More

‘ఆ పార్టీలో గడ్కరీ ఒక్కడే సరైనోడు’

4 Feb, 2019 18:18 IST

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఒక్కరే కాస్త ధైర్యమున్న నేతని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అన్నారు. రఫేల్‌ కుంభకోణంతో పాటు, రైతుల దుస్ధితి, వ్యవస్ధల నిర్వీర్యంపై తమ ప్రశ్నలకు ఆయన బదులివ్వాలని రాహుల్‌ కోరారు. ‘గడ్కరీజీ..బీజేపీలో కాస్త ధైర్యం ఉన్న నాయకులు మీరే అయినందుకు ధన్యవాదాలు..మోదీ సర్కార్‌లో ముందుకొచ్చిన రఫేల్‌ స్కామ్‌, రైతుల దుస్ధితి, వ్యవస్థలను నిర్వీర్యం చేయడంపైనా మీరు వ్యాఖ్యలు చేయా‘లని సోమవారం రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

కేంద్ర మంత్రి గడ్కరీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్‌ ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. కాగా, శనివారం నాగపూర్‌లో జరిగిన ఏబీవీపీ విద్యార్ధుల సదస్సులో గడ్కరీ మాట్లాడుతూ ముందు మీరు మీ ఇంటిని చక్కదిద్దుకోవాలని, ఇంటిని సవ్యంగా నిర్వహించుకోలేని వారు దేశానికి ఏమీ చేయలేరని హితవు పలికారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Election Commission: రూ.1,760 కోట్లు.. ఐదు రాష్ట్రాల్లో పట్టుబడిన మొత్తం

వరల్డ్‌ కప్‌ రాలేదని యువకుడి ఆత్మహత్య

Rajasthan Elections 2023: రాజస్థానీలకు కాంగ్రెస్‌ ఏడు గ్యారంటీలు

ఎయిరిండియా ఎక్కొద్దు: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌కు ఎన్‌ఐఏ షాక్‌

Rajasthan Elections 2023: ఫేక్‌ అని మహిళలను అవమానిస్తారా?