More

సంక్షేమ సారధులకు సాదర స్వాగతం

27 May, 2022 05:10 IST
గుడివాడ మండలం లింగవరం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ బాలశౌరి, కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక

ఉత్సాహంగా సాగుతున్న ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ 

సాక్షి నెట్‌వర్క్‌: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో చేసిన అభివృద్ధి, ప్రజలకు కలిగిన ప్రయోజనాలు వివరిస్తూ సాగుతున్న ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. గ్రామ గ్రామానా ప్రజలు ఎదురేగి తమ నాయకులకు స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వరోజు గురువారం ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.

పేదలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నాయకులు ఇంటింటికీ వెళ్లి వివరించారు. తమ దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 95 శాతం హామీలను అమలు చేసిందని, రానున్న రెండేళ్లలో మరింత లబ్ధి చేకూరుస్తుందని నాయకులు వివరించారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ప్రజలందరికీ సీఎం వైఎస్‌ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

చంద్రమోహన్‌ మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

నంద్యాల బరి నుంచి ‘భూమా’ ఔట్‌!

మైనార్టీలను గత టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: సీఎం జగన్‌

కేబినెట్‌ కళ్లుగప్పి ఖజానాకు కన్నం