More

విశాఖలో భారీగా ప్రభుత్వ భూమి స్వాధీనం

14 Nov, 2020 11:30 IST

ఏళ్ల తరబడి 70 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న బడాబాబులు

సాక్షి, విశాఖపట్నం : విశాఖలో భారీ ఎత్తున ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అడవివరం నుంచి శోత్యాం వెళ్లే మార్గంలో రామ అగ్రహారం వద్ద దాదాపు 110 ఎకరాల భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి మొక్కలను పెంచుతున్నారు. ఇందులో పది ఎకరాల భూమిని మినహాయిస్తే మిగతా భూమి అంతా ప్రభుత్వానిది. టీడీపీ హయాంలో కొందరు బడా బాబులు ఈ భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ దశలో రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి ప్రహరీ గోడను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70 ఎకరాల ఖరీదైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కృష్ణా ట్రిబ్యునల్‌ విచారణ రెండు నెలలు వాయిదా

మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రాచమల్లు

సామాజిక న్యాయంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శం: ఆర్‌.కృష్ణయ్య

పుట్టపర్తిలో నేడు రాష్ట్రపతి పర్యటన

విశాఖ: స్కూల్‌ ఆటో-లారీ ఢీ