సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ శాంతి- సౌఖ్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల కలలు, ఆశయాలు నెరవేరేలా వారికి శక్తిని అందించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.(చదవండి: ఇదే నినాదం ఆర్బీకే విధానం కావాలి )
కేక్ కట్ చేసిన సీఎం జగన్
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సీఎం క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేసి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.