More

ఫైనల్లో సానియా జోడి

1 Apr, 2017 13:16 IST
ఫైనల్లో సానియా జోడి

మియామి ఓపెన్ మహిళల డబుల్స్ టోర్నమెంట్లో సానియా మీర్జా-బార్బోరా స్టికోవా ద్వయం ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జోడి 6-7(8) 6-1, (10-4) తేడాతో మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)-చెన్ యంగ్ జన్(తైవాన్) జంటపై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది.తొలి సెట్ ను కోల్పోయిన సానియా ద్వయం.. రెండో సెట్ను సునాయాసంగా దక్కించుకుంది. ఆ తరువాత నిర్ణయాత్మక మూడో సెట్ సూపర్ టై బ్రేక్ కు దారితీసింది. అందులో సానియా జోడి పైచేయి సాధించి ఫైనల్ రౌండ్ కు చేరింది.

ఇది  2017లో  సానియా జోడికి రెండో ఫైనల్. అంతకుముందు సానియా-స్ట్రికోవా సిడ్నీ ఇంటర్నేషనల్ టోర్నీలో ఫైనల్ రౌండ్ కు చేరారు. అక్కడ ఈ జోడి రన్నరప్ గా సరిపెట్టుకుంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం