More

ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

5 Sep, 2020 09:18 IST
ప్రమాదంలో నుజ్జునుజ్జైన బస్సు

ఛత్తీష్‌ఘడ్‌ : ప్రయాణికులతో వెళుతున్న బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాతపడగా, మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున ఛత్తీష్‌ఘడ్‌, రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ బస్సు వలసకూలీలను ఒరిస్సా, గంజాంనుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తోంది. శనివారం తెల్లవారుజామున రాయ్‌పూర్‌లోని చెరి ఖేడి వద్దకు రాగానే ఓ ట్రక్కును ఢీకొట్టింది. ( బందరులో అదృశ్యం.. తెలంగాణలో హత్య )

దీంతో బస్సు నుజ్జునుజ్జయి అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు.  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మెదక్‌లో విషాదం.. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చి..

హైదరాబాద్‌: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. అక్కడికక్కడే అయిదుగురు మృతి..

ఇంజినీరింగ్ విద్యార్థిని హత్య

మహిళను వంచించి.. పెళ్లొద్దన్న ఎంపీ కుమారుడు!