More

తండ్రి మందలింపు.. బాలిక ఆత్మహత్య 

26 Nov, 2021 07:23 IST

గుత్తి: తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని జెడ్‌.వీరారెడ్డి కాలనీకి చెందిన సుబ్బయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇటీవల సుబ్బయ్య రెండో కుమార్తె ఈరమ్మ (13) ఎవరికీ తెలియకుండా ఇంటిలోని దేవుడి హుండీలో ఉన్న డబ్బు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న సీఐ శ్యామరావు అక్కడకు చేరుకుని పరిశీలించి, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బిడ్డకు తల్లిపాలు అందుతున్నంత సంతోషంగా ఉంది: సీఎం జగన్‌

17న నూజివీడుకు సీఎం జగన్‌

‘జగన్‌ జైత్రయాత్రను ఆపేశక్తి ఎవరికీ లేదు’

‘మనందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది సీఎం జగనే’

మిత్ర ధర్మాన్ని విస్మరించిన రాజకీయాలివి!