సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలన్నారు. ఈమేరకు సీఎం జగన్ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
ఏపీ: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
5 Oct, 2022 11:15 IST