద్రవ్యాల వార్షిక నివేదికలో భారత సమాచారం లేదు. 15 ఏళ్ల క్రితం నిర్వహించిన ఇలాంటి సర్వేలో రాష్ట్రాలవారీగా సమాచారం లేదని, మహిళల్లో ఏ మేరకు డ్రగ్స్ ప్రభావం ఉందనేదిలేదని సామాజిక న్యాయ శాఖ అధికారి తెలిపారు. ఈ సర్వే ఇంటింటికి తిరిగి సమాచారాన్ని సేకరించనున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అరవింద్ కేజ్రీవాల్‌, ప్రియాంక గాంధీకి ఈసీ నోటీసులు

వ్యభిచారాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలి: ఎంపీ ప్యానెల్

ఓబీసీ సర్టిఫికెట్‌ దుమారం: శరద్‌ పవార్‌ కౌంటర్‌ 

కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!

ఐఐటీఎఫ్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్స్‌