More

మున్సిపాలిటీ భవనానికి కరెంట్ కట్!

28 Nov, 2015 17:05 IST

సిరిసిల్ల (కరీంనగర్) : బిల్లులు చెల్లించడం లేదంటూ విద్యుత్ సరఫరాలు నిలిపివేయడం గురించి మనం వింటూనే ఉంటాం. అయితే అదే రూల్ మున్సిపాలిటీ భవనానికి కూడా వర్తించింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటి భవనానికి శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మున్సిపాలిటీవారు గత ఏడాది కాలంగా బిల్లు కట్టకపోవడంతో.. ప్రస్తుతం కోటి పదిలక్షల రూపాయలు బకాయి పడింది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు.  దీంతో మున్సిపాలిటిలో అంధకారం అలుముకుంది. ఈ మేరకు సెస్ అదికారులు వివరాలు తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

150 కోట్ల మంది చూపు కామారెడ్డి వైపే : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌లో జవాన్‌ ఆత్మహత్య

కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌.. రంగంలోకి ఏఐసీసీ పెద్దలు!

అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం

అందరిలో ఒకరిగా ఉండటానికే చీర కట్టు : ఎమ్మెల్సీ కవిత