సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్లోవడివడిగా పనులు చేసి ఈనెలాఖరులోగా ప్రారంభోత్సవాలు చేయాలనుకున్న ప్రాజెక్టుల్లో భాగంగా ఎల్బీనగర్ జోన్లోని రెండింటిని గురువారం ప్రారంభించనున్నారు. మునిసిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభిస్తారు.ప్రారంభోత్సవ అంశాన్ని కేటీఆర్ ట్విట్టర్లోనూ పోస్ట్ చేశారు. కామినేని కుడివైపు ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ జంక్షన్ ఎడమవైపు అండర్పాస్లను ప్రారంభించనున్నారు.
కామినేని ఫ్లై ఓవర్:
పొడవు: 940 మీటర్లు
వెడల్పు: 12 మీటర్లు
వ్యయం: రూ. 43 కోట్లు
ఎల్బీనగర్ అండర్పాస్:
పొడవు: 519 మీటర్లు
క్యారేజ్వే: 10.5 మీటర్లు
వ్యయం: రూ.14 కోట్లు