More

ఇండోనేషియా: లోయలో పడిన బస్సు.. 27 మంది మృతి

11 Mar, 2021 11:34 IST

జకర్తా: ఇండోనేషియాలోని జావా దీవిలో గురువారం తెల్లవారుజామున అర్థరాత్రి దాటాకా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోవడంతో 27 మంది మృతి చెందగా.. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని ఇస్లామిక్‌ జూనియర్‌ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు టీచర్లు కలిసి బుధవారం విహారయాత్రకు బయల్దేరారు.

బుధవారం అర్థరాత్రి దాటాకా సుమేడాంగ్‌ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీయగా.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా బస్సు బ్రేకులు పనిచేయకపోవడం వల్లే ప్రమాదం సంభంవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి:
తల తెంచుకొని శరీరాన్ని పెంచుకుంటుంది

బయటపడిన బంగారు కొండ.. మట్టికోసం ఎగబడ్డ జనం 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

టాప్‌ విరిగిన విమానం, భయంతో కేకలు: ఈ షాకింగ్‌ ఘటన ఎక్కడ?

యూట్యూబర్‌ క్రేజీ స్టంట్‌: ఏడు రోజులు సజీవ సమాధి, చివరికి...!

ఆస్ట్రేలియాను ఇపుడు కొంటారా? సత్య నాదెళ్ల షాకింగ్‌ స్పందన

ముంబయి 26/11 దాడులకు 15 ఏళ్లు.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

దుబాయ్ తెలుగు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం