More

క్వార్టర్స్‌లో సైనా 

28 Sep, 2018 02:01 IST

సియోల్‌: కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ సైనా నెహ్వాల్‌ జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ సైనా 21–18, 21–18తో కిమ్‌ గా యున్‌ (దక్షిణ కొరియా)పై గెలుపొందింది.

37 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో కొన్ని సార్లు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా... చివరి వరకు పట్టు సడలించకుండా ఆడిన సైనా విజయం సొంతం చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్‌)తో సైనా తలపడనుంది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

దర్జాగా దక్షిణాఫ్రికా గెలుపు

ICC: శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత..

ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి...

వరల్డ్‌కప్‌ నుంచి అఫ్గాన్‌ ఔట్‌.. దక్షిణాఫ్రికా ఘన విజయం

మాథ్యూస్‌ ఒక్క బంతినైనా ఆడాల్సింది.. అలా చేసి ఉంటే: దినేష్ కార్తీక్‌