More

వేడెక్కుతున్న మన్యం

30 Apr, 2022 23:37 IST

పాడేరులో 37 డిగ్రీల నమోదు   

సాక్షి,పాడేరు : చల్లని ప్రాంతమైన జిల్లాలో ఎండ తీవ్రత నెలకొంది. శుక్రవారం సూర్యోదయం తరువాత  నుంచి ఎండ చుర్రుమంది. పాడేరులో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఏజెన్సీ వ్యాప్తంగా ఎండ తీవ్రత నెలకొనడంతో అన్ని వర్గాల ప్రజలు ఉష్ణ తాపంతో ఇబ్బందులు పడుతున్నారు.

వ్యవసాయ, ఉపాధిహామీ పనులకు వెళ్లే గిరిజనులతో పాటు పశువుల కాపరులు కూడా అధిక ఎండతో అవస్థలు పడ్డారు. పాడేరు వారపుసంతలో కూడా ఎండతో గిరిజనులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వరకు వేడిమి వాతావరణం నెలకొంది. మండల కేంద్రాలు ప్రధాన జంక్షన్లు, గ్రామాల్లో శీతల పానీయాల అమ్మకాలు జోరందుకున్నాయి.   

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

జనసేన x టీఢీపీ

రైతుల మోముల్లో ‘ధర’హాసం

రాజాంలో సామాజిక జైత్రయాత్ర

సామాజిక సాధికారతకు జై కొట్టిన కొత్తపేట 

దోచేసిన డబ్బును హవాలా మార్గంలో మళ్లించారు