More

విధినిర్వహణలో గుండెపోటుతో..

24 Sep, 2017 14:14 IST

సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుకు గురై మృతిచెందడం స్థానికులను కలచివేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా మోతే పోలీస్‌స్టేషన్‌లో రాజు హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం విధి నిర్వహణలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. దీంతో తోటి పోలీసులు చికిత్స నిమిత్తం రాజును ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే హెడ్ కానిస్టేబుల్ మృతిచెందినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పాతబస్తీలో బడా వ్యాపారుల టార్గెట్‌గా ఐటీ సోదాలు

ఎన్నికల గుర్తు కన్నా.. నువ్వే బాగున్నావ్‌!

సోనియా దీవిస్తే సీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌లకు చెమటలు పట్టిస్తున్న బీజేపీ అభ్యర్థి

రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు.. సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు