More

ఆ ప్యాకేజీలు వానాకాలం నాటికి పూర్తి కావాలి 

21 Apr, 2018 01:04 IST
ప్రతీకాత్మక చిత్రం

కాళేశ్వరం ప్రాజెక్టు 6, 7, 8 ప్యాకేజీలపై హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లోని 6,7, 8 ప్యాకేజీల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని.. వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆయన ఈ మూడు ప్యాకేజీల పనులపై సమీక్షించారు. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో కాళేశ్వ రం ప్రాజెక్టు చేపట్టామని.. పనులను శరవేగం గా కొనసాగించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఏడో ప్యాకేజీ పనుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్, అన్నారం బ్యారేజీల పనులు ఊపందుకున్నాయన్నారు. సమావేశంలో కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ శ్రీధర్, వివిధ కాంట్రాక్టు ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్‌ సీనియర్లు’

TS: పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో కాంగ్రెస్‌ ముందంజ..

తెలంగాణ రిజల్ట్‌..ప్రత్యక్షప్రసారం

అక్బరుద్దీన్‌ ఒవైసీ మెజారిటీపై సర్వత్రా ఆసక్తి

ఎన్నికల కౌంటింగ్‌: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు