More

విధిలేని పరిస్థితుల్లో 6 గేట్లు ఎత్తి నీరు వదిలాం: ఈఈ స్వరూప్

2 Jul, 2021 15:30 IST

ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

సాక్షి,విజయవాడ: విధి లేని పరిస్థితుల్లోనే తాము ప్రకాశం బ్యారేజీ ఆరు గేట్లు ఎత్తి సముద్రంలోకి నీరు వదిలినట్లు ఈఈ స్వరూప్‌ వెల్లడించారు. కాగా అధికారులు శుక్రవారం ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి ఆరు గేట్ల ద్వారా 8,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తితో పులిచింతల నుంచి బ్యారేజీకి నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయికి  చేరడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఈఈ స్వరూప్‌ మాట్లాడుతూ.. ''ఇండెంట్ లేకుండానే తెలంగాణ నీటిని వాడటంతో బ్యారేజీకి నీళ్లు వస్తున్నాయి. బ్యారేజీలో 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. తెలంగాణ జలవిద్యుత్ కేంద్రం నుంచి వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నాం. ఖరీఫ్‌కి రైతులు ఇంకా సన్నద్ధం కాలేదు. పంట కాలువలకు నీరు వదిలే అవసరం లేదు'' అని తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘సంక్షేమ రాజ్యం సృష్టికర్త సీఎం జగన్’

ఏపీ: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు జీవో జారీ

మౌలానా ఆజాద్ జ‌యంతి వేడుకలకు సీఎం జగన్‌

‘ఏపీలో సామాజిక విప్లవం.. ఆ ఘనత సీఎం జగన్‌దే’

రాజ్‌భవన్‌కు పదే పదే! అలా ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..