More

సింగరేణి బుల్ డోజర్ దహనం

30 Apr, 2016 13:55 IST

మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లో సింగరేణి సంస్థకు చెందిన బుల్‌డోజర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. స్థానిక ఓపెన్‌కాస్ట్ గనిలో ఉన్న షావల్ డోజర్‌ను శుక్రవారం రాత్రి కిరోసిన్ పోసి దుండగులు నిప్పంటించారు. డోజర్‌కు పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఈ మేరకు సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితమే జిల్లాలో మావోయిస్టులు ప్రాణహితపై వంతెన పనులు చేస్తున్న వాహనాలను తగులబెట్టిన విషయం విదితమే. అయితే, తాజా ఘటనలోనూ వారి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్‌ గెలిచింది: నారాయణ 

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సీఎం రేవంత్‌కు బండి సంజయ్‌ లేఖ.. కేసీఆర్‌పై చర్యలు తీసుకోండి

Telangana: ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్‌: ఒకే ఇంట్లో ఆరుగురు హత్య.. స్నేహితుడే కారణం!