More

బాబు ఇంటి ముందు టీడీపీ నేత ఆందోళన

20 Jul, 2020 11:41 IST

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వెంకటేశ్వరరావు అనే టీడీపీ నాయకుడు సోమవారం చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు తనను రాజకీయంగా 30 ఏళ్లగా వాడుకొని వదిలేశారని ఆరోపించారు.  జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌గా వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. తన సమస్యలను చెప్పుకోవడానికి కూడా చంద్రబాబు సమయం ఇవ్వడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంకటేశ్వరరావు బాబు ఇంటిముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్లలోకి చొరబడుతోంది: సజ్జల

ఆ సీఎం "మాయగాడు"! అతని 'రెడ్‌ డైరీ'లో ప్రతీ పేజీ..

రాజస్థాన్‌ ఎన్నికలు: నోరు జారిన ఖర్గే, క్షమాపణలు

భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు: సీఎం కేసీఆర్‌

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కేంద్రమంత్రి నిర్మలా