More

బావమరిదిపై గొడ్డలితో దాడి చేసిన బావ

26 Oct, 2015 15:36 IST

మానకొండూరు (కరీంనగర్) :  భూ వివాదంలో బావ.. బావమరిదిపై గొడ్డలితో దాడి చేశాడు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బావమరిది భార్య పై కూడా దాడికి దిగాడు. దీంతో వారిద్దరికీ  తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో సోమవారం జరిగింది.

గ్రామానికి చెందిన రొడ్డె కొమరయ్యకు, బావమరిది అయిన రమేష్‌కు మధ్య భూమి విషయంలో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో తనకు అన్యాయం చేశాడని ఆగ్రహించిన కొమరయ్య గొడ్డలితో బావమరిది రమేష్ పై దాడి చేశాడు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని భార్య ప్రమీలపై కూడా దాడి చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రొడ్డె కొమరయ్యను అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

తెలంగాణ ఎన్నికలు.. నేటి అప్‌డేట్స్‌

క్యాచ్‌ ద ట్రాప్‌..! 

పేలుడు పదార్థాల సరఫరా కేసులో.. 8 మందిపై ఎన్‌ఐఏ చార్జిషీట్‌ 

మేథ్స్‌లో మనోళ్లు తగ్గుతున్నారు

పనివేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్‌ చేయొద్దు