More

ఒబామా పర్యటనకు నిరసనగా రైల్వే ట్రాక్ పేల్చివేత

24 Jan, 2015 18:04 IST

రాయగఢ్: విశాఖపట్నం-రాయ్‌పూర్ రైల్వేలైన్ మార్గంలో  ఒడిషాలోని రాయగఢ వద్ద రైలు పట్టాలను శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడగా,  ఈ రైలు మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయగఢ సమీపంలోని మునిగుడ రైల్వే స్టేషన్ వద్ద మావోయిస్టులు అత్యాధునిక ఐఈడీని ఉపయోగించి పట్టాలను పేల్చివేశారని, ఓ మీటరు మేరకు పట్టాలు ధ్వంసమయ్యాయని,  ఐఈడీ ఎక్కువ శక్తివంతమైనది కాకపోవడం వల్ల ఎక్కువ నష్టం సంభవించలేదని రాయగఢ ఎస్పీ శివ సుబ్రమణి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి!

నో డౌట్‌ గహ్లోత్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు! మోదీ జోస్యం

ఆకస్మిక మరణాలకు.. టీకాకు సంబంధం లేదు!

వామ్మో..! నోట్లో ఎన్ని పళ్లో..? గిన్నీస్ రికార్డ్

ప్రస్తుత ప్లాన్‌ పనిచేయకపోతే, మరో ఐదు ప్లాన్లు సిద్ధం, కానీ..!