More

అమ్మల చెంతకు 44 మంది చిన్నారులు

8 Jul, 2015 18:45 IST

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పోలీసులు పలువురు తప్పిపోయిన చిన్నారులకు ఉపశమనం కలిగించారు. రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల్లో తప్పిపోయినవారిలో 44 మందిని గుర్తించారు. ఆపరేషన్ స్మైల్ పేరిట తప్పి పోయిన చిన్నారులను శ్రమకూర్చి గుర్తించారు. వీరిలో ఇప్పటికే 31 మంది చిన్నారులను తమ తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

ఉత్తరాఖండ్లో పలువురు చిన్నారులు తప్పిపోగా ఈ అంశం ఆందోళన కరంగామారింది. దీంతో రాష్ట్ర పోలీసులు పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఆపరేషన్ స్మైల్ పేరిట గాలింపు చర్యలు చేపట్టారు. 44 మందిని గుర్తించి పత్రికా ప్రకటన విడుదల చేశారు. వీరిలో ఎక్కువమంది చిన్నారులు హరిద్వార్లో దొరికారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

రాజస్తాన్‌లో రోడ్డు ప్రమాదం...ఆరుగురు పోలీసుల దుర్మరణం

Rajasthan Election 2023: మోదీ నినాదం.. అదానీజీ కీ జై

Rajasthan Elections 2023: ఐదేళ్లుగా పరస్పరం రనౌట్‌కు కుట్రలు

Rajasthan Elections 2023: కోట్లకు పడగలెత్తారు

Miss Universe 2023: విశ్వసుందరి పలాసియోస్‌