More

ప్రాచీన ఆలయాలను దర్శించిన తనికెళ్ల భరణి

14 Sep, 2015 17:48 IST

జడ్చర్ల : ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాచీన ఆలయాలను దర్శించుకున్నారు. తొలుత ఆల్వాన్‌పల్లి సమీపంలోని మీనాంబర దేవాలయంలో శివుడిని దర్శించుకున్న ఆయన, అనంతరం జడ్చర్ల మండలం గంగాపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి దర్శనం చేసుకున్నారు.

ఆయన వెంట టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఉన్నారు. భరణి ఓ సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ప్రాచీన ఆలయాలను సందర్శిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా అడ్డాకుల మండలం కందూరు ఆంజనేయస్వామిని భరణి తరచూ దర్శించుకుంటుంటారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ

రాష్ట్రంలో మార్పు తప్పదు

విద్యార్థినులకు మెట్రో ప్రయాణం ఉచితం!

కాంగ్రెస్‌ పార్టీని బేరం పెట్టారు

పొలిటికల్‌ దీపావళి... పార్టీల స్వగతాలు!