More

వృద్ధ దంపతుల ఆత్మహత్య

6 Mar, 2017 10:46 IST

జెన్నారం(మంచిర్యాల): వృద్ధ దంపతులకు కొడుకు మాటలు కంఠ విషంగా మారాయి. కొడుకు మాటలు మింగుట పడని ఆదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో సతమతమవుతున్న వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
 
ఈ సంఘటన జిల్లాలోని జెన్నారం మండలం ధర్మారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గం ధర్మరాజు(80), పోచవ్వ(70) దంపతులు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతన్నారు. ఈ క్రమంలో భూమి విషయంలో తలెత్తిన వివాదాల్లో కొడుకుతో మనస్పర్థలు రావడంతో.. మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

2023 అలంపూర్‌ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే..

2023 కల్వకుర్తి ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే..

నా సపోర్ట్‌ ఆ పార్టీకే : జ్యోతక్క క్లారిటీ

చివరి ప్రచార సభలో కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..!

ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరెన్నో చేస్తాం