More

20 లక్షలు తీసుకురా..లేకుంటే!

5 Mar, 2021 08:20 IST
ప్రతీకాత్మక చిత్రం

రఘునాథపాలెం: అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని రఘునాథపాలేనికి చెందిన ప్రశాంతి అనే వివాహిత ఫిర్యాదుతో ఐదుగురిపై గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. తన మేనత్త కొడుకు అయిన పారుపల్లి సురేష్‌తో ప్రశాంతికి 2005లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో రూ. 10 లక్షలు కట్నం ఇచ్చారు. అయితే, కొన్ని రోజులుగా తమ ఇల్లును అమ్మిడబ్బులు తేవాలని వత్తిడి చేస్తున్నారని, ఇంతటితో ఆగకుండా..రూ.20 లక్షలు ఇస్తేసరి లేకుంటే ప్రాణం తీస్తానని కూడా బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలు ఫిర్యాదు మేరకు  భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆడపడుచు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

చదవండి: వివాహేతర సంబంధం: భార్య నగలన్నీ ఆమెకు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పోలీస్‌ నీచ బుద్ధి.. నాలుగేళ్ల చిన్నారిని గదిలోకి తీసుకెళ్లి..

నెత్తురోడిన రహదారులు.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి

Nov 11th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

కన్నకూతురిని కత్తులతో నరికి..

యాదాద్రి కలెక్టరేట్‌లో దంపతుల ఘర్షణ