More

మారటోరియం వడ్డీ మాఫీ విచారణ వాయిదా

28 Sep, 2020 12:23 IST

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్యంలో మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. గత విచారణలో కోర్టు కోరిన వివరాలు ఇచ్చేందుకు సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా మరి కొంత సమయం కావాలని కోరారు. రుణాల మారటోరియంకు సంబంధించి కేంద్రం, ఆర్బీఐ తీసుకున్న సమగ్ర వివరాలను సమర్పించాలని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ఎస్‌జీని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుదిదశలో ఉందని కోర్టుకు ఎస్‌జీ తెలిపారు. అదేవిధంగా సమగ్ర వివరాలు అందించేందుకు మరికొంత గడువు ఇవ్వాలని కోరారు. కేంద్రానికి గడువు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్ 5కి వాయిదా వేసింది. చదవండి: (ఆర్‌బీఐ, ప్రపంచ పరిణామాలే కీలకం!)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

జాబ్ రిజైన్ చేస్తే రూ.4 లక్షలు ఇస్తారు - అమెజాన్ ఫౌండర్ అదిరిపోయే ఆఫర్!

స్టాక్ మార్కెట్ అప్డేట్ - లాభాల్లో ట్రేడ్ అవుతున్న ఆసియా మార్కెట్లు

జియోఫోన్‌ ప్రైమా సేల్స్ షురూ - ధర రూ.2,599 మాత్రమే!

సెజ్‌ నిబంధనల సరళతరంపై దృష్టి - పియుష్‌ గోయల్‌

వచ్చేవారంలోగా రిఫండ్స్‌ జరగాలి