More

మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్‌

21 Jan, 2017 13:31 IST
మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్‌

విజయవాడ: నగరంలోని సింగ్ నగర్ వంతెనపై మద్యం మత్తులో ఓ వ్యక్తి ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ భీభత్సం సృష్టించాడు. టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్న కారును అతివేగంగా నడుపుతూ వంతెనపై ప్రయాణిస్తున్న వారిని భయబ్రాంతులకు గురి చేశాడు. ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని కారుతో డీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌ పై ఉన్న తండ్రీ కూతుళ్లకు గాయాలయ్యాయి.
 
అనంతరం వంతెన పైన ఉన్న ఫుట్ పాత్ ను ఢీకొట్టాడు. సదరు మందుబాబు హంగామాను స్థానికులు ఆర్ఆర్ పేట పోలీసులకు తెలపడంతో అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. సదరు వ్యక్తి మధురానగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయపడిన తండ్రీ కూతుళ్లను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



 




 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు ఉత్తమ సేవా పురస్కారాలు!

ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!

సామాజిక అస్పృశ్యత నిర్మూలనే లక్ష్యం 

గోవా ఆసుపత్రిలో లీకైన ఆక్సిజ‌న్ ట్యాంక్

కరోనా ఆసుపత్రిలో వైద్యుల నృత్యం