More

‍కరోనా భయం: ఊరొదిలిన జనం

8 Apr, 2020 08:08 IST
పొలం వద్ద గుడిసెలో నివసిస్తున్న కుటుంబం

15 రోజులుగా పొలం వద్దే నివాసం

 ప్రకృతే రక్షిస్తుందంటున్న ప్రజలు

సాక్షి, లింగంపేట(నిజాబామాద్‌) : కరోనా మహమ్మారికి భయపడి ఆ గ్రామస్తులు ఇళ్లను విడిచి పొలాల్లోకి తమ నివాసాలను మార్చారు. అక్కడే గుడిసెలు ఏర్పాటు చేసుకుని 15 రోజులుగా నివసిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. లింగంపేట మండలం కోమట్‌పల్లి గ్రామంలో సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌.. ఈ గ్రామస్తులనూ భయాందోళనకు గురిచేసింది. దీంతో తమను తాము కాపాడుకునేందుకు భౌతిక దూరాన్ని పాటించేందుకు కొన్ని కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. సుమారు 50 కుటుంబాలు ఇల్లు విడిచి పొలాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాయి. పొలం వద్ద గుడిసెలు వేసుకుని 15 రోజులుగా అక్కడే నివసిస్తున్నాయి. వారినికోసారి గ్రామంలోకి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకుంటున్నామని వారు తెలిపారు. తమకు ప్రకృతే రక్షణ ఇస్తుందని నమ్ముతున్నామని పేర్కొంటున్నారు.(‘చైనా యాప్‌ టిక్‌టాక్‌ను బహిష్కరించాలి’)

పాజిటివ్‌ వచ్చినా ఆరుబయట విహారం 


పొలం వద్ద ఏర్పాటు చేసుకున్న మంచె..

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా?

హైదరాబాద్‌లో వర్షం.. రానున్న మూడు రోజుల పాటు..

కేసీఆర్‌ చదివిన బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

క్లోన్డ్‌ వేలి ముద్రలతో దందా