More

24 గంటలు గడవక ముందే బాధితునికి అందిన సాయం

24 Dec, 2022 13:46 IST

సాక్షి, వైఎస్సార్‌ కడప: కడప జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి శుక్రవారం రోజున భూమయ్యపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు తన కుమారుని అనారోగ్య సమస్యను సీఎం దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సీఎం జగన్‌ తక్షణమే లక్ష రూపాయలు మంజూరు చేయడంతో పాటు వైద్య ఖర్చులు భరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

అయితే ఈ రోజు (శనివారం) ఉదయం బాధితుల కుటుంబానికి డిప్యూటీ సీఎం అంజాబాద్‌, కడప నగర మేయర్‌ సురేష్‌ బాబు, జెడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సిద్ధవటం యానాదయ్య లక్ష రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ఉద్యానశాఖ వ్యవసాయ సలహాదారులు ప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్లు&డివిజన్ ఇంఛార్జిలు, తదితరులు పాల్గొన్నారు.

చదవండి: (మరోమారు సీఎం జగన్‌ మానవత్వం)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్‌ పాత్ర: మంత్రి అంబటి

CWC 2023: భారత్‌-న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

‘బీజేపీకి పడిన ఆరు ఓట్లలో పురందేశ్వరి గారి ఓటు ఉందా?’

ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. రేపటి నుంచి టికెట్ల విక్రయం