More

కాళ్లు మొక్కనందుకే టికెట్‌ ఇవ్వలేదు: శోభ

17 Nov, 2018 02:03 IST

గంగాధర: కేసీఆర్‌ కుటుంబ సభ్యుల కాళ్లు మొక్కనందుకే తనకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వలేదని తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు.  శుక్రవారం కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకు టికెట్‌ ఎందుకు ఇవ్వలేదో అడిగినా సమాధానం ఇవ్వలేదన్నారు. ఆది నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నా.. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినా పార్టీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

150 కోట్ల మంది చూపు కామారెడ్డి వైపే : రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌.. రంగంలోకి ఏఐసీసీ పెద్దలు!

అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం

అందరిలో ఒకరిగా ఉండటానికే చీర కట్టు : ఎమ్మెల్సీ కవిత

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి